Nitish Kumar: ఇండియా కూటమిలో మరికొన్ని రాజకీయ పార్టీలు.. నితీష్ కీలక వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nitish Kumar: ముంబయిలో జరగబోయే సమావేశంలో ప్రతిపక్ష ఇండియా కూటమిలో మరికొన్ని రాజకీయ పార్టీలు చేరే అవకాశం ఉందని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఆదివారం తెలిపారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న వివిధ పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన జేడీయూ నాయకుడు.. అయితే కూటమిలో చేరే అవకాశం ఉన్నవారి పేర్లను వెల్లడించలేదు. అయితే సీట్ల పంపకం వంటి ఎన్నికలకు సంబంధించిన పద్ధతులపై సమావేశంలో చర్చిస్తామని చెప్పారు.
నితీష్ కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ.. ముంబయిలో జరగబోయే సమావేశంలో వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికల కోసం ఇండియా కూటమి వ్యూహాలను చర్చిస్తామన్నారు. సీట్ల పంపకం వంటి అంశాలు చర్చించబడతాయన్నారు. అనేక ఇతర అజెండాలు ఖరారు చేయబడతాయని నితీష్ స్పష్టం చేశారు. మరికొన్ని రాజకీయ పార్టీలు ఇండియా కూటమిలో చేరతాయన్నారు. 2024 లోక్సభ ఎన్నికలకు ముందు గరిష్ట సంఖ్యలో పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని కోరుకుంటున్నామని.. ఆ దిశగానే పనిచేస్తున్నామన్నారు. తనకు ఎలాంటి కోరిక లేదన్నారు.
Also Read
- OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
- OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
- RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
- Mamata Banerjee-EC: మమతా బెనర్జీకి ఈసీ లేఖ.. 4 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశం
Read Also: Uttar Pradesh: వీడు మాములోడు కాదు.. ఇంట్లో నుంచి వెళ్లిపోవడానికి సినిమా చూపించాడుగా
వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికల్లో కేంద్రంలోని అధికార బీజేపీని సంయుక్తంగా ఎదుర్కోవడానికి ఏర్పాటైన 26-పార్టీల ప్రతిపక్ష కూటమి ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో రెండుసార్లు సమావేశమైంది. ముందుగా జూన్ 23న పాట్నాలో, ఆపై జూలై 17, 18 తేదీల్లో బెంగళూరులో రెండు సార్లు సమావేశమైంది. ఈ కూటమి తమ మూడో సమావేశాన్ని ఆగస్టు 31, సెప్టెంబర్ 1 తేదీల్లో ముంబైలో నిర్వహించనుంది.ఇదిలావుండగా,.. పాట్నాలోని బెయిలీ రోడ్లోని హర్తాలీ మోర్ సమీపంలో కొనసాగుతున్న లోహియా పథ చక్ర నిర్మాణ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. దుర్గాపూజలోపు ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పారు.
తాజావార్తలు
-
OTR : ఉభయ గోదావరిలో కుల రాజకీయం.. కొత్త టర్న్?
-
Story Board : అయోధ్యలో టీటీడీ తరహా బాధ్యతాయుతమైన బోర్డు అవసరమా..?
-
Telangana Cabinet : తెలంగాణ క్యాబినెట్ బిగ్ డెసిషన్స్..!
-
OTR: జోరుగా సాగర సమరం.. సాగర్ బీఆర్ఎస్లో ఎంసీ కోటిరెడ్డి vs నోముల భగత్..
-
OTR: 14 ఏళ్ళుగా లేని పాలక మండలి.. శ్రీ సీతారామచంద్ర స్వామి మీద తెలంగాణ సర్కార్ శీతకన్నేసిందా?
ట్రెండింగ్
-
RCB అభిమానులకు నథింగ్ సర్ప్రైజ్.. జూలై 7న Nothing Phone (4b) RCB Edition విడుదల
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!