బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ నిన్న ప్రగతి భవన్లో మీడియాతో చిట్చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమం గురించి కేటీఆర్ మాట్లాడడం ఆశ్చర్యం వేస్తుందన్నారు. అంతేకాకుండా.. 2004 సాధారణ ఎన్నికల్లో కేటీఆర్ ఎక్కడ కనిపించలేదు ఎందుకు.. అప్పుడు అమెరికా లో ఏం చేస్తున్నారని, యూపీఏ ప్రభుత్వం లో కేసీఆర్ మంత్రి అయిన తర్వాత కేటీఆర్ ,కవిత లు తెలంగాణ కు వచ్చారన్నారు జీవన్ రెడ్డి. అనవసరంగా కేసీఆర్ తెలంగాణ నినాదం ఎత్తుకున్నారని కేటీఆర్ అన్న మాటలకు చాలా మంది సాక్షులు ఉన్నారని, ఏపీ లో పార్టీ ఉనికి పోతుందని తెలిసి కూడా తెలంగాణ ఇచ్చిన చరిత్ర మాది అని ఆయన అన్నారు. ఆకాశం మీదనుంచి ఊడిపడినట్లు గా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, తెలంగాణ తల్లి మీద ఓట్టేసి మందు ,పైసల్ పంచకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రమాణం చేసే దమ్ముందా అని ఆయన ప్రశ్నించారు.
Also Read : Urvashi Rautela: బ్లాక్ డ్రెస్ లో కళ్ళు చెదరకొడుతున్న ఊర్వశి రౌటేలా
‘రెండో ప్రభుత్వం లో ఓక్క కొత్త డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మించలేదు. ఎన్నికల కోసమే కేటీఆర్ డ్రామాలు. దళితబంధు కు ఎందుకు నిధులు విడుదల చేయడం లేదు. ఇందిరమ్మ ఇళ్ళు లేని గ్రామం లేదు.. అధికార పార్టీ లో చేరితేనే దలితబంధు, బీసీ బందు, డబుల్ బెడ్ రూమ్ అంటుంన్నారు..ఇదే నా కేటీఆర్ దృష్టిలో పారదర్శకత అంటే.. కలెక్టర్ లను బీఆర్ఎస్ తొత్తులుగా పనిచేస్తున్నారు.. లబ్ధి దారుల నుంచి అప్లికేషన్స్ తీసుకోకుండా లబ్ది దారులను ఎలా ఎంపిక చేస్తారు. బీజేపీ, బీఆర్ఎస్ లు బోమ్మా ,బొడుసు లాంటివి. బీజేపీ సహాకారంతోనే గతంలో బీఆర్ఎస్ ముందస్తు కు వెల్లింది. అమిత్ షా చేతిలో కేసీఆర్ జుట్టు ఉంది. ఎన్నికల విషయం లో బీఆర్ఎస్ కన్ఫ్యూజ్ చేస్తుంది.. ఇందులో కేటీఆర్ కూడా భాగస్వామే..’ అని జీవన్ రెడ్డి అన్నారు.
Also Read : Pakistan: నేను అధికారంలో ఉంటే జీ20ని నిర్వహించే వాడ్ని.. నవాజ్ నీకు అంత సీనుందా..?