MP K.Laxman : విభజన చట్టానికి అనుగుణంగా సూపర్ పవర్ ప్రాజెక్ట్ను జాతికి అంకితం చేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విభజన చట్టానికి అనుగుణంగా సూపర్ పవర్ ప్రాజెక్ట్ ను జాతికి అంకితం చేశారని, RTI ద్వారా NTPC తాజా సమాచారం ప్రకారం తెలంగాణ కు NTPC నాలుగు సార్లు లేఖ రాసిందన్నారు రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత బీఅర్ఎస్ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు లో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందన్నారు. తక్కువ ఖర్చుతో వచ్చే పవర్ ను కాదని కమిషన్ల కోసం వేరొక చోట కొన్నారన్నారు. ఈ విషయాన్ని గతంలో కాంగ్రెస్ కూడా ఆరోపించిందని, ఇప్పుడు అధికారంలో కి వచ్చాక కాంగ్రెస్ కూడా NTPCతో ఒప్పందం కుదుర్చుకోవడం లేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా NTPC రెండు సార్లు లేఖ రాసిందని ఆయన పేర్కొన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించడం లేదని, ఒక వేళ తెలంగాణ ప్రభుత్వం స్పందించకపోతే వేరొక రాష్ట్రానికి మళ్లిస్తామని ntpc హెచ్చరిస్తుందన్నారు.
అంతేకాకుండా.. ‘కానీ కాంగ్రెస్ స్పందించక పోవడం చూస్తే గత బి అర్ ఎస్ లాగే కాంగ్రెస్ కూడా కమిషన్ల కోసం వేరొక చోట కొనలనుకుంటుందా..? మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న పవర్ లో 80 శాతం మన రాష్ట్రానికి ఇవ్వడానికి ntpc సిద్ధంగా ఉంది.. వంద రోజులు ముఖ్యమంత్రి గా రోజుకు 18 గంటలు పని చేశాను అని రేవంత్ రెడ్డి చెబుతున్నాడు.. ఇప్పుడు ఎన్నికల వేల పిసీసీ చీఫ్ అవతారం ఏత్తుతా అని మాట్లాడుతున్నాడు.. రేవంత్ నువ్వు గేట్లు ఎత్తి రాజకీయాలు చేస్తే.. కరెంటు సంగతి ఎవరు చూడాలి..? పగలు కరెంట్ లేక రాత్రి మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి ఓ రైతు పాముకాటుకు బలయ్యాడు.. వేసవి ఇప్పుడే మొదలైంది.. అప్పుడే కరెంటు కోతలు స్టార్ట్ చేసారు.. ఛత్తీస్ ఘడ్ తో ఒప్పందం కుదుర్చుకుని బి అర్ ఎస్ రాష్ట్రానికి ఆర్థిక భారం పెంచింది.. కాంగ్రెస్ కూడా అదే దారిలో వెళ్తుందా..
Also Read
మొన్న అసెంబ్లీ లో స్వయంగా అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ అవినీతి నీ వెలికి తీసి చర్యలు తీసుకుంటా అన్నారు.. కానీ ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదు.. భూ మాఫియా ను వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటా అన్నాడు.. మరి ఇప్పుడు స్పందించకపోవడం చూస్తే వారితి చేతులు కల్పడనికి సిద్ధం అయ్యారా.. రాహుల్ గాంధీ కి న్యాయ స్థానాల పై నమ్మకం లేదు.. కోర్టుల పై కూడా నమ్మకం లేదు.. కేవలం దేశాన్ని తిట్టడానికి రాహుల్ గాంధీ పని చేస్తున్నాడు.. దేశంలో ఉంటూ దేశానికి డెమోక్రసీ లేదని మాట్లాడుతాడు.. నిజంగా తప్పు చేయకపోతే కేజ్రివాల్ ఎందుకు విచారణకు హాజరు కాలేదు.. తొమ్మిది సార్లు ఈ డీ నోటీసులు ఇచ్చిన కూడా ఒక్క సారి కూడా కేజ్రివాల్ స్పందించలేదు.. అన్ని ఆధారాలు ఉండే ఈడీ కేజ్రీవాల్ నీ అరెస్ట్ చేసింది..’ అని ఆయన అన్నారు.
తాజావార్తలు
-
UAE-Iran: యూఏఈలో నెతన్యాహూ పర్యటన.. ఇరాన్ తీవ్ర ఆగ్రహం..
-
Elon Musk: చైనాలో మస్క్ మేనియా.. ఇంటర్నెట్ను షేక్ చేస్తున్న షియోమీ బాస్తో సెల్ఫీ
-
Health Tips : రాత్రి పిండి.. ఉదయం రొట్టె..? ఈ నిజం తెలిస్తే షాక్ అవుతారు!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అద్భుత అవకాశం.. సీనియర్ జట్టులోకి ఒక్క అడుగు దూరంలో..
-
Modi-Putin: మోడీ, రాష్ట్రపతికి పుతిన్ సందేశం.. యూపీ తుఫాన్ మృతులకు సంతాపం
ట్రెండింగ్
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!
-
48MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 1TB స్టోరేజ్ తో Sony Xperia 1 VIII లాంచ్.. ధర ఎంతంటే.?