MP Chamala Kiran: తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్!
- కేసీఆర్ అర్జెంట్గా సీఎం ఎందుకు అవ్వాలో
- బీఆర్ఎస్ వద్దనే కదా ప్రజలు ఇంటికి పంపింది
- బీఆర్ఎస్ వాళ్ల డబ్బులు ప్రజలు వసూలు చేయండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్ అని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్ అర్జెంట్గా సీఎం ఎందుకు అవ్వాలో కేటీఆర్ చెప్పాలన్నారు. బీఆర్ఎస్ వద్దనే కదా ప్రజలు ఇంటికి పంపిందని, ప్రభుత్వం మీద విష ప్రచారం ఎందుకు? అని ప్రశ్నించారు. తుపాకీ రాముడు, అగ్గిపెట్టె హరీష్, లిక్కర్ కవిత తప్పితే.. పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్లు ఇప్పుడు ఎవరు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకే రాని కేసీఆర్ను మరలా సీఎం చేయాలా?, పదేళ్లు అధికారంలో ఉండి సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు అని ఎంపీ చామల ప్రశ్నించారు.
‘రజతోత్సవం ఏ పార్టీదో కేటీఆర్ చెప్పాలి. టీఆర్ఎస్ పార్టీనే లేదు, బీఆర్ఎస్ ఏర్పడి 25 ఏళ్లు కాలేదు. కేసీఆర్ అర్జెంట్గా సీఎం ఎందుకు అవ్వాలో కేటీఆర్ చెప్పాలి. అర్జెంట్గా వచ్చి ఏం చేస్తాడు.. పదేళ్లు 7 వేల కోట్లు అప్పులు చేశారు. మీరు వద్దనే కదా ప్రజలు ఇంటికి పంపింది, ప్రభుత్వం మీద విష ప్రచారం ఎందుకు?. తెలంగాణ గొంతుక కాదు.. గొంతు కోసిన పార్టీ బీఆర్ఎస్. తుపాకీ రాముడు, అగ్గిపెట్టె హరీష్, లిక్కర్ కవిత తప్పితే.. పార్టీ పెట్టినప్పుడు ఉన్నోళ్లు ఇప్పుడు ఎవరు ఉన్నారు. తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి.. కోట్లు ఖర్చు చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్లు, బీఆర్ఎస్ వాళ్ల డబ్బులు ఇంటింటికి రావాలి, ప్రజలు వసూలు చేయండి’ అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.
Also Read
- RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
- Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
- Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
- Asim Munir: టెహ్రాన్కు వెళ్లిన పాక్ ఆర్మీ చీఫ్ మునీర్.. శాంతి చర్చలపై సర్వత్రా ఆసక్తి
‘దళితున్ని సీఎం చేస్తా అని మోసం చేసినందుకు కేసీఆర్ సీఎం అవ్వలా?, మూడు ఎకరాలు ఇస్తా అని మోసం చేసినందుకు సీఎంను చేయాలా?, కాళేశ్వరం పేరుతో దోచుకున్నదుకా?, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకే రాని కేసీఆర్ను మరలా సీఎం చేయాలా?. కేసీఆర్ మంచి అడ్మినిస్ట్రేటర్ అయితే తెలంగాణ అప్పుల పాలు ఎట్లా అయ్యేది. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బదనం చేయడం తప్పితే ఏముంది? మీరు చేసేది. కాళేశ్వరం పేరుతో దక్షిణ తెలంగాణని ఎందుకు పక్కన పెట్టారు. కేసీఆర్ బాపు కాదు. రజతోత్సవంలో ప్రజలకు ఆయన క్షమాపణ చెప్పాలి. కేసీఆర్ దోచుకున్నది అందరికీ తెలుసు. కేసీఆర్..రజతోత్సవంలో బీసీని అధ్యక్షుని చేస్తారు అని సమాచారం ఉంది. మేము ఆహ్వానిస్తున్నాం. కాంగ్రెస్ చేసిన కులగణన వల్ల బీఆర్ఎస్ పార్టీకి బీసీ అధ్యక్షుని ఆలోచన వచ్చింది’ అని ఎంపీ చామల రైతు మహోత్సవం కార్యక్రమంలో చెప్పారు.
తాజావార్తలు
-
Story Board: దొరికిపోయిన బ్లాక్ టిక్కెట్ల ముఠా..
-
RCB Vs SRH: దయాదాక్షిణ్యాలు చూపించలేదు.. ఆర్సీబీ బౌలర్లను ఆడుకున్న కాటేరమ్మ కొడుకులు..
-
Bhatti Vikramarka : 3 ట్రిలియన్ల ఆర్థిక వ్వవస్థే లక్ష్యం
-
Twisha Sharma: ట్విషా శర్మ మృతి కేసులో భర్త సమర్థ్ సింగ్కు షాక్.. న్యాయ వృత్తి నుంచి సస్పెండ్
-
Abhishek Sharma: మళ్లీ రికార్డుల వేట.. కాటేరమ్మ కొడుకు అరుదైన రికార్డు..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!