Kishan Reddy: రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు “పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది” అనే సామెతకు అచ్చంగా సరిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి దారుణంగా ఉంటే, అదే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డి ఇటీవల తెలిపిన గణాంకాలను పరిశీలిస్తే, మోడీ హయాంలో ఉపాధి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కోసం కొన్ని వాస్తవాలను తెలుపుతున్నాని కొన్ని విషయాలను తెలిపాడు.
* కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో ఉపాధి అవకాశాలు 6% పెరిగితే, బీజేపీ పాలనలో 36% పెరిగాయి.
* RBI నివేదిక ప్రకారం UPA 10 సంవత్సరాల పాలనలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే, ఒక్క 2024 సంవత్సరంలోనే 4.9 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* 2014 నుంచి 2024 వరకు మొత్తం 10 సంవత్సరాల మోదీ పాలనలో 17.6 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* వ్యవసాయ రంగంలో ఉపాధి కాంగ్రెస్ హయాంలో 16% తగ్గితే, మోదీ హయాంలో 19% పెరిగింది.
* సర్వీస్ సెక్టార్ లో ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ హయాంలో 25% పెరిగితే, మోదీ హయాంలో 36% పెరిగాయి.
* 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిపోయింది.
* అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉపాధి పొందుతున్నవారు 2013 లో 33.95 శాతం ఉండగా, 2024 లో అది 54.81 శాతానికి పెరిగింది.
* గ్రామీణ మహిళలలో సొంత బ్యాంకు ఖాతా కలిగిన కార్మికులు/పారిశ్రామికవేత్తలు 2017-18 లో 19 శాతం ఉండగా, 2023-24 నాటికి ఇది 31.2 శాతానికి పెరిగింది. ఇది స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆదాయాన్ని ఆర్జించే మహిళా కార్మికులు/ పారిశ్రామికవేత్తల వైపు మారుతున్న దృక్పథాన్ని తెలియజేస్తుంది.
ఈ విషయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
తెలుగులో ఒక సామెత ఉంది – "పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట"; నిరుద్యోగ్యం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అచ్చం ఈ సామెతకు సరిపోతాయి.
రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి,…
— G Kishan Reddy (@kishanreddybjp) February 3, 2025