Kesineni Nani : సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి భంగపాటు తప్పదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజధాని రైతుల మహా పాదయాత్రకు విజయవాడ నుంచి ముస్లిం మైనార్టీలు భారీ వాహన ర్యాలీ చేపట్టారు. అయితే ఈ ర్యాలీని ఎంపీ కేశినేని నాని ఆధ్వర్యంలో రైతులకు సంఘీభావంగా ముస్లిం మైనార్టీలు బయలుదేరారు. అయితే.. ఈ ర్యాలీని కేశినేని నాని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓ విజనరీ నాయకుడి ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే సత్తా జగన్మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. అంతేకాకుండా.. చంద్రబాబు చేసిన అభివృద్ధి తాను చేయలేని అసమర్థుడనని ఒప్పుకునే 3 రాజధానులంటున్నాడని ఆయన ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేది ప్రాంతీయ విద్వేషాలు రెచ్చకొట్టడం కోసమేనని ఆయన మండిపడ్డారు.
సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డికి భంగపాటు తప్పదని, ఒకే రాజధానిని ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణయించాలని విభజన చట్టం చెప్పిందన్నారు. అందుకనుగుణంగా అన్ని ప్రాంతాలకు సమదూరం, నీటి వనరు, రవాణ వనరులు ఉన్న అమరావతిని రాజధానిగా చంద్రబాబు ఎంపిక చేశారని ఆయన వెల్లడించారు. ఎన్నికల ముందు వరకు అమరావతికి మద్దతు తెలిపిన జగన్మోహన్ రెడ్డి మాట తప్పి మడమ తిప్పారని ఆయన ధ్వజమెత్తారు. రైతుల మహాపాదయాత్రకు కులమతాలకతీతంగా అన్ని ప్రాంతాల వారి మద్దతు రైతులకు ఉందని ఆయన వెల్లడించారు.
Also Read
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!