MP Derek O’Brien: ‘పార్లమెంట్ చీకటి గదిగా మారింది’.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల ప్రారంభంలో లోక్సభ సమావేశాల సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా అక్కడి నుంచి దూకి ఎంపీల మధ్యకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ‘లోతైన, చీకటి గది’గా మారిందని, భద్రతా ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.
2001లో పార్లమెంట్పై దాడి జరిగినప్పుడు మూడు రోజుల పాటు పార్లమెంట్లో బహిరంగ చర్చ జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ఓబ్రెయిన్ తెలిపారు. అప్పటి ప్రధాని, హోంమంత్రి.. లోక్సభ, రాజ్యసభల్లో ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. కాగా.. ఈ ఏడాది జరిగిన దాడులను చూస్తే ప్రభుత్వం మౌనంగా ఉంది. హోంమంత్రి తమ ప్రకటనను డిమాండ్ చేయడంతో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. నేడు పార్లమెంట్ లోతైన, చీకటి గదిగా మారిందని తెలిపారు.
Also Read
- Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
- IND Vs PAK: పాకిస్థాన్పై భారత్ ఘన విజయం.. ధావన్ హాఫ్ సెంచరీతో మెరుపులు..
- New Smart Phone: 9020mAH బ్యాటర్, 12GB RAM, AMOLED డిస్ప్లే.. విడుదలకు ముందే లీకైన ఫీచర్స్..
- YS Jagan: ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకే అరెస్టులు: వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
2001 Parliament attack: In 3 working days, a full discussion in Parliament. PM gave statement in Rajya Sabha, Home Minister in Lok Sabha
2023 breach: GOVT SILENT. 146 MPs suspended for demanding discussion & statement from Home Min
Parliament turned into a deep, dark chamber
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) December 27, 2023
Read Also: Mohan Yadav: యూపీ సీఎంను ఫాలో అవుతున్న మధ్యప్రదేశ్ సీఎం.. బుల్డోజర్కు పనిచెప్పిన మోహన్ యాదవ్
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ డిసెంబర్ 13న లక్నో నివాసి సాగర్ శర్మ, మైసూర్ నివాసి డి.మనోరంజన్ బూట్లలో దాచుకున్న రంగు గొట్టాలతో పార్లమెంటులోకి ప్రవేశించి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. లోక్సభ సందర్శకుల గ్యాలరీ నుండి సభలోకి దూకిన వ్యక్తికి సింహా కార్యాలయం పాస్లు జారీ చేసిందని, ఇది రాజకీయ వివాదానికి దారితీసిందని.. శీతాకాల సమావేశాల కోసం 143 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేశారని ఆ తర్వాత బయటపడింది.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి ప్రతిపక్ష ఎంపీలు.. భద్రతా ఉల్లంఘనపై చర్చ జరగాలని, హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎంపీలు తమ డిమాండ్లను సభలో పెద్దఎత్తున లేవనెత్తడంతో సభా కార్యక్రమాలను పదే పదే వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే క్రమశిక్షణా రాహిత్యంతో లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 46 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
IMD Weather Update : ఒకచోట వరదలు.. మరోచోట వాన జాడే లేదు.!
-
Kaatalan OTT Release: నిజమైన ఏనుగుతో ఫైట్.. సునీల్, లోకేష్ నటించిన 8.2 రేటింగ్ క్రైమ్ థ్రిల్లర్ ఓటీటీలోకి!
-
Josh Hazlewood: 13 నెలల నిరీక్షణకు తెర.. మళ్లీ టెస్టు బరిలోకి.. ప్రత్యర్థి ఎవరంటే..
-
KJQ Pre Release Event: ఫ్యాన్స్ కు పూనకాలే.. డిసెంబర్ 2న ప్రభాస్ ‘ఫౌజీ’ ప్రీమియర్స్ .. KJQ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంట్రెస్టింగ్ అప్డేట్
-
Child Murder : మద్యం మత్తులో కన్నబిడ్డను చెరువులో ముంచిన తల్లి..
ట్రెండింగ్
-
Vegetable Cleaning : కూరగాయలను ఉప్పు నీటితో కడుగుతున్నారా.? ఈ విషయాలు తప్పక తెలుసుకోండి.!
-
Car Maintenance: కారులో ఎలుకల బెడదా? ఈ 5 చిట్కాలతో వేల రూపాయల నష్టాన్ని తప్పించుకోండి.!
-
Door Mat Cleaning : డోర్మ్యాట్ ఇలా వాష్ చేస్తే చాలు.. దుమ్ము, దుర్వాసన, క్రిములు మాయం.!
-
Oil-Free Poori: చుక్క నూనె లేకుండా పూరీలు.. చేసేయండి ఇలా..!
-
Airtel యూజర్లకు గుడ్ న్యూస్.. రూ.1,849 ప్లాన్తో ఏడాది పాటు అన్ లిమిటెడ్ కాల్స్..!