Kesineni Chinni: మాస్టర్ ప్లాన్ రెడీ.. వచ్చే 40 ఏళ్ల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి!
- దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ
- విజయవాడ ఎయిర్పోర్ట్లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం
- రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్కి ఫ్లైట్ కనెక్టివిటీ
- నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడ కనక దుర్గమ్మ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేయడం జరిగిందని, వచ్చే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గగుడి అభివృద్ధి పనులు చేపడుతాం అని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) తెలిపారు. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటి నుంచే సన్నద్ధమవుతున్నామని చెప్పారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం అని.. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం అని పేర్కొన్నారు. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్కి 1500 కోట్లతో టెండర్లను ఆహ్వానించాం అని ఎంపీ కేశినేని చిన్ని చెప్పుకొచ్చారు.
ఏడాదిలో విజయవాడలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పుస్తకాన్ని ఎంపీ కేశినేని చిన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ… ‘సుపరిపాలనలో తొలి అడుగు విజయవంతంగా పూర్తి చేసుకున్నాం. పార్లమెంట్ మెంబర్గా కూర్చో బెట్టిన సీఎం చంద్రబాబు, మా యువ కెరటం నారా లోకేష్ గార్లకు ధన్యవాదాలు. ఈ సంవత్సర కాలంలో నా తోడున్న మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సంవత్సర కాలంలో సమస్యల మీద దృష్టిపెట్టాం. విజయవాడకు అతిముఖ్యమైన రైల్వే లైన్స్కి 1500 కోట్లతో టెండర్లు పిలిచాం. మధుర నగర్ ఆర్వోబీ, న్యూ రాజరాజేశ్వరి పేట ఆర్వోబీ వెస్ట్ ఈస్ట్ కలిపే వంతెనల డీపీఆర్ రెడీ చేశాం. మహానాడు రోడ్ నుండి రామవరప్పాడు రింగ్ వరకు ఫ్లై ఓవర్ శాంక్షన్ చేయడం జరిగింది’ అని తెలిపారు.
Also Read
- Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
- WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
- CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
- RudraM-2: చైనా-పాక్ గుండెల్లో గుబులు.. రుద్రమ్-2 క్షిపణి పరీక్ష సక్సెస్..
Also Read: Polavaram Project: రెండోరోజు పోలవరం నిర్వాసితుల నిరసన దీక్ష.. పునరావాసం, నష్టపరిహారం డిమాండ్!
‘నేషనల్ హైవేను గొల్లపూడి వరకు 6 లైన్స్ చేయడం జరిగింది. ఆటోనగర్కు ఉన్న అన్ని ప్రత్యామ్నాయ దారులను 100 కోట్లతో అభివృద్ధి చేయడం జరుగుతుంది. కనకదుర్గ గుడి మాస్టర్ ప్లాన్ రెడీ చేశాం. రాబోయే 40 సంవత్సరాల అవసరాలకు తగ్గట్టు దుర్గ గుడిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. ఆటో నగర్ స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసు కోసం పోరాడుతున్నాం. విజయవాడ ఎయిర్పోర్ట్లో 70 శాతం పనులు పూర్తయ్యేలా చేశాం. రాబోవు రోజుల్లో వారణాసి, అలహాబాద్కి ఫ్లైట్ కనెక్టివిటీ చేస్తున్నాం. కృష్ణా పుష్కరాల నిర్వహణకు ఇప్పటినుంచే సన్నద్ధమవుతున్నాం. కొండ ప్రాంతాల్లో నీటి సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం’ అని ఎంపీ కేశినేని చిన్ని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record: హ్యాపీ రిటైర్మెంట్ కోసం నిమ్మకాయల చినరాజప్ప తీవ్ర ప్రయత్నాలు
-
Isaignani Ilaiyaraaja: స్వరాల దేవుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు.. ఇళయరాజా ప్రస్థానంలో ఎవ్వరికీ తెలియని షాకింగ్ ఫ్యాక్ట్స్ ఇవే!
-
Komatireddy Venkat Reddy : పవన్కు కోమటిరెడ్డి వార్నింగ్.. ‘తెలంగాణ ఎవరి జాగీరు కాదు’!
-
WMO Warning: ప్రమాదకర ఎల్నినో రాబోతుంది.. ప్రపంచ వాతావరణ సంస్థ హెచ్చరిక
-
CM Chandrababu: ఇళ్లు, ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ సమస్యకు ఫుల్ స్టాప్.. సీఎం కీలక ఆదేశాలు..
ట్రెండింగ్
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!