MP K. Laxman : ఒక వర్గం ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్టీ దేశాన్ని విచ్ఛిన్నం చేయడం, సమాజాన్ని కులం, భాష పేరుతో విభజన చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ ఉందని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. విచ్ఛిన్న కర శక్తులకు ఆ పార్టీ టిక్కెట్లు కూడా ఇచ్చిందని ఆయన మండిపడ్డారు. మత ప్రాతిపదికన దేశ విభజనకు కారణం కాంగ్రెస్ చర్యలు అని ఆయన ఆరోపించారు. దేశ ప్రతిష్టను దిగజార్చే విధంగా రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీ నాయకులు విదేశాల్లో మాట్లాడారని, రాహుల్ గాంధీ గురువు, రాజీవ్ గాంధీ అడ్వైజర్ శాం పిట్రోడ.. భారతీయుల పై విషపూరిత వ్యాఖ్యలు చేశారని ఆయన మండిపడ్డారు. ఇది జాత్యహంకారం కు నిదర్శనమన్నార లక్ష్మణ్. రాహుల్, సోనియా, ప్రియాంకా ఖండించకపోవడం దేశం పట్ల వారికున్న గౌరవం ఏంటో తెలుస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెస్ విధాన పరమైన ఆలోచనలు ప్రజల ముందు శాం పిట్రోడ పెట్టారని, శాం పిట్రోడా రాజీనామా ఒక డ్రామా… నష్ట నివారణ చర్య మాత్రమే అన్నారు. శాం పిట్రోడ ను బహిస్కరించాలి.. ఆ పార్టీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు లక్ష్మణ్.
అంతేకాకుండా..’రాహుల్ గాంధీ మొహబ్బత్ కు దుకాన్ లో ద్వేషం వ్యాపింప చేస్తున్నారు. డికే సురేష్ దక్షిణ భారత దేశం కావాలని డిమాండ్ చేస్తే కాంగ్రెస్ చర్యలు తీసుకోలేదు… రేవంత్ రెడ్డి అగ్గికి ఆజ్యం పోస్తున్నారు… రాహుల్ గాంధీ కూడా నార్త్ సౌత్ అని మాట్లాడారు.. ఓట్ల కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు.. వారసత్వ పన్ను గురుంచి కూడా పిట్రోడ మాట్లాడారు.. ఒక వర్గం ఓట్ల కోసమే సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు… రాజ్యాంగ నిర్మానం లో అంబేద్కర్ కన్నా నెహ్రూ కాంట్రిబ్యూషన్ ఎక్కువ అని శాం పిట్రోడా మాట్లాడిన కాంగ్రెస్ స్పందించదు.. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ రహస్య ఎజెండా తెలుసుకొని మాట్లాడు… లేకుంటే పుట్టి మునుగుతుంది.. పాకిస్తాన్ రాహుల్ గాంధీకి మద్దతు ఇస్తుంది.. పాకిస్తాన్ మీద ఉన్న ప్రేమ మాతృ దేశం మీద లేదు.. సిక్కుల మారణహోమం పై ఇప్పటికీ కాంగ్రెస్ క్షమాపణ చెప్పలేదు….. విభజన రాజకీయాల చేస్తున్న వారికి కాకుండా దేశం కోసం, దేశ సమగ్రత కోసం మోడీ కి ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్న’ అని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు.
Also Read
- Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
- YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
- OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
- OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్తో రచ్చ!
తాజావార్తలు
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
-
Ponguleti Srinivas : అధికారులపై మంత్రి యాక్షన్.. తహసీల్దార్ సస్పెండ్.!
-
OTR: కర్నూలు టీడీపీలో లీకుల కలకలం.. ఎమ్మెల్యేలపై కృష్ణమ్మ రిపోర్ట్తో రచ్చ!
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!