Daggubati Purandeswari: స్వలాభాపేక్ష ఏ రోజూ చూసుకోలేదు.. నాకు మరో ఆలోచన లేదు!
- ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్
- మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పురందేశ్వరి
- పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో స్వలాభాపేక్ష ఏ రోజూ తాను చూసుకోలేదని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. తన రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదన్నారు. తనను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని తాను ఆశిస్తున్నానని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. బీజేపీ జెండాను మాధవ్కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను పురంధేశ్వరి అప్పగించారు. మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పురందేశ్వరి మాట్లాడారు.
‘2013లో బీజేపీలోకి నేను వచ్చాను. బీజేపీలోకి వచ్చిన నాటి నుంచి నాకు పార్టీ గౌరవం ఇస్తోంది. అన్ని విధాలుగా నాకు గౌరవం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు. పీవీఎన్ మాధవ్ తండ్రి చలపతిరావు పోరాట యోధులు. చలపతిరావు గారి నుంచి పట్టుదల, ఎలా ముందుకు వెళ్లాలో నేర్చుకున్నాను. వెంకయ్య నాయుడు నుంచి చనువు, చొరవ నేర్చుకున్నాను. ఏపీ బీజేపీకి జీవితం అంకితం చేసిన నాయకుల నుంచి నేను చాలా నేర్చుకున్నా. నన్ను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలు ఇరువురికి నా ధన్యవాదాలు’ అని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చెప్పారు.
Also Read
- Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
- Monsoon: తొలకరిపై అన్నదాతలకు ఐఎండీ గుడ్న్యూస్.. 2-3 రోజుల్లో కేరళకు రుతుపవనాలు
- Janasena: పవన్ సభకు అనుమతి నిరాకరణపై జనసేన ఆగ్రహం.. తెలంగాణ పోలీసుల వైఖరిని తప్పుబట్టిన పార్టీ
- Virat Kohli: ‘ఆస్ట్రేలియాలో కోహ్లీ ఒక ప్రభంజనం’.. ఆర్సీబీ గెలుపుపై ఆసీస్ డిప్యూటీ పీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Also Read: Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?
‘కార్యకర్త సహకారం లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవడం సాధ్యం కాదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా రెండేళ్లల్లో పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేశా. నాకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించా. స్వలాభాపేక్ష ఏ రోజూ నేను చూసుకోలేదు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. నా రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఒకొక్క మాట ఆచితూచి మాట్లాడాలి’ అని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సూచించారు. గత రెండేళ్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి పని చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Donald Trump: “నీకు పిచ్చి పట్టింది, నేను లేకపోతే నువ్వు జైల్లో ఉండేవాడివి” నెతన్యాహుపై ట్రంప్ ఫైర్
-
Italy Earthquake: ఇటలీలో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 6.1 తీవ్రత
-
Buchi Babu: “నేను పెద్ది 100 సార్లు చూసి.. ఏడ్చేశా”.. పెద్ది మూవీపై బుచ్చిబాబు సంచలన వ్యాఖ్యలు!
-
Ram Charan : మీకోసం రక్తం చిందించడానికైనా సిద్ధమే.. చనిపోయే వరకు ఎంటర్టైన్ చేస్తా!
-
Telangana Traffic Challans: వాహనదారులకు అలర్ట్.. చలాన్లపై తెలంగాణ ప్రభుత్వ కీలక హెచ్చరిక..
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!