Migration: ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న మతస్తులు వీళ్లే.. హిందువులు కూడా..!
- ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న ప్రజలలో క్రైస్తవులే ఎక్కువ
- రెండవ స్థానంలో ముస్లింలు
- మూడవ స్థానంలో హిందువులు.
కొన్నిసార్లు జీవనోపాధి కోసం.. కొన్నిసార్లు విద్య కోసం.. కొన్నిసార్లు సంక్షోభం కారణంగా ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్లి స్థిరపడతారు. గత కొన్ని శతాబ్దాలుగా ప్రజలు ఇతర దేశాలలో స్థిరపడుతున్నారు. గ్లోబల్ విలేజ్ భావనలో ఇది ప్రధాన అంశంగా పరిగణిస్తారు. ప్యూ రీసెర్చ్ డేటాను పరిశీలిస్తే.. ప్రపంచ జనాభాలో 3.6 శాతం మంది ప్రజలు తాము జన్మించిన దేశంలో నివసించడం లేదని తేలింది. వారి సంఖ్య దాదాపు 28 కోట్లు ఉంది. ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. మతపరంగా ఇతర దేశాల్లో నివసిస్తున్న ప్రజల డేటాను పరిశీలిస్తే, క్రైస్తవులు అగ్రస్థానంలో ఉన్నారు.
CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు
Also Read
- Ramchander Rao: "కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు".. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
- Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
- Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
- Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న ప్రజలలో క్రైస్తవుల సంఖ్య అత్యధికంగా 47 శాతం ఉన్నారు. ఆ తర్వాత.. ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. వలస వచ్చిన వారిలో వారి జనాభా 29 శాతం ఉంది. వలస వెళ్లే వారిలో హిందువులు మూడవ స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింల కంటే కేవలం 5 శాతం మంది హిందువులు మాత్రమే వలస వెళ్లి స్థిరపడ్డారు. అలాగే.. బౌద్ధులు 4 శాతంతో నాల్గవ స్థానంలో ఉండగా.. యూదులు 1 శాతం ఉన్నారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వలస వెళ్లిన వారిలో 13 శాతం మంది తమను తాము నాస్తికులుగా చెప్పుకునేవారే ఉన్నారు. అలాంటి వ్యక్తులలో క్రైస్తవం, ఇస్లాం మూడవ స్థానంలో ఉన్నారు.
MP: మధ్యప్రదేశ్లో దారుణం.. భర్తను కొట్టిచంపిన భార్య, కొడుకు
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా వలసలు వేగంగా పెరిగాయి. తమ దేశాన్ని వదిలి ఇతర దేశాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య 83 శాతం పెరిగితే.. ప్రపంచ జనాభా 47 శాతం మాత్రమే పెరిగింది. పెద్దలు, పిల్లలందరినీ నిర్వాసితుల్లో చేర్చినట్లు నివేదిక పేర్కొంది. ఏ సమయంలోనైనా వలసల ద్వారా దేశం విడిచిపెట్టిన వ్యక్తులు ఇందులో ఉన్నారు. నివేదికలో.. యుద్ధం, ఆర్థిక సంక్షోభం, కరువు వంటి విపత్తులు కూడా వలసలకు ప్రధాన కారకాలుగా పరిగణించారు. వలసలకు ప్రధాన కారణం మతపరమైన హింస అని నివేదిక చెబుతోంది. నిజానికి మైనారిటీల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. దురాగతాల కారణంగా వారు సాధారణంగా తమ స్వంత మతాన్ని అనుసరించే ప్రజలు.. ఎక్కువగా ఉన్న దేశాలలో నివసించడానికి ఇష్టపడతారు. ఇలాంటి వలసలు అనేక దేశాల జనాభాలో పెనుమార్పులకు కూడా కారణమయ్యాయని నివేదిక చెబుతోంది.
తాజావార్తలు
-
Ramchander Rao: “కేఏ పాల్ కూడా పార్టీ పెట్టారు”.. కవిత పార్టీపై బీజేపీ అధ్యక్షుడి ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Sathi Leelavathi: లావణ్య త్రిపాఠి ‘సతీ లీలావతి’.. రిలీజ్ డేట్ ఫిక్స్!
-
Masala Bhindi Recipe: ఇంట్లోనే సింపుల్గా ధాబా స్టైల్ మసాలా భిండి.. క్షణాల్లో రెడీ..
-
Russia Ukraine War: ఉక్రెయిన్పై రష్యా ‘మెగా’ దాడి.. 666 క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డ పుతిన్ సైన్యం!
-
Akshay Kumar: అక్షయ్ కుమార్ కుమార్తెకు సైబర్ వేధింపులు.. నిందితుడు అరెస్ట్!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!