Duvvada Srinivas: తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది!
- పోలీసుల విచారణకు హాజరైన దువ్వాడ
- కేసులు దువ్వాడను బెదిరించలేవు
- హింసించాలనుకుంటే తీవ్ర పరిణామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. తాము మరలా అధికారంలోకి వస్తాం అని, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం స్పష్టంగా చెప్తున్నా అన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ నాయకులు పెట్టిన కేసులు దువ్వాడ శ్రీనివాసను అదిరించలేవు, బెదిరించలేవని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కేసుల పేరిట వేధిస్తున్నారన్నారు. అధికారమనేది తాత్కాలికం అని, తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే ప్రజలు చూస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నేడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ.. టెక్కలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కణితి కిరణ్ నవంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డిసెంబర్ 13న దువ్వాడకు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే దువ్వాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
Also Read
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
- Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
- Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
- Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు'.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
‘కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ నాయకులు పెట్టిన కేసులు దువ్వాడ శ్రీనివాసను అదిరించలేవు, బెదిరించలేవు. రాష్ట్రమంత్రి కింజరాపుచ్చున్నాయుడు తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. మేము మరలా అధికారంలోకి వస్తాం, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం అని స్పష్టంగా చెప్తున్నా. జనసేన పార్టీ కార్యకర్తకు ఉన్న విలువ ప్రజాప్రతినిధికి లేదు. జనసేన కార్యకర్తలు కేసు పెడితే ఎమ్మెల్సీని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. నేను ఫిర్యాదు చేస్తే కనీసం పోలీసులు స్పందించలేదు. ప్రజా ప్రతినిధిగా నా పోరాటమాగదు. ఎలాంటి పరిస్థితులైనాఎదుర్కొనేందుకు సిద్ధం. మమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటే.. మీరు ఏ ఏక్షన్ తీసుకున్నా దానికి నేను రెడీ. ఏడాది కాలంలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోయారు. కానీ వైసీపీ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కేసుల పేరిట వేధిస్తున్నారు. అధికారమనేది తాత్కాలికం. తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే ప్రజలు చూస్తున్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన, టీడీపీ నాయకులను హెచ్చరిస్తున్నా’ అని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.
- Tags
- ap
- ap news
- Duvvada Srinivas
- janasena
- tdp
తాజావార్తలు
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
-
Sir Garfield Sobers: ప్రముఖ క్రికెట్ దిగ్గజం కన్నుమూత.. బర్త్డేకు ముందు గార్ఫీల్డ్ సోబర్స్ మృతి
-
Parthiv Patel: హిట్మ్యాన్ను తక్కువ అంచనా వేయొద్దు’.. రోహిత్ రిటైర్మెంట్ మధ్య మాజీ క్రికెటర్ కీలక వ్యాఖ్యలు
-
Trump: ట్రక్ డ్రైవర్లకు ట్రంప్ బిగ్ షాక్.. భారతీయులపై తీవ్ర ప్రభావం!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?