Mayor Suresh Babu: కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ.. నా ఇష్టం అంటున్న మేయర్!
- కడప కార్పొరేషన్ సమావేశంపై ఉత్కంఠ
- సమావేశం ఎక్కడ నిర్వహించాలనే దానిపై నో క్లారిటీ
- మేయర్ చాంబర్లో 39 మంది వైసీపీ కార్పోరేటర్లు
- కాన్ఫరెన్స్ హాల్లో ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, అధికారులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కడప కార్పొరేషన్ సర్వసభ్య సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. సమావేశం ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. దాంతో సర్వసభ్య సమావేశం ఇంకా ప్రారంభం కాలేదు. కడప ఎమ్మెల్యే మాధవీ రెడ్డి, 8 మంది టీడీపీ కార్పోరేటర్లు, అధికారులు కార్పొరేషన్ కాన్ఫరెన్స్ హాల్లో వేచి ఉన్నారు. మరోవైపు మేయర్ చాంబర్లో వైసీపీకి చెందిన 39 మంది కార్పోరేటర్లు సమావేశం అయ్యారు. ఈ నేపథ్యంలో సమావేశం ఎక్కడ నిర్వహిస్తారనే అంశలో సందిగ్దత నెలకొంది.
కార్పొరేషన్ ప్రాంగణంలో ఎక్కడైనా నిర్వహించుకునే అధికారం తనకు అంది మేయర్ సురేష్ బాబు అంటున్నారు. సమావేశం మందిరంలో నిర్వసించాలని అధికారులు పట్టుబడుతున్నారు. ఇప్పటికే సమావేశ మందిరంలో అధికారులు ఎదురు చూస్తున్నారు. మేయర్ తన చాంబర్లో కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. సమావేశ వేదికను మార్చాలంటూ మేయర్ డిమాండ్ చేస్తున్నారు. ఎక్కడ మీటింగ్ అనేది తన ఇష్టం అని, అజెండా అంశాల కాపీలను అందరికీ ఇచ్చాం అని మేయర్ అంటున్నారు. తాము ఎక్కడ సమావేశం నిర్వహించినా అధికారులు రావాల్సిన బాధ్యత ఉందన్నారు.
Also Read
- Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా 'హిమంత శర్మ' ప్రమాణ స్వీకారం..!
- Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి 'మాస్టర్ ప్లాన్'ను బట్టబయలు చేసిన షణ్ముగం!
- GT vs SRH Playing 11: మొదట ప్లే-ఆఫ్ చేరేది ఎవరో.!
- Anjanadri Temple: బంగారం కాదు రాగి?.. ఆంజనాద్రి అంజన్న ఆలయంలో ఆభరణాల విరాళ వివాదం!
Also Read: Yogandhra 2025: అంతర్జాతీయ యోగా దినోత్సవం.. మరో గిన్నిస్ రికార్డు కోసం అధికారుల కసరత్తు!
‘కడప మున్సిపల్ కమిషనర్ నా అనుమతి లేకుండా అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. మేయర్ అయిన నాకు తెలియకుండా వేదికపైన ఎమ్మెల్యేకి కుర్చీలు వేశారు. సమావేశం హాల్ తెరవమని కోరినా తెరవలేదు. జనరల్ బాడీ మీటింగ్పై కమిషనర్కూ చెప్పా. ఎక్కడ అని కమిషనర్ అడగలేదు. ఎక్కడ మీటింగ్ అనేది నా ఇష్టం. అజెండా అంశాల కాపీలను అందరికీ ఇచ్చాం. సమావేశంపై కమిషనర్ నాతో చర్చించలేదు. కమిషనర్ నాకు తెలియకుండా రాత్రి హాల్ తెరిచారు. కార్పోరేటర్లకు కమిషనర్ క్లారిటీ ఇవ్వలేదు. మేము ఎక్కడ నిర్వహించినా అధికారులు రావాల్సిన బాద్యత ఉంది’ అని కడప మేయర్ సురేష్ బాబు అన్నారు.
తాజావార్తలు
-
Assam CM Himanta Biswa Sarma: రెండోసారి అస్సాం ముఖ్యమంత్రిగా ‘హిమంత శర్మ’ ప్రమాణ స్వీకారం..!
-
RJ Balaji: ‘వీర భద్రుడు’ రిలీజ్కు ముందు కొత్త వివాదం.. ఆర్జే బాలాజీపై ఫ్యాన్స్ ఫైర్!
-
Mouni Roy: విడాకుల బాటలో మరో బాలీవుడ్ జంట..నాలుగేళ్లకే దాంపత్యంలో కలతలు
-
Why Did AIADMK Split: అన్నాడీఎంకే చీలికకు అసలు కారణం ఇదే.. పళనిస్వామి ‘మాస్టర్ ప్లాన్’ను బట్టబయలు చేసిన షణ్ముగం!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!
ట్రెండింగ్
-
Palak Paratha Recipe: హెల్దీగా, టేస్టీగా చేసే సూపర్ సాఫ్ట్ ‘పాలక్ పరోటా’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Samsung: సర్టిఫైడ్ రీ-న్యూడ్ ప్రోగ్రామ్ తో రిఫర్బిష్డ్ గెలాక్సీ S25, గెలాక్సీ A56 మోడళ్లను తీసుకొచ్చిన శాంసంగ్..!
-
204HP పవర్, ADAS ఫీచర్లతో 2026 Skoda Kodiaq భారత్ లో లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..
-
Ginger Candy: తాటి బెల్లం + అల్లం: గొంతు నొప్పి నుండి జీర్ణ సమస్యలకు.. చెక్ పెట్టే అద్భుత ఔషధం ‘అల్లం మురబ్బా’ ఇంట్లోనే చేసుకోండి ఇలా..
-
8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, యాక్టివ్ కూలింగ్తో గేమింగ్ మాన్స్టర్.. REDMAGIC 11S Pro రాక!