Daggubati Purandeswari: స్వలాభాపేక్ష ఏ రోజూ చూసుకోలేదు.. నాకు మరో ఆలోచన లేదు!
- ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్
- మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పురందేశ్వరి
- పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేశా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రాజకీయాల్లో స్వలాభాపేక్ష ఏ రోజూ తాను చూసుకోలేదని బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చెప్పారు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. తన రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదన్నారు. తనను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని తాను ఆశిస్తున్నానని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి పేర్కొన్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా మాధవ్ ఎన్నికయ్యారు. బీజేపీ జెండాను మాధవ్కు ఇచ్చి.. పార్టీ బాధ్యతలను పురంధేశ్వరి అప్పగించారు. మాధవ్ ప్రమాణ స్వీకారోత్సవ సభలో పురందేశ్వరి మాట్లాడారు.
‘2013లో బీజేపీలోకి నేను వచ్చాను. బీజేపీలోకి వచ్చిన నాటి నుంచి నాకు పార్టీ గౌరవం ఇస్తోంది. అన్ని విధాలుగా నాకు గౌరవం ఇచ్చిన పార్టీకి కృతజ్ఞతలు. పీవీఎన్ మాధవ్ తండ్రి చలపతిరావు పోరాట యోధులు. చలపతిరావు గారి నుంచి పట్టుదల, ఎలా ముందుకు వెళ్లాలో నేర్చుకున్నాను. వెంకయ్య నాయుడు నుంచి చనువు, చొరవ నేర్చుకున్నాను. ఏపీ బీజేపీకి జీవితం అంకితం చేసిన నాయకుల నుంచి నేను చాలా నేర్చుకున్నా. నన్ను ప్రోత్సహించిన, ప్రతిఘటించిన కార్యకర్తలు ఇరువురికి నా ధన్యవాదాలు’ అని రాజమండ్రి ఎంపీ పురంధేశ్వరి చెప్పారు.
Also Read
- Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
- Sunil Gavaskar: "పంత్, సంజూ కాదు.. 2027 వరల్డ్ కప్లో వికెట్ కీపర్ అతడే".. గవాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
- Sreesanth Challenges Harbhajan: "దమ్ముంటే రింగ్లోకి రా.!" హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
Also Read: Gold Rate Today: భారీ షాకిచ్చిన బంగారం ధరలు.. తులంపై ఎంత పెరిగిందో తెలుసా?
‘కార్యకర్త సహకారం లేకపోతే ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలవడం సాధ్యం కాదు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలిగా రెండేళ్లల్లో పార్టీ బలోపేతం కోసం నా వంతు కృషి చేశా. నాకు అప్పగించిన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తించా. స్వలాభాపేక్ష ఏ రోజూ నేను చూసుకోలేదు. పార్టీకి లాభం చేకూర్చాలనే భావన తప్ప.. నా రెండు సంవత్సరాల ప్రస్ధానంలో మరే ఆలోచన లేదు. పీవీఎన్ మాధవ్ కూడా కార్యకర్తలకు అనుగుణంగా వెళతారని నేను ఆశిస్తున్నాను. ప్రభుత్వంలో భాగస్వాములుగా ఒకొక్క మాట ఆచితూచి మాట్లాడాలి’ అని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి సూచించారు. గత రెండేళ్లుగా ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా పురంధేశ్వరి పని చేసిన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
Gaza: గాజాలో మరో విషాదం.. ప్రమాదంలో 30వేల మంది పిల్లల జీవితాలు..!
-
Smriti Mandhana: క్రికెట్ చరిత్రలోనే తొలి ప్లేయర్గా స్మృతి మంధాన.. పురుష క్రికెటర్లకు కూడా సాధ్యం కాని రేర్ రికార్డు!
-
Aliens: ఏలియన్స్ మనుషులకు కనిపించకపోడానికి కారణమేంటి? సైంటిస్టులు చెప్పిన 3 రీజన్స్
-
Monsoon 2026: రైతన్నల్లో మొదలైన టెన్షన్.. జూన్ 4న ఎంట్రీ ఇచ్చినా ముందుకు సాగని రుతుపవన ద్రోణి!
-
Amazon Prime Day Sale 2026: అమెజాన్ ప్రైమ్ డే సేల్ 2026 తేదీ వచ్చేసింది.. ప్రైమ్ మెంబర్లకు భారీ డిస్కౌంట్లు
ట్రెండింగ్
-
పార్లమెంట్కూ చేరిన FIFA World Cup జోష్.. వైకింగ్ పడవ ప్రయాణాన్ని అనుకరించిన ఎంపీలు.! వీడియో వైరల్..
-
Sreesanth: ఆమె లేకపోతే ఆత్మహత్య చేసుకునేవాడిని.. తీహార్ జైల్లో నరకం అనుభవించా!
-
Sreesanth Challenges Harbhajan: “దమ్ముంటే రింగ్లోకి రా.!” హర్భజన్ సింగ్కు ఓపెన్ ఛాలెంజ్ విసిరిన శ్రీశాంత్.!
-
Ravi Kishan : ‘రేసుగుర్రం’ విలన్పై నెటిజన్ల ఫన్నీ ట్రోల్స్.. ‘గుట్కాసన్’ అంటూ మీమ్స్ వైరల్.!
-
5 Best Indoor Plants : ఇంట్లో గ్రీనరీ కావాలా.? మట్టిలేకుండా నీటిలో పెరిగే 5 ప్లాంట్స్ ఇవే.!