MP Derek O’Brien: ‘పార్లమెంట్ చీకటి గదిగా మారింది’.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల ప్రారంభంలో లోక్సభ సమావేశాల సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా అక్కడి నుంచి దూకి ఎంపీల మధ్యకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ‘లోతైన, చీకటి గది’గా మారిందని, భద్రతా ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.
2001లో పార్లమెంట్పై దాడి జరిగినప్పుడు మూడు రోజుల పాటు పార్లమెంట్లో బహిరంగ చర్చ జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ఓబ్రెయిన్ తెలిపారు. అప్పటి ప్రధాని, హోంమంత్రి.. లోక్సభ, రాజ్యసభల్లో ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. కాగా.. ఈ ఏడాది జరిగిన దాడులను చూస్తే ప్రభుత్వం మౌనంగా ఉంది. హోంమంత్రి తమ ప్రకటనను డిమాండ్ చేయడంతో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. నేడు పార్లమెంట్ లోతైన, చీకటి గదిగా మారిందని తెలిపారు.
Also Read
- RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
- IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
- Anushka Sharma: విరాట్ ఫినిష్ ఆఫ్ ఇట్స్ స్టైల్.. అనుష్క శర్మ రియాక్షన్ మాములుగా లేదుగా.!
- Vaibhav Sooryavanshi: ఒకే ఒక్కడు.. బోలెడు రికార్డులు.. క్యూ కట్టిన అవార్డ్స్ ఇవే.!
2001 Parliament attack: In 3 working days, a full discussion in Parliament. PM gave statement in Rajya Sabha, Home Minister in Lok Sabha
2023 breach: GOVT SILENT. 146 MPs suspended for demanding discussion & statement from Home Min
Parliament turned into a deep, dark chamber
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) December 27, 2023
Read Also: Mohan Yadav: యూపీ సీఎంను ఫాలో అవుతున్న మధ్యప్రదేశ్ సీఎం.. బుల్డోజర్కు పనిచెప్పిన మోహన్ యాదవ్
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ డిసెంబర్ 13న లక్నో నివాసి సాగర్ శర్మ, మైసూర్ నివాసి డి.మనోరంజన్ బూట్లలో దాచుకున్న రంగు గొట్టాలతో పార్లమెంటులోకి ప్రవేశించి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. లోక్సభ సందర్శకుల గ్యాలరీ నుండి సభలోకి దూకిన వ్యక్తికి సింహా కార్యాలయం పాస్లు జారీ చేసిందని, ఇది రాజకీయ వివాదానికి దారితీసిందని.. శీతాకాల సమావేశాల కోసం 143 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేశారని ఆ తర్వాత బయటపడింది.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి ప్రతిపక్ష ఎంపీలు.. భద్రతా ఉల్లంఘనపై చర్చ జరగాలని, హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎంపీలు తమ డిమాండ్లను సభలో పెద్దఎత్తున లేవనెత్తడంతో సభా కార్యక్రమాలను పదే పదే వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే క్రమశిక్షణా రాహిత్యంతో లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 46 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
RCB Fans Celebrations: అర్థరాత్రి RCB ఫ్యాన్స్ రచ్చ రచ్చ.. పోలీసుల లాఠీచార్జ్.!
-
IPL 2026 Awards Winners List: వైభవ్ సూర్యవంశీ హవా.. ఐపీఎల్ 2026లో అవార్డ్స్ గెలుచుకున్న స్టార్ ప్లేయర్స్ వీరే..!
-
Lyca : వరుస డిజాస్టర్లతో ‘లైకా ప్రొడక్షన్స్’ సంక్షోభం.. కాపాడే సినిమా ఏది?
-
Gujarat Titans: గుజరాత్ టైటాన్స్ ఆటగాళ్లకు తప్పిన పెను ప్రమాదం.. తృటిలో బతికి బయటపడ్డారు.. ఊపిరి పీల్చుకున్న బీసీసీఐ!
-
Masoud Pezeshkian: అమెరికాతో ఉద్రిక్తతల మధ్య ఇరాన్లో రాజకీయ సంక్షోభం.. అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ రాజీనామా..!
ట్రెండింగ్
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!