Migration: ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న మతస్తులు వీళ్లే.. హిందువులు కూడా..!
- ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న ప్రజలలో క్రైస్తవులే ఎక్కువ
- రెండవ స్థానంలో ముస్లింలు
- మూడవ స్థానంలో హిందువులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నిసార్లు జీవనోపాధి కోసం.. కొన్నిసార్లు విద్య కోసం.. కొన్నిసార్లు సంక్షోభం కారణంగా ప్రజలు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వలస వెళ్లి స్థిరపడతారు. గత కొన్ని శతాబ్దాలుగా ప్రజలు ఇతర దేశాలలో స్థిరపడుతున్నారు. గ్లోబల్ విలేజ్ భావనలో ఇది ప్రధాన అంశంగా పరిగణిస్తారు. ప్యూ రీసెర్చ్ డేటాను పరిశీలిస్తే.. ప్రపంచ జనాభాలో 3.6 శాతం మంది ప్రజలు తాము జన్మించిన దేశంలో నివసించడం లేదని తేలింది. వారి సంఖ్య దాదాపు 28 కోట్లు ఉంది. ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం.. మతపరంగా ఇతర దేశాల్లో నివసిస్తున్న ప్రజల డేటాను పరిశీలిస్తే, క్రైస్తవులు అగ్రస్థానంలో ఉన్నారు.
CM Chandrababu: అచ్యుతాపురం ఘటన.. హై లెవల్ విచారణ కమిటీ ఏర్పాటు
Also Read
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
- 10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
- Cyber Crime: నకిలీ పాప్-అప్ టోల్ఫ్రీ నంబర్లతో బురిడీ.. అంతర్జాతీయ సైబర్ మోసాల ముఠా గుట్టురట్టు..
ఇతర దేశాలకు వలస వెళ్లి నివసిస్తున్న ప్రజలలో క్రైస్తవుల సంఖ్య అత్యధికంగా 47 శాతం ఉన్నారు. ఆ తర్వాత.. ముస్లింలు రెండవ స్థానంలో ఉన్నారు. వలస వచ్చిన వారిలో వారి జనాభా 29 శాతం ఉంది. వలస వెళ్లే వారిలో హిందువులు మూడవ స్థానంలో ఉన్నారు. క్రైస్తవులు, ముస్లింల కంటే కేవలం 5 శాతం మంది హిందువులు మాత్రమే వలస వెళ్లి స్థిరపడ్డారు. అలాగే.. బౌద్ధులు 4 శాతంతో నాల్గవ స్థానంలో ఉండగా.. యూదులు 1 శాతం ఉన్నారు. అయితే ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వలస వెళ్లిన వారిలో 13 శాతం మంది తమను తాము నాస్తికులుగా చెప్పుకునేవారే ఉన్నారు. అలాంటి వ్యక్తులలో క్రైస్తవం, ఇస్లాం మూడవ స్థానంలో ఉన్నారు.
MP: మధ్యప్రదేశ్లో దారుణం.. భర్తను కొట్టిచంపిన భార్య, కొడుకు
మరో షాకింగ్ విషయం ఏమిటంటే.. ప్రపంచవ్యాప్తంగా వలసలు వేగంగా పెరిగాయి. తమ దేశాన్ని వదిలి ఇతర దేశాల్లో స్థిరపడుతున్న వారి సంఖ్య 83 శాతం పెరిగితే.. ప్రపంచ జనాభా 47 శాతం మాత్రమే పెరిగింది. పెద్దలు, పిల్లలందరినీ నిర్వాసితుల్లో చేర్చినట్లు నివేదిక పేర్కొంది. ఏ సమయంలోనైనా వలసల ద్వారా దేశం విడిచిపెట్టిన వ్యక్తులు ఇందులో ఉన్నారు. నివేదికలో.. యుద్ధం, ఆర్థిక సంక్షోభం, కరువు వంటి విపత్తులు కూడా వలసలకు ప్రధాన కారకాలుగా పరిగణించారు. వలసలకు ప్రధాన కారణం మతపరమైన హింస అని నివేదిక చెబుతోంది. నిజానికి మైనారిటీల్లో ఇలాంటి ధోరణి ఎక్కువగా కనిపిస్తోంది. దురాగతాల కారణంగా వారు సాధారణంగా తమ స్వంత మతాన్ని అనుసరించే ప్రజలు.. ఎక్కువగా ఉన్న దేశాలలో నివసించడానికి ఇష్టపడతారు. ఇలాంటి వలసలు అనేక దేశాల జనాభాలో పెనుమార్పులకు కూడా కారణమయ్యాయని నివేదిక చెబుతోంది.
తాజావార్తలు
-
R Praggnanandhaa: చెస్ వరల్డ్ లో భారత్ ఆధిపత్యం.. సెయింట్ లూయిస్ రాపిడ్ అండ్ బ్లిట్జ్ టైటిల్ గెలిచిన ప్రజ్ఞానంద
-
Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
-
Nothing Phone 3: నథింగ్ Phone 3 పై భారీ డిస్కౌంట్.. రూ.40,000 తగ్గింపు, 50MP ట్రిపుల్ కెమెరాలు, Snapdragon 8s Gen 4!
-
National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
ట్రెండింగ్
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!