Migration: ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న మతస్తులు వీళ్లే.. హిందువులు కూడా..!
- ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న ప్రజలలో క్రైస్తవులే ఎక్కువ
- రెండవ స్థానంలో ముస్లింలు
- మూడవ స్థానంలో హిందువులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నిసార్లు జీవనోపాధి కోసం.. కొన్నిసార్లు విద్య కోసం.. కొన్నిసార్లు సంక్షోభం కారణంగా ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్లి స్థిరపడతారు. గత కొన్ని శతాబ్దాలుగా ప్రజలు ఇతర దేశాలలో స్థిరపడుతున్నారు. గ్లోబల్ విలేజ్ భావనలో ఇది ప్రధాన అంశంగా పరిగణిస్తారు. ప్యూ రీసెర్చ్ డేటాను పరిశీలిస్తే.. ప్రపంచ జనాభాలో 3.6 శాతం మంది ప్రజలు తాము జన్మించిన దేశంలో నివసించడం లేదని తేలింది. వారి సంఖ్య దాదాపు 28 కోట్లు ఉంది. ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. మతపరంగా ఇతర దేశాల్లో నివసిస్తున్న ప్రజల డేటాను పరిశీలిస్తే, క్రైస్తవులు అగ్రస్థానంలో ఉన్నారు.
CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు
Also Read
- Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
- IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
- Devipatnam Tiger Attack: పోలవరం జిల్లాలో పెద్దపులి బీభత్సం.. 14 దూడలను చంపిన పులి!
- ACB Raids: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం.. మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు ఇంట్లో ఏసీబీ సోదాలు.!
ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న ప్రజలలో క్రైస్తవుల సంఖ్య అత్యధికంగా 47 శాతం ఉన్నారు. ఆ తర్వాత.. ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. వలస వచ్చిన వారిలో వారి జనాభా 29 శాతం ఉంది. వలస వెళ్లే వారిలో హిందువులు మూడవ స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింల కంటే కేవలం 5 శాతం మంది హిందువులు మాత్రమే వలస వెళ్లి స్థిరపడ్డారు. అలాగే.. బౌద్ధులు 4 శాతంతో నాల్గవ స్థానంలో ఉండగా.. యూదులు 1 శాతం ఉన్నారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వలస వెళ్లిన వారిలో 13 శాతం మంది తమను తాము నాస్తికులుగా చెప్పుకునేవారే ఉన్నారు. అలాంటి వ్యక్తులలో క్రైస్తవం, ఇస్లాం మూడవ స్థానంలో ఉన్నారు.
MP: మధ్యప్రదేశ్లో దారుణం.. భర్తను కొట్టిచంపిన భార్య, కొడుకు
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా వలసలు వేగంగా పెరిగాయి. తమ దేశాన్ని వదిలి ఇతర దేశాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య 83 శాతం పెరిగితే.. ప్రపంచ జనాభా 47 శాతం మాత్రమే పెరిగింది. పెద్దలు, పిల్లలందరినీ నిర్వాసితుల్లో చేర్చినట్లు నివేదిక పేర్కొంది. ఏ సమయంలోనైనా వలసల ద్వారా దేశం విడిచిపెట్టిన వ్యక్తులు ఇందులో ఉన్నారు. నివేదికలో.. యుద్ధం, ఆర్థిక సంక్షోభం, కరువు వంటి విపత్తులు కూడా వలసలకు ప్రధాన కారకాలుగా పరిగణించారు. వలసలకు ప్రధాన కారణం మతపరమైన హింస అని నివేదిక చెబుతోంది. నిజానికి మైనారిటీల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. దురాగతాల కారణంగా వారు సాధారణంగా తమ స్వంత మతాన్ని అనుసరించే ప్రజలు.. ఎక్కువగా ఉన్న దేశాలలో నివసించడానికి ఇష్టపడతారు. ఇలాంటి వలసలు అనేక దేశాల జనాభాలో పెనుమార్పులకు కూడా కారణమయ్యాయని నివేదిక చెబుతోంది.
తాజావార్తలు
-
Suriya : టి.జె. జ్ఞానవేల్ దర్శకత్వంలో ఐదు రూపాయల డాక్టర్ బయోపిక్లో సూర్య..
-
Nellore Politics: గ్రౌండ్ వర్క్ స్టార్ట్.. రాజకీయాల్లోకి ప్రముఖ నాయకుల కూతుళ్లు, కోడళ్లు!
-
IND vs NZ: కివీస్ గడ్డపై టీమిండియా సవాల్.. 2 టెస్టులు, 5 వన్డేలు, 5 టీ20లు.. న్యూజిలాండ్ టూర్ పూర్తి షెడ్యూల్ విడుదల.!
-
SIGMA : జాసన్ సంజయ్ అచ్చు విజయ్ లాగే ఉంటాడు : సందీప్ కిషన్
-
Cocktail 2 Trailer: ట్రయాంగిల్ లవ్ స్టోరీలో రష్మిక మందన్నా.. యూత్ను అట్రాక్ట్ చేస్తున్న ట్రైలర్
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!