T20 WC: టీ20 వరల్డ్ కప్ టీమ్ను ఎంపిక చేసిన టీమిండియా మాజీ క్రికెటర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ20 వరల్డ్ కప్ కోసం టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ టీమ్ను ఎంపిక చేశారు. వాస్తవానికి.. ఐపీఎల్ ముగియగానే, వెస్టిండీస్-అమెరికాలో టీ20 ప్రపంచకప్ ఉండనుంది. అందుకోసం ఏప్రిల్ నెలాఖరులోగా టీమిండియాను ఎంపిక చేయనున్నారు. 2013 తర్వాత టీమిండియా.. ఐసీసీ ట్రోఫీ ఒక్కటి కూడా అందుకోలేదు. ఈ క్రమంలో.. ఈ ట్రోఫీని సొంతం చేసుకోవడానికి టీమిండియా ఉవ్విళ్లూరుతుంది. అందుకోసం.. టీమిండియా ఆటగాళ్లు ఐపీఎల్లో అత్యుత్తమ ప్రదర్శన చూపించి.. టీ20 వరల్డ్ కప్ జట్టులో స్థానం దక్కించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో.. టీ20 ప్రపంచకప్లో భారత జట్టు ఎంపికపై మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ భారీ జోస్యం చెప్పారు. అతను టోర్నమెంట్ కోసం 15 మంది సభ్యుల భారత జట్టును ఎంపిక చేశారు.
Tragedy: పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా అనంతలోకాలకు.. అన్న ఇద్దరు చెల్లెల్లు మృతి
Also Read
- Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
- Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్పై 1-0తో విజయం.!
- Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
- Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
కాగా.. భారత జట్టులో కనీసం 10 నుంచి 12 మంది ఆటగాళ్లకు చోటు ఖాయమైంది. అయితే.. మహమ్మద్ కైఫ్ తన జట్టును స్టార్ స్పోర్ట్స్ షో ‘ఫాలో ది బ్లూస్’లో టీ20 ప్రపంచ కప్ కోసం 15 మంది ఆటగాళ్ల గురించి చెప్పారు. వికెట్ కీపర్గా రిషబ్ పంత్కు మాత్రమే చోటు కల్పించాడు. సంజూ శాంసన్, ఇషాన్ కిషన్లకు చోటు ఇవ్వలేదు. నాలుగో స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కు అవకాశం ఇచ్చాడు. మరోవైపు.. రింకూ సింగ్ స్థానంలో ఫినిషర్ పాత్రలో రియాన్ పరాగ్ని ఎంచుకున్నారు.
TDP Chief: అమరావతి నిర్మించింది.. ఆంధ్రాకు సాప్ట్వేర్ను పరిచయం చేసింది.. అందుకోసమే..!
బ్యాటింగ్ ఆర్డర్ గురించి కైఫ్ మాట్లాడుతూ.. “రోహిత్ శర్మతో కలిసి యశస్వి జైస్వాల్ ఓపెనింగ్ చేస్తాడు. ఆ తర్వాత విరాట్ కోహ్లీ 3వ స్థానంలో, సూర్యకుమార్ యాదవ్ 4వ స్థానంలో, హార్దిక్ పాండ్యా 5వ స్థానంలో, రిషబ్ పంత్ 6వ స్థానంలో ఉంటారు. బ్యాటింగ్లో డెప్త్ అవసరం కాబట్టి తాను చాలా మంది ఆల్రౌండర్లను ఉంచుతానని తెలిపారు. కాబట్టి అక్షర్ పటేల్ 7వ స్థానంలో, రవీంద్ర జడేజా 8వ స్థానంలో ఉంటారని చెప్పారు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్ 9వ స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత ఇద్దరు ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, అర్ష్దీప్ సింగ్ ఉంటారని” కైఫ్ తెలిపారు.
తాజావార్తలు
-
Se*xual Assault: తుక్కుగూడ నర్సు శిరీష హత్య కేసు.. లైంగిక దాడి చేసినట్లు నిర్ధారణ.. నిందితుడి అరెస్ట్.!
-
Sardar 2: కార్తి ‘సర్దార్ 2’ ట్రైలర్ కు టైమ్ ఫిక్స్ చేసిన మేకర్స్!
-
CTET 2026: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్.. దరఖాస్తుకు రేపే చివరి ఛాన్స్..
-
YASH : టాక్సిక్ డిజాస్టర్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటి?
-
Gold Price Today: భారీగా తగ్గిన బంగారం ధరలు.. హైదరాబాద్లో 10 గ్రాముల గోల్డ్ రేట్ ఎంతంటే?
ట్రెండింగ్
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!