Virat Kohli: ‘హిందుస్థాన్ కా బబ్బర్ షేర్’ కోహ్లీ.. కెరీర్ను ఉన్నతంగా ముగించాలి!
- రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్న కోహ్లీ
- ఇంగ్లండ్తో టెస్టు సిరీస్కు ముందే అతడు వీడ్కోలు
- విరాట్ రిటైర్మెంట్పై స్పందించిన టీమిండియా మాజీ బ్యాటర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఇప్పటికే విరాట్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని బీసీసీఐకి చెప్పాడని, ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్కు ముందే అతడు వీడ్కోలు పలకనున్నాడని పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. కనీసం ఇంగ్లండ్ సిరీస్లో అయినా ఆడాలని కోహ్లీని ఒప్పించేందుకు బీసీసీఐ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడే రిటైర్మెంట్ తీసుకోవద్దని అటు మాజీలు, ఇటు అభిమానులు కోరుతున్నారు. ఈ క్రమంలో విరాట్ రిటైర్మెంట్పై టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ స్పందించాడు.
విరాట్ కోహ్లీ హిందుస్థాన్ కా బబ్బర్ షేర్ అని, అతడు తన టెస్ట్ కెరీర్ను టీ20 కెరీర్ మాదిరి ఉన్నతంగా ముగించాలని మహ్మద్ కైఫ్ సూచించాడు. ‘హిందూస్థాన్ సింహమైన విరాట్ కోహ్లీ ఇప్పుడు రిలాక్స్డ్ మూడ్లో ఉన్నాడు. అతను రిటైర్మెంట్ వైపు అడుగులు వేస్తున్నాడు. ఇప్పుడే రిటైర్మెంట్ ఇవ్వకుండా.. ఇంగ్లండ్ వెళ్లి తానేంటో నిరూపించుకోవాలి. టెస్ట్ టెస్ట్ కెరీర్ను విరాట్ ఉన్నతంగా ముగించాలి. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచి పొట్టి ఫార్మాట్ కెరీర్ను ఉన్నత స్థాయిలో ముగించాడు. అదే మాదిరి ఇప్పుడు చేయాలి’ అని కైఫ్ చెప్పుకొచ్చాడు.
Also Read
- Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
- CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
- Vaibhav Sooryavanshi: సెంచరీ మిస్పై సంచలన కామెంట్స్ చేసిన వైభవ్ సూర్యవంశీ.. నా మైండ్లో ఉన్నది అదే అంటూ..
- US-Iran: తూచ్.. హార్ముజ్పై ఎలాంటి ఒప్పందం జరగలేదు.. వైట్హౌస్ ఖండన
Also Read: IPL 2025-RCB: ఆర్సీబీకి బిగ్ షాక్..18 వికెట్లు పడగొట్టిన స్టార్ పేసర్ అవుట్!
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2025లో విరాట్ కోహ్లీ విఫలమైన విషయం తెలిసిందే. 9 ఇన్నింగ్స్లలో 190 పరుగులే చేశాడు. అందులో ఒక సెంచరీ ఉండడం విశేషం. అప్పుడే కోహ్లీ ప్రదర్శనపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం ఐపీఎల్ 2025లో పరుగుల వరద పారిస్తున్న అతడు.. షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లీ 123 మ్యాచ్ల్లో 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఇందులో 30 సెంచరీలు, 31 అర్ధ హాఫ్ సెంచరీలు ఉన్నాయి.
తాజావార్తలు
-
SRH vs RR : ప్లేఆఫ్స్లో రాజస్తాన్ రచ్చ.. ఎస్ఆర్హెచ్ ఔట్.!
-
OTR : కాంగ్రెస్ హామీల అమలు పోరాట పథంలో బీఆర్ఎస్.. విద్యార్థి నేతలు ఆగ్రహం?
-
Sun Risers Hyderabad: పెవిలియన్కు క్యూ కట్టిన కాటేరమ్మ కొడుకులు.. కుప్పకూలిన టాప్ ఆర్డర్స్..
-
CM Vijay: కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్తో విజయ్ భేటీ.. తమిళనాడు అంశాలపై చర్చ
-
Ragi Ponganalu: మహిళలకు అమృతం లాంటిది.. ఐరన్, క్యాల్షియం కావాలంటే వారంలో రెండుసార్లు ఇవి తినండి!
ట్రెండింగ్
-
MG Majestor : రూ.40 లక్షల SUV కేవలం రూ.41,000లకే..!
-
Home Remedies : వర్షాకాలం వచ్చేస్తోంది.. దోమల బెడదకు ఈ సింపుల్ చిట్కాలతో చెక్ పెట్టండి..!
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!