Mohan Yadav: యూపీ సీఎంను ఫాలో అవుతున్న మధ్యప్రదేశ్ సీఎం.. బుల్డోజర్కు పనిచెప్పిన మోహన్ యాదవ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డాక్టర్ మోహన్ యాదవ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మధ్యప్రదేశ్లో పరిపాలన చాలా చురుగ్గా కనిపిస్తుంది. తాజాగా మధ్యప్రదేశ్లోని నర్మదాపురంలో ఓ కేసు నమోదైంది. రెండు రోజుల క్రితం ఓ బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందన్న వార్త రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. ఇప్పుడు ఈ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం.. యూపీ సీఎం ఫార్ములాను ఉపయోగిస్తుంది. నర్మదాపురంలోని బిటిఐ ప్రాంతంలో రెండు రోజుల క్రితం సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో నలుగురు నిందితులలోని ఇద్దరు నిందితుల ఇళ్లపై మోహన్ యాదవ్ ప్రభుత్వం బుల్డోజర్ను ఉపయోగించింది.
Read Also: YSRCP: పలు నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్ కసరత్తు..
Also Read
- Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
- Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
- Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
- India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
సామూహిక అత్యాచార ఘటన 26వ తేదీ రాత్రి నర్మదాపురంలోని బీటీఐ ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై.. బాలిక మంగళవారం సాయంత్రం పోలీస్ స్టేషన్కు చేరుకుని విషయాన్ని అంతా పోలీసులకు చెప్పింది. వెంటనే పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి.. 24 గంటల్లోనే నిందితుల ఇళ్లను కూల్చివేసే ప్రక్రియను ప్రారంభించారు. కాగా.. మాజీ ముఖ్యమంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ నియోజకవర్గం బుద్నీలో ఓ ప్రైవేట్ కంపెనీలో 22 ఏళ్ల యువతి పనిచేస్తుంది.
Read Also: Central Govt: జమ్మూ కాశ్మీర్ ముస్లిం లీగ్పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధింపు
ఈ ఘటనను సీరియస్ గా తీసుకున్న మోహన్ యాదవ్ ప్రభుత్వం.. పోలీసులు తక్షణమే చర్యలు చేపట్టాలని కోరింది. దీంతో.. పోలీసులు నలుగురు నిందితుల్లో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం.. రెవెన్యూ శాఖ, పోలీసులు నిందితులపై చర్యలు తీసుకున్నారు. నిందితులిద్దరి అక్రమ నిర్మాణంపై బుల్డోజర్లను ఉపయోగించారు. నిందితుల ఇంటిని కూల్చే సమయంలో నగర మేజిస్ట్రేట్ సంపద సరాఫ్, తహసీల్దార్ దేవశంకర్ ధుర్వే, ఎస్డీఓపీ పరాగ్ సైనీ, పోలీసులు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!