Kishan Reddy: మోడీ హయాంలో ఉపాధి వృద్ధి.. రాహుల్ గాంధీకి గుణపాఠం
- రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డ కిషన్ రెడ్డి.
- మోడీ హయాంలో ఉపాధి వృద్ధిపై గణాంకాలు వెల్లడి.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kishan Reddy: రాహుల్ గాంధీ ఇటీవల పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు “పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది” అనే సామెతకు అచ్చంగా సరిపోతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. యూపీఏ హయాంలో ఉపాధి అవకాశాల అభివృద్ధి దారుణంగా ఉంటే, అదే అంశాన్ని ఎన్డీయే ప్రభుత్వానికి ఆపాదించడం రాహుల్ అవివేకానికి నిదర్శనమని అన్నారు. కిషన్ రెడ్డి ఇటీవల తెలిపిన గణాంకాలను పరిశీలిస్తే, మోడీ హయాంలో ఉపాధి పెరుగుదల స్పష్టంగా కనిపిస్తోంది. ఉపాధి విషయంలో ప్రత్యేకంగా రాహుల్ గాంధీ కోసం కొన్ని వాస్తవాలను తెలుపుతున్నాని కొన్ని విషయాలను తెలిపాడు.
* కాంగ్రెస్ 10 సంవత్సరాల పాలనలో ఉపాధి అవకాశాలు 6% పెరిగితే, బీజేపీ పాలనలో 36% పెరిగాయి.
Also Read
- CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
- Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
- Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
- Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
* RBI నివేదిక ప్రకారం UPA 10 సంవత్సరాల పాలనలో 2.9 కోట్ల ఉద్యోగాల సృష్టి జరిగితే, ఒక్క 2024 సంవత్సరంలోనే 4.9 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* 2014 నుంచి 2024 వరకు మొత్తం 10 సంవత్సరాల మోదీ పాలనలో 17.6 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.
* వ్యవసాయ రంగంలో ఉపాధి కాంగ్రెస్ హయాంలో 16% తగ్గితే, మోదీ హయాంలో 19% పెరిగింది.
* సర్వీస్ సెక్టార్ లో ఉపాధి అవకాశాలు కాంగ్రెస్ హయాంలో 25% పెరిగితే, మోదీ హయాంలో 36% పెరిగాయి.
* 2023-24 నాటికి దేశంలో నిరుద్యోగిత రేటు 3.2 శాతానికి తగ్గిపోయింది.
* అలాగే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఉపాధి పొందుతున్నవారు 2013 లో 33.95 శాతం ఉండగా, 2024 లో అది 54.81 శాతానికి పెరిగింది.
* గ్రామీణ మహిళలలో సొంత బ్యాంకు ఖాతా కలిగిన కార్మికులు/పారిశ్రామికవేత్తలు 2017-18 లో 19 శాతం ఉండగా, 2023-24 నాటికి ఇది 31.2 శాతానికి పెరిగింది. ఇది స్వేచ్ఛగా, స్వతంత్రంగా ఆదాయాన్ని ఆర్జించే మహిళా కార్మికులు/ పారిశ్రామికవేత్తల వైపు మారుతున్న దృక్పథాన్ని తెలియజేస్తుంది.
ఈ విషయాలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
తెలుగులో ఒక సామెత ఉంది – "పచ్చ కామెర్లు వచ్చిన ఒకతను లోకమంతా పచ్చగా కనిపిస్తోంది అన్నాడట"; నిరుద్యోగ్యం విషయంలో యూపీఏ, ఎన్డీయే రెండూ విఫలమయ్యాయి అంటూ రాహుల్ గాంధీ ఈ రోజు పార్లమెంటులో చేసిన వ్యాఖ్యలు అచ్చం ఈ సామెతకు సరిపోతాయి.
రాహుల్ గాంధీ యూపీఏ ప్రభుత్వంలోని వైఫల్యాలను చూసి,…
— G Kishan Reddy (@kishanreddybjp) February 3, 2025
తాజావార్తలు
-
Dragon Glimpse: ‘డ్రాగన్’ బాక్సాఫీస్ ఊచకోత ఖాయం.. ప్రశాంత్ నీల్ మైండ్ బ్లాకింగ్ గ్లింప్స్!
-
CI: సహాయం కోరితే సహజీవనం చేశాడు.. మహిళ జీవితంతో ఆడుకున్న సీఐ..
-
Hyderabad: పెళ్లికి ముందే తల్లయింది.. చివరికి ప్రియుడిని పెళ్లాడేందుకు కన్నింగ్ ప్లాన్
-
Trump Warning: ‘వాళ్లకు మరో భారీ దెబ్బ ఇవ్వాల్సి రావచ్చు’.. ఇరాన్కు ట్రంప్ తాజా వార్నింగ్
-
Mitchell Marsh: సెంచరీ మిస్.. బ్యాటింగ్ ‘టార్చర్’ అనిపించింది.. మిచెల్ మార్ష్ ఆవేదన..
ట్రెండింగ్
-
Thotakura Masala Vada Recipe: కరకరలాడే తోటకూర మసాలా వడలు.. ఇంట్లోనే స్ట్రీట్ స్టైల్ రుచి.!
-
Tree Trimming Job: చెట్లు కొడితే చాలు.. గంటకు రూ. 49,000.. ఎక్కడంటే.?
-
రూ.13,999కే 7000mAh భారీ బ్యాటరీ, 50MP కెమెరాతో Moto g37 సిరీస్ భారత్లో లాంచ్.. ధర ఎంతంటే.?
-
కేవలం రూ.8,999కే మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, 6.6 అంగుళాల భారీ స్క్రీన్ తో Itel A100 Pro లాంచ్..!
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!