T20 WC: టీ20 వరల్డ్ కప్ టీమ్ను ఎంపిక చేసిన టీమిండియా మాజీ క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమ్ను ఎంపిక చేశారు. వాస్తవానికి.. ఐపీఎల్ ముగియగానే, వెస్టిండీస్-అమెరికాలో టీ20 ప్రపంచకప్ ఉండనుంది. అందుకోసం ఏప్రిల్ నెలాఖరులోగా టీమిండియాను ఎంపిక చేయనున్నారు. 2013 తర్వాత టీమిండియా.. ఐసీసీ ట్రోఫీ ఒక్కటి కూడా అందుకోలేదు. ఈ క్రమంలో.. ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడానికి టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. అందుకోసం.. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించి.. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో.. టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ భారీ జోస్యం చెప్పారు. అతను టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేశారు.
Tragedy: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు.. అన్న ఇద్దరు చెల్లెల్లు మృతి
Also Read
- Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
- US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
- I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. 'ఐబొమ్మ', 'బప్పం' వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
- CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
కాగా.. భారత జట్టులో కనీసం 10 నుంచి 12 మంది ఆటగాళ్లకు చోటు ఖాయమైంది. అయితే.. మహమ్మద్ కైఫ్ తన జట్టును స్టార్ స్పోర్ట్స్ షో ‘ఫాలో ది బ్లూస్’లో టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది ఆటగాళ్ల గురించి చెప్పారు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు మాత్రమే చోటు కల్పించాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లకు చోటు ఇవ్వలేదు. నాలుగో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం ఇచ్చాడు. మరోవైపు.. రింకూ సింగ్ స్థానంలో ఫినిషర్ పాత్రలో రియాన్ పరాగ్ని ఎంచుకున్నారు.
TDP Chief: అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్వేర్ను పరిచయం చేసింది.. అందుకోసమే..!
బ్యాటింగ్ ఆర్డర్ గురించి కైఫ్ మాట్లాడుతూ.. “రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో, హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో, రిషబ్ పంత్ 6వ స్థానంలో ఉంటారు. బ్యాటింగ్లో డెప్త్ అవసరం కాబట్టి తాను చాలా మంది ఆల్రౌండర్లను ఉంచుతానని తెలిపారు. కాబట్టి అక్షర్ పటేల్ 7వ స్థానంలో, రవీంద్ర జడేజా 8వ స్థానంలో ఉంటారని చెప్పారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఉంటారని” కైఫ్ తెలిపారు.
తాజావార్తలు
-
Nalgonda: రక్తసంబంధానికే మాయని మచ్చ.. ఆస్తి కోసం ఎంత పని చేశారంటే..!
-
US-Iran: ఇరాన్ ప్రతిపాదనలు తిరస్కరించిన అమెరికా.. మళ్లీ యుద్ధం తప్పదా?
-
I BOMMA: తెలుగుతో పాటు ఇతర భాషల సినిమాలు ఉచితంగా స్ట్రీమింగ్.. ‘ఐబొమ్మ’, ‘బప్పం’ వెబ్సైట్లపై కేసు దర్యాప్తు ముమ్మరం.!
-
CSK vs SRH: బ్రెవిస్ బ్లాస్ట్.. కమిన్స్ క్లాస్.. సన్ రైజర్స్ టార్గెట్ ఎంతంటే.?
-
Blackmail : వరుణ్ సందేశ్ ‘బ్లాక్ మెయిల్’.. లాభాల్లో టెక్నీషియన్స్కు వాటా?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!