Public Examinations Act: కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం.. ఇక నుంచి పేపర్ లీక్ చేస్తే దబిడిదిబిడే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Public Examinations Act: నీట్ (NEET) పరీక్షల లీకేజీల వ్యవహారంపై విద్యార్థుల ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్న వేళ, కేంద్ర ప్రభుత్వం పేపర్ లీకేజీలు, కాపీయింగ్ రాయుళ్లపై ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమైంది. దేశవ్యాప్తంగా యువతలో రేగుతున్న నిరసనల సెగను గ్రహించిన ప్రధాని నరేంద్ర మోడీ, ఈ వ్యవహారంపై ఆలస్యంగానైనా కఠిన చర్యలకు శ్రీకారం చుట్టారు. అర్ధరాత్రి వేళ విడుదల చేసిన ఓ భావోద్వేగ వీడియో సందేశంలో ఆయన విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హామీ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అమలులో ఉన్న ‘పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్ ఫెయిర్ మీన్స్) యాక్ట్, 2024’ చట్టానికి మరింత పదను పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
శుక్రవారం మధ్యాహ్నం జరగనున్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ చట్ట సవరణలకు ఆమోదముద్ర పడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ప్రతిపాదిత మార్పుల్లో ప్రధానంగా పేపర్ లీకేజీ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు ‘ఫాస్ట్ ట్రాక్ కోర్టులను’ ఏర్పాటు చేసే నిబంధనను చేర్చనున్నారు. ఇప్పటికే ఢిల్లీ హైకోర్టు ఇటువంటి కేసుల విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టును ప్రకటించగా, దానికి అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇవే కాకుండా, లీకేజీలకు పాల్పడే వారికి విధించే జైలు శిక్షతో పాటు భారీగా జరిమానాలను సైతం పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రకారం పేపర్ లీక్ కేసుల్లో దోషులకు 3 నుంచి 5 ఏళ్ల జైలు శిక్షతో పాటు పది లక్షల రూపాయల వరకు జరిమానా విధిస్తున్నారు. అలాగే లీకేజీల సమాచారాన్ని అధికారులకు చెప్పకుండా దాచిపెట్టే సేవా నిర్వాహకులకు కోటి రూపాయల వరకు జరిమానా విధించే వెసులుబాటు ఉంది. ఇది ఒకవేళ వ్యవస్థీకృత నేరంగా తేలితే శిక్షను 5 నుంచి 10 ఏళ్లకు పెంచడంతో పాటు కనీసం కోటి రూపాయల జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు రాబోయే సవరణలతో ఈ శిక్షలు మరింత కఠినతరం కానున్నాయి. క్యాబినెట్ ఆమోదం పొందిన వెంటనే, పార్లమెంట్ రెండో వారం ప్రారంభమయ్యే సోమవారం రోజే ఈ ‘సవరణ బిల్లు’ను లోక్సభలో ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది.
Also Read
- CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
- Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
- Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
మరోవైపు ఈ అంశంపై ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. గత పదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 150కి పైగా పేపర్ లీకేజీలు జరిగినా, ఒక్కరికి కూడా శిక్ష పడలేదని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఘాటుగా విమర్శించారు. మోడీ వీడియో సందేశంపై స్పందిస్తూ, లీకేజీల బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారని మరోసారి స్పష్టం చేశారు. అయితే ప్రధాని మోడీ మాత్రం తన వీడియోలో విద్యార్థుల ఆవేదనను ప్రస్తావిస్తూ లీకేజీ అనేది మామూలు విషయం కాదని, అది లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలకు ఎంతో గుండెకోతను మిగులుస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే గత రెండున్నర నెలలుగా కఠిన చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే నిందితులను అరెస్ట్ చేసి జైలుకు పంపామని తెలిపారు. విద్యార్థుల ఒక విద్యా సంవత్సరం వృథా కాకుండా చూడడమే తమ ప్రాథమిక బాధ్యత అని, అందుకే వెంటనే పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. కనీసం 22 లక్షల మంది విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం తన శక్తియుత్తులన్నీ ఉపయోగించిందని మోడీ వెల్లడించారు. శాఖాపరమైన ఆమోదాలు, అర్ధరాత్రి వరకు సాగిన చర్చల అనంతరం సిద్ధమైన ఈ బిల్లును క్యాబినెట్ మంత్రుల సూచనల మేరకు తుది రూపానికి తెచ్చి, సోమవారం నుంచే పార్లమెంట్లో ఆమోదింపజేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తామని ప్రధాని పునరుద్ఘాటించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలకు సిద్ధం కండి.. కూటమిలో గ్యాప్ వద్దు.. అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
-
Off The Record: కేసీఆర్ సీఎం అయ్యాకే అసెంబ్లీకి వస్తారా..?
-
Nitin Gadkari: ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు.. గడ్కరీ కీలక ప్రకటన
-
Trump: ముదురుతోన్న అమెరికా-కెనడా వాణిజ్య యుద్ధం.. కార్నీపై ట్రంప్ ఆగ్రహం
-
Konda Surekha : కొండా సురేఖకు ఫైనల్ షాక్.. బర్తరఫ్కు గవర్నర్ ఓకే..
ట్రెండింగ్
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!