PM Modi: కాశ్మీర్ భారీ మార్పులు.. రాత్రిపూట ఐస్ క్రీం తినేందుకు లాల్ చౌక్ కు వెళ్తున్నారు..
- జెడ్-మోర్ టన్నెల్ను ప్రారంభించిన మోడీ
- బహిరంగ సభలో మాట్లాడిన ప్రధాని
- కశ్మీర్లో ఇప్పటి వరకు క్లిష్టమైన పరిస్థితులు ఉండేవన్న పీఎం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జమ్మూ కాశ్మీర్లోని సోనామార్గ్లో సోమవారం జెడ్-మోర్ టన్నెల్ను ప్రధాని మోడీ ప్రారంభించారు. అనంతరం బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్ నేడు అభివృద్ధిలో కొత్త కథను రాస్తోందన్నారు. ఇంతకుముందు క్లిష్టమైన పరిస్థితులు ఉండేవన్నారు. ఇప్పుడు మన కాశ్మీర్ భూమిపై స్వర్గంగా గుర్తింపు పొందుతోందని ప్రధాని తెలిపారు. రాత్రిపూట కూడా ఐస్ క్రీం తినేందుకు లాల్ చౌక్ కు వెళ్తున్నారన్నారు. గతంలో రాత్రిపూట కూడా అక్కడ తీవ్ర ఉత్కంఠ పరిస్థితులు ఉండేవని గుర్తు చేశారు. శాంతి నెలకొన్న సందర్భంగా గత 10 సంవత్సరాలలో పర్యాటక రంగా పురోగతి సాధించిందని తెలిపారు. 2024లో జమ్మూ కాశ్మీర్కు 2 కోట్లకు పైగా పర్యాటకులు వచ్చారని వెల్లడించారు. ఇక్కడ సోనామార్గ్లో కూడా పర్యాటకులు 10 సంవత్సరాలలో 6 రెట్లు పెరిగినట్లు చెప్పారు. స్థానికులు ప్రయోజనం పొందుతున్నారన్నారు.
ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగాలు..
జమ్మూకాశ్మీర్ ఇప్పుడు సొరంగాలు, ఎత్తైన వంతెనలు, రోప్వేలకు కేంద్రంగా మారుతోందని ప్రధాని మోడీ తెలిపారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సొరంగాలు ఇక్కడ నిర్మిస్తున్నారని గుర్తు చేశారు. జమ్మూ కాశ్మీర్లో గత 10 ఏళ్లలో చాలా విద్యాసంస్థలు స్థాపించినట్లు పేర్కొన్నారు. దీని వల్ల ఇక్కడి మన యువత ఎంతో ప్రయోజనం పొందారన్నారు. అభివృద్ధి చెందిన భారతదేశ ప్రయాణంలో మన పర్యాటక రంగానికి పెద్దపీట వేసిందన్నారు. మెరుగైన కనెక్టివిటీ కారణంగా, పర్యాటకులు జమ్మూ కాశ్మీర్లోని చివరి ప్రాంతాలకు కూడా సులభంగా చేరుకుంటారని మోడీ తెలిపారు.
Also Read
- Monsoon Prediction 2026: నైరుతి రుతుపవనాల గమనంలో విరామాలు.. రైతులకు వాతావరణ శాఖ అధికారుల కీలక సూచనలు!
- Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
ఈరోజు చాలా ప్రత్యేకమైనది..
ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు అని నరేంద్ర మోడీ అన్నారు. నేడు దేశంలోని నలుమూలలా పండుగ వాతావరణం నెలకొందన్నారు. ప్రయాగ్రాజ్లో ఈరోజు నుంచే మహా కుంభోత్సవం ప్రారంభమవుతోందని ప్రధాని గుర్తు చేశారు. పుణ్యస్నానాల కోసం కోట్లాది మంది అక్కడికి తరలివస్తున్నారన్నారు. నేడు, పంజాబ్తో సహా మొత్తం ఉత్తర భారతదేశం లోహ్రీ పట్ల ఉత్సాహంతో నిండి ఉందని చెప్పారు. ఉత్తరాయణం, మకర సంక్రాంతి, పొంగల్ వంటి అనేక పండుగల కాలం ఇదని వెల్లడించారు. దేశంలోనూ, ప్రపంచంలోనూ ఈ పండుగలు జరుపుకుంటున్న ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
తాజావార్తలు
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Mutual Funds Mistakes: మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుబడి పెట్టేవారు ఎక్కువగా చేసే 7 పొరపాట్లు ఇవే!
-
Raghava Lawrence : జూన్ 11న రాజకీయ ఎంట్రీపై రాఘవ లారెన్స్ కీలక ప్రకటన..
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!