Kishan Reddy: మోడీ హయాంలో ఉపాధి వృద్ధి.. రాహుల్ గాంధీకి గుణపాఠం
- రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి.
- మోడీ హయాంలో ఉపాధి వృద్ధిపై గణాంకాలు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు “పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది” అనే సామెతకు అచ్చంగా సరిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి దారుణంగా ఉంటే, అదే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డి ఇటీవల తెలిపిన గణాంకాలను పరిశీలిస్తే, మోడీ హయాంలో ఉపాధి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కోసం కొన్ని వాస్తవాలను తెలుపుతున్నాని కొన్ని విషయాలను తెలిపాడు.
* కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో ఉపాధి అవకాశాలు 6% పెరిగితే, బీజేపీ పాలనలో 36% పెరిగాయి.
Also Read
- Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
- Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
- CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
- Sonam Wangchuk: ‘‘ఇది రెండో స్వాతంత్య్ర ఉద్యమం’’ సోనమ్ వాంగ్చుక్ సందేశం
* RBI నివేదిక ప్రకారం UPA 10 సంవత్సరాల పాలనలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే, ఒక్క 2024 సంవత్సరంలోనే 4.9 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* 2014 నుంచి 2024 వరకు మొత్తం 10 సంవత్సరాల మోదీ పాలనలో 17.6 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* వ్యవసాయ రంగంలో ఉపాధి కాంగ్రెస్ హయాంలో 16% తగ్గితే, మోదీ హయాంలో 19% పెరిగింది.
* సర్వీస్ సెక్టార్ లో ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ హయాంలో 25% పెరిగితే, మోదీ హయాంలో 36% పెరిగాయి.
* 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిపోయింది.
* అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉపాధి పొందుతున్నవారు 2013 లో 33.95 శాతం ఉండగా, 2024 లో అది 54.81 శాతానికి పెరిగింది.
* గ్రామీణ మహిళలలో సొంత బ్యాంకు ఖాతా కలిగిన కార్మికులు/పారిశ్రామికవేత్తలు 2017-18 లో 19 శాతం ఉండగా, 2023-24 నాటికి ఇది 31.2 శాతానికి పెరిగింది. ఇది స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆదాయాన్ని ఆర్జించే మహిళా కార్మికులు/ పారిశ్రామికవేత్తల వైపు మారుతున్న దృక్పథాన్ని తెలియజేస్తుంది.
ఈ విషయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
తెలుగులో ఒక సామెత ఉంది – "పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట"; నిరుద్యోగ్యం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అచ్చం ఈ సామెతకు సరిపోతాయి.
రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి,…
— G Kishan Reddy (@kishanreddybjp) February 3, 2025
తాజావార్తలు
-
Nurse Murder Case: ఆపరేషన్ థియేటర్లో నర్సు హత్య.. విషం ఇంజెక్ట్ చేసి చంపిన ప్రియుడు..
-
Donkey Wedding: వర్షాలు కురవాలని గాడిదలకు ఘనంగా పెళ్లి.. కళ్యాణదుర్గంలో వినూత్న సంప్రదాయం!
-
Horror Movie: మైత్రి మూవీ మేకర్స్ నుంచి తొలి హారర్ మూవీ.. ‘418’తో భయపెట్టేందుకు సిద్ధం!
-
Home Guard: 5 నెలలుగా జీతం లేదు.. కన్నీటి పర్యంతమైన మహిళా హోంగార్డు
-
CM Revanth Reddy: పదవుల కోసం గాంధీ భవన్కు రావొద్దు.. పార్టీ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: తప్పుకుంటా.. బీసీసీఐకి విరాట్ కోహ్లీ వార్నింగ్.. వీడియో వైరల్!
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!