T20 WC: టీ20 వరల్డ్ కప్ టీమ్ను ఎంపిక చేసిన టీమిండియా మాజీ క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమ్ను ఎంపిక చేశారు. వాస్తవానికి.. ఐపీఎల్ ముగియగానే, వెస్టిండీస్-అమెరికాలో టీ20 ప్రపంచకప్ ఉండనుంది. అందుకోసం ఏప్రిల్ నెలాఖరులోగా టీమిండియాను ఎంపిక చేయనున్నారు. 2013 తర్వాత టీమిండియా.. ఐసీసీ ట్రోఫీ ఒక్కటి కూడా అందుకోలేదు. ఈ క్రమంలో.. ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడానికి టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. అందుకోసం.. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించి.. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో.. టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ భారీ జోస్యం చెప్పారు. అతను టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేశారు.
Tragedy: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు.. అన్న ఇద్దరు చెల్లెల్లు మృతి
Also Read
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
- Monsoon Diseases: వర్షాకాలంలో విజృంభించే ప్రమాదకర వ్యాధులు ఇవే... వైద్యుల హెచ్చరిక
కాగా.. భారత జట్టులో కనీసం 10 నుంచి 12 మంది ఆటగాళ్లకు చోటు ఖాయమైంది. అయితే.. మహమ్మద్ కైఫ్ తన జట్టును స్టార్ స్పోర్ట్స్ షో ‘ఫాలో ది బ్లూస్’లో టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది ఆటగాళ్ల గురించి చెప్పారు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు మాత్రమే చోటు కల్పించాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లకు చోటు ఇవ్వలేదు. నాలుగో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం ఇచ్చాడు. మరోవైపు.. రింకూ సింగ్ స్థానంలో ఫినిషర్ పాత్రలో రియాన్ పరాగ్ని ఎంచుకున్నారు.
TDP Chief: అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్వేర్ను పరిచయం చేసింది.. అందుకోసమే..!
బ్యాటింగ్ ఆర్డర్ గురించి కైఫ్ మాట్లాడుతూ.. “రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో, హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో, రిషబ్ పంత్ 6వ స్థానంలో ఉంటారు. బ్యాటింగ్లో డెప్త్ అవసరం కాబట్టి తాను చాలా మంది ఆల్రౌండర్లను ఉంచుతానని తెలిపారు. కాబట్టి అక్షర్ పటేల్ 7వ స్థానంలో, రవీంద్ర జడేజా 8వ స్థానంలో ఉంటారని చెప్పారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఉంటారని” కైఫ్ తెలిపారు.
తాజావార్తలు
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దొరకని స్థానం.. కారణం ఇదే..
-
Actor Raghu Karumanchi: దీవానా నా రియల్ స్టోరీ
-
Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
-
Rajamouli : జక్కన్న సినిమా అంటే చుక్కలే
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?