MLC Kavitha : నేత వృత్తి వ్యాపారం కాదు.. దేశ వారసత్వ కళాసంపద
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నేత వృత్తి వ్యాపారం కాదు…. దేశ వారసత్వ కళాసంపదని, చేనేత ఉత్పత్తులపై జీఎస్టీని పూర్తిగా ఎత్తేవేయాలని, మంత్రి కేటీఆర్ పిలుపుతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రధాని మోదీకి పోస్ట్ కార్డ్ రాశారు. చేనేత వృత్తి అంటే వ్యాపారం కాదని, అది మన దేశ వారసత్వ కళాసంపదనని టీఆరెఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. చేనేత కళాకారులంతా గ్రామీణ ప్రాంతాలకు చెందిన పేదలు, బలహీన వర్గాల వారిని, అలాంటి వారిని జీఎస్టీ పేరిట దోపిడీ చేయడం సరికాదని సూచించారు. మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ రద్దుచేయాలని ఆదివారం ప్రధాని మోదీకి ఎమ్మెల్సీ కవిత పోస్ట్ కార్డు రాశారు. చేనేత పరిశ్రమ చేనేత కళాకారుడి నైపుణ్యత, సృజనాత్మకత, కష్టంపై ఆధారపడి మనుగడ సాగిస్తున్నదని, చేనేత కళాకారుడిలో వ్యాపార దృక్పథం ఏ కోశాన లేదని పేర్కొన్నారు. దేశానికి స్వాతంత్రము వచ్చినప్పటి నుండి ఇప్పటిదాకా ఏ ప్రభుత్వమూ చేనేత ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై ఎలాంటి పన్ను విధించలేదని గుర్తు చేశారు.
Also Read : Srinivas Goud : గతంలో గౌడన్నలను ఆబ్కారీ శాఖ వాళ్ళు ఎన్నో వేధింపులకు గురి చేశారు
కానీ, ఇప్పుడు మోదీ సారద్యంలోని కేంద్ర ప్రభుత్వము చేనేతకు వాడే ముడి సరుకులపై, చేనేత వస్త్రాలపై 5శాతం జీఎస్టీ విధించి, దాన్ని 12% కు పెంచాలనుకోవడం చేనేత కార్మికుల పాలిట ఉరితాడు అవుతుందని చేప్పేందుకు ఎలాంటి సందేహం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి, దేశంలోని కోట్లాది పేద చేనేత కార్మికుల జీవితాల కోసం, చేనేత ముడి సరకులపై మరియు చేనేత వస్త్రాలపై జీఎస్టీని వెంటనే రద్దు చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. చేనేత సంబంధిత వస్తువులపై గల జీఎస్టీని పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేశారు.
చేనేత ఉత్పత్తులపై జీఎస్టీ 5శాతం కాదు, 12 శాతం కాదు, సున్నాశాతం ఉండాలని సూచించారు. మరోవైపు, మంత్రి కేటీఆర్ ఇచ్చిన పిలుపును అందుకొని చేనేతపై జీఎస్టీని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరూ ప్రధానికి పోస్ట్ కార్డ్ రాయాలని ప్రజలకు కవిత విజ్ఞప్తి చేశారు.
Also Read
తాజావార్తలు
-
Vizag: నమ్మినవాడే ప్రాణాలు తీశాడు.. వీడిన అక్కయ్యపాలెం మర్డర్ మిస్టరీ
-
Crime: కాపాడాల్సిన బాబాయే కీచకుడయ్యాడు.. ప్రైవేట్ ఫోటోలతో బెదిరించి బాలికపై దారుణం..
-
Pawan Kalyan : రాష్ట్రం కోసమే రాజీ పడ్డాను.. పొత్తులో మీ ఆత్మగౌరవం దెబ్బతింటే ఊరుకోను
-
Gas Pipeline: భారత్ మాస్టర్ ప్లాన్.. సముద్రగర్భంలో భారీ గ్యాస్ పైప్లైన్..
-
Polavaram: పోలవరం నిర్వాసితులకు రూ. 307 కోట్ల పరిహారం.. 2027 నాటికి ప్రాజెక్ట్ పూర్తి: మంత్రి నిమ్మల రామానాయుడు
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..