MP Derek O’Brien: ‘పార్లమెంట్ చీకటి గదిగా మారింది’.. కేంద్రంపై తీవ్ర విమర్శలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల ప్రారంభంలో లోక్సభ సమావేశాల సమయంలో ప్రేక్షకుల గ్యాలరీలో కూర్చున్న ఇద్దరు వ్యక్తులు హఠాత్తుగా అక్కడి నుంచి దూకి ఎంపీల మధ్యకు వెళ్లడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ సందర్భంగా.. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ‘లోతైన, చీకటి గది’గా మారిందని, భద్రతా ఉల్లంఘనపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తోందని ఆరోపించారు.
2001లో పార్లమెంట్పై దాడి జరిగినప్పుడు మూడు రోజుల పాటు పార్లమెంట్లో బహిరంగ చర్చ జరిగిందని సోషల్ మీడియా వేదికగా ఎక్స్లో ఓబ్రెయిన్ తెలిపారు. అప్పటి ప్రధాని, హోంమంత్రి.. లోక్సభ, రాజ్యసభల్లో ప్రకటనలు చేశారని గుర్తు చేశారు. కాగా.. ఈ ఏడాది జరిగిన దాడులను చూస్తే ప్రభుత్వం మౌనంగా ఉంది. హోంమంత్రి తమ ప్రకటనను డిమాండ్ చేయడంతో 146 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. నేడు పార్లమెంట్ లోతైన, చీకటి గదిగా మారిందని తెలిపారు.
Also Read
- Tim David Bike Celebration: బంగ్లాదేశ్పై ఆసీస్ క్లీన్స్వీప్.. బైక్పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
- Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
- Jayashankar Bhupalpally: ఘోర రోడ్డు ప్రమాదం.. DTO పైకి దూసుకెళ్లిన బొగ్గు టిప్పర్.!
- ENG vs NZ: దెబ్బ అదుర్స్ కదూ.. బెంబేలెత్తించిన మ్యాట్ హెన్రీ.. ఇంగ్లాండ్పై న్యూజిలాండ్ భారీ విజయం.!
2001 Parliament attack: In 3 working days, a full discussion in Parliament. PM gave statement in Rajya Sabha, Home Minister in Lok Sabha
2023 breach: GOVT SILENT. 146 MPs suspended for demanding discussion & statement from Home Min
Parliament turned into a deep, dark chamber
— Derek O'Brien | ডেরেক ও'ব্রায়েন (@derekobrienmp) December 27, 2023
Read Also: Mohan Yadav: యూపీ సీఎంను ఫాలో అవుతున్న మధ్యప్రదేశ్ సీఎం.. బుల్డోజర్కు పనిచెప్పిన మోహన్ యాదవ్
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ డిసెంబర్ 13న లక్నో నివాసి సాగర్ శర్మ, మైసూర్ నివాసి డి.మనోరంజన్ బూట్లలో దాచుకున్న రంగు గొట్టాలతో పార్లమెంటులోకి ప్రవేశించి అలజడి సృష్టించిన విషయం తెలిసిందే. లోక్సభ సందర్శకుల గ్యాలరీ నుండి సభలోకి దూకిన వ్యక్తికి సింహా కార్యాలయం పాస్లు జారీ చేసిందని, ఇది రాజకీయ వివాదానికి దారితీసిందని.. శీతాకాల సమావేశాల కోసం 143 మంది ప్రతిపక్ష ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేశారని ఆ తర్వాత బయటపడింది.
ఈ ఘటన జరిగినప్పటి నుంచి ప్రతిపక్ష ఎంపీలు.. భద్రతా ఉల్లంఘనపై చర్చ జరగాలని, హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ఎంపీలు తమ డిమాండ్లను సభలో పెద్దఎత్తున లేవనెత్తడంతో సభా కార్యక్రమాలను పదే పదే వాయిదా వేయాల్సి వచ్చింది. అలాగే క్రమశిక్షణా రాహిత్యంతో లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 46 మంది విపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.
తాజావార్తలు
-
Mukesh Ambani: షేర్ మార్కెట్ ‘సూపర్ కింగ్’గా ముకేశ్ అంబానీ.. అంబానీ తదుపరి టార్గెట్ అదేనా?
-
Tim David Bike Celebration: బంగ్లాదేశ్పై ఆసీస్ క్లీన్స్వీప్.. బైక్పై స్టేడియం చుట్టేసిన టిమ్ డేవిడ్.. వైరల్ వీడియో.!
-
Love & war : మూవీ సెట్లో కార్మికుడి మృతి… 50 లక్షలు డిమాండ్
-
SSC CGL 2026: ఎస్ఎస్సీ సీజీఎల్ 12,256 పోస్టులు.. దరఖాస్తుకు ఈరోజే లాస్ట్ ఛాన్స్.. వెంటనే అప్లై చేసుకోండి
-
Tollywood : టాలీవుడ్ 2027 మోస్ట్ అవేటెడ్ పాన్ ఇండియా మూవీస్ ఇవే..
ట్రెండింగ్
-
Thoothukudi Storm: సుడిగాలి బీభత్సం.. భారీ నష్టం, ఆరుగురికి తీవ్ర గాయాలు.!
-
Harmanpreet Kaur: వారి వల్లే మ్యాచ్ ఓడిపోయాం.. టీమిండియా కెప్టెన్ ఫైర్.!
-
Floor Cleaning Tips : ఇంట్లో జిడ్డు నేలకు గుడ్బై.. అద్దంలా మెరిపించే సూపర్ చిట్కాలు.!
-
Gas Burner Cleaning Tips: బర్నర్ రంధ్రాలు బ్లాక్ అయ్యాయా.? ఈ ట్రిక్ సూపర్.!
-
Pesara Idli: పెసరట్టు కాదు.. ‘పెసర ఇడ్లీ’ ట్రై చేశారా? రుచి చూస్తే లోట్టలేసుకుంటూ తింటారు భయ్యో.!