Badugula Lingaiah Yadav : ఎంపీ అర్వింద్ బేషరత్తుగా క్షమాపణ చెప్పాలి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నల్లగొండ జిల్లాలోని హాలియా టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంపీ ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో వాళ్ళ దుర్మార్గాలన్నీ ప్రజలకు తెలిసిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలులో అడ్డంగా దొరికిన దొంగలు ఇప్పటికే జైలు పాలయ్యారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)తో నాయకుల బండారం బయటపడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. దేశంలో ఇప్పటికే బీజేపీ ఎనిమిది రాష్ట్రాల్లో ప్రభుత్వాలను అస్థిరపరిచి రాష్ట్రాల హక్కులను కాలరాస్తు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెప్తారని బడుగు లింగయ్య యాదవ్ మండిపడ్డారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని పక్కదారి పట్టించేందుకే ఎమ్మెల్సీ కవితపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
Also Read : Church Pastor: పాస్టర్ వింత చేష్టలు.. దేవుడు ఆ పని చేయమంటున్నాడంటూ
రాజ్యాంగబద్ధంగా పదవిలో ఉన్న గవర్నర్ కూడా బీజేపీ నేతగా పనిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఎమ్మెల్సీ కవిత ఇంటిపై దాడి చేసినప్పుడు స్పందించని గవర్నర్ ధర్మపురి అర్వింద్ ఇంటిపై కొంతమంది అలజడి సృష్టించడంతో వెంటనే స్పందించి ఆమె నైజాన్ని బయట పెట్టుకున్నారని ఆయన విమర్శించారు. ఇప్పటికైనా ధర్మపురి అర్వింద్ ఎమ్మెల్సీ కవిత పై చేసిన ఆరోపణలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. ఇటీవల సీఎం కేసీఆర్ తన కుమార్తె కవితను బీజేపీలో చేరాలని కోరారని వ్యాఖ్యానించారు. దీనిపై స్పందిస్తూ ఎంపీ అర్వింద్ చేసిన వ్యాఖ్యలకు టీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అయితే.. ఈ దాడి తరువాత ఎమ్మెల్సీ కవిత ఎంపీ అర్వింద్పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read
- Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
- 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
- EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
- Supreme Court: సుప్రీం కోర్టుకు హనీమూన్ మర్డర్ కేసు.. ఏం జరిగిందంటే..!
తాజావార్తలు
-
Delhi: దేశ వ్యాప్తంగా బాంబ్ బెదిరింపులు.. ఘజియాబాద్ వ్యక్తి అరెస్ట్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
Khammam Police : ఖమ్మంలో ఖాకీ కుంభకోణం.. పోలీసులే దోపిడీ ముఠాలో కీలక సభ్యులు
-
EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్న్యూస్.. 74 ఏళ్లుగా ఉన్న కీలక సమస్యకు పరిష్కారం
-
Dhruv Vikram: మైత్రీ మూవీ మేకర్స్ 4వ తమిళ సినిమాలో హీరోగా ధృవ్ విక్రమ్
ట్రెండింగ్
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!