Kesineni Chinni: మాస్టర్ ప్లాన్ రెడీ.. వచ్చే 40 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి!
- దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ
- విజయవాడ ఎయిర్పోర్ట్లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం
- రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్కి ఫ్లైట్ కనెక్టివిటీ
- నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కనక దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందని, వచ్చే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి పనులు చేపడుతాం అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని చెప్పారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం అని.. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్కి 1500 కోట్లతో టెండర్లను ఆహ్వానించాం అని ఎంపీ కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.
ఏడాదిలో విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని ఎంపీ కేశినేని చిన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ… ‘సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. పార్లమెంట్ మెంబర్గా కూర్చో బెట్టిన సీఎం చంద్రబాబు, మా యువ కెరటం నారా లోకేష్ గార్లకు ధన్యవాదాలు. ఈ సంవత్సర కాలంలో నా తోడున్న మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంవత్సర కాలంలో సమస్యల మీద దృష్టిపెట్టాం. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్కి 1500 కోట్లతో టెండర్లు పిలిచాం. మధుర నగర్ ఆర్వోబీ, న్యూ రాజరాజేశ్వరి పేట ఆర్వోబీ వెస్ట్ ఈస్ట్ కలిపే వంతెనల డీపీఆర్ రెడీ చేశాం. మహానాడు రోడ్ నుండి రామవరప్పాడు రింగ్ వరకు ఫ్లై ఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది’ అని తెలిపారు.
Also Read
Also Read: Polavaram Project: రెండోరోజు పోలవరం నిర్వాసితుల నిరసన దీక్ష.. పునరావాసం, నష్టపరిహారం డిమాండ్!
‘నేషనల్ హైవేను గొల్లపూడి వరకు 6 లైన్స్ చేయడం జరిగింది. ఆటోనగర్కు ఉన్న అన్ని ప్రత్యామ్నాయ దారులను 100 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. కనకదుర్గ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేశాం. రాబోయే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గ గుడిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆటో నగర్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసు కోసం పోరాడుతున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాం. కొండ ప్రాంతాల్లో నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం’ అని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
The Paradise: ట్రైలర్ లేకుండానే థియేటర్లలోకి నాని ‘ది ప్యారడైజ్’!
-
BRICS: బ్రిక్స్ ఎలా ఏర్పడింది? బ్యాగ్రౌండ్ ఇదే!
-
Bans Non Dairy Paneer: తెలంగాణలో పనీర్కు బిగ్ షాక్.. ఏడాది బ్యాన్
-
AP Employees: ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం.
-
Putin: G7పై సెటైర్లు, BRICSపై ప్రశంసలు.. వెస్ట్రన్ దేశాలకు పుతిన్ కౌంటర్..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?