Duvvada Srinivas: తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది!
- పోలీసుల విచారణకు హాజరైన దువ్వాడ
- కేసులు దువ్వాడను బెదిరించలేవు
- హింసించాలనుకుంటే తీవ్ర పరిణామాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుందని శ్రీకాకుళం జిల్లా టెక్కలికి చెందిన వైసీపీ నేత, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు. తాము మరలా అధికారంలోకి వస్తాం అని, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం స్పష్టంగా చెప్తున్నా అన్నారు. కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ నాయకులు పెట్టిన కేసులు దువ్వాడ శ్రీనివాసను అదిరించలేవు, బెదిరించలేవని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కేసుల పేరిట వేధిస్తున్నారన్నారు. అధికారమనేది తాత్కాలికం అని, తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే ప్రజలు చూస్తున్నారని దువ్వాడ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ నేడు పోలీసుల విచారణకు హాజరయ్యారు. వైసీపీ అధికారంలో ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సహా కార్యకర్తల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేశారంటూ.. టెక్కలి జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి కణితి కిరణ్ నవంబర్ 18న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు.. డిసెంబర్ 13న దువ్వాడకు 41ఏ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే దువ్వాడ పోలీసుల విచారణకు హాజరయ్యారు. అనంతరం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
Also Read
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
‘కూటమి ప్రభుత్వంలో జనసేన, టీడీపీ నాయకులు పెట్టిన కేసులు దువ్వాడ శ్రీనివాసను అదిరించలేవు, బెదిరించలేవు. రాష్ట్రమంత్రి కింజరాపుచ్చున్నాయుడు తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే.. రెట్టింపు ఫలితాలు అనుభవించాల్సి వస్తుంది. మేము మరలా అధికారంలోకి వస్తాం, సేమ్ ట్రీట్మెంట్ ఇస్తాం అని స్పష్టంగా చెప్తున్నా. జనసేన పార్టీ కార్యకర్తకు ఉన్న విలువ ప్రజాప్రతినిధికి లేదు. జనసేన కార్యకర్తలు కేసు పెడితే ఎమ్మెల్సీని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. నేను ఫిర్యాదు చేస్తే కనీసం పోలీసులు స్పందించలేదు. ప్రజా ప్రతినిధిగా నా పోరాటమాగదు. ఎలాంటి పరిస్థితులైనాఎదుర్కొనేందుకు సిద్ధం. మమ్మల్ని ఏదైనా చేయాలనుకుంటే.. మీరు ఏ ఏక్షన్ తీసుకున్నా దానికి నేను రెడీ. ఏడాది కాలంలో సూపర్ సిక్స్ హామీలు అమలు చేయలేకపోయారు. కానీ వైసీపీ పార్టీ కార్యకర్తలను సోషల్ మీడియా కేసుల పేరిట వేధిస్తున్నారు. అధికారమనేది తాత్కాలికం. తప్పుడు కేసులు పెట్టి హింసించాలనుకుంటే ప్రజలు చూస్తున్నారు. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని జనసేన, టీడీపీ నాయకులను హెచ్చరిస్తున్నా’ అని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరించారు.
- Tags
- ap
- ap news
- Duvvada Srinivas
- janasena
- tdp
తాజావార్తలు
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
-
RC17 Update: రామ్ చరణ్ కెరీర్లోనే తొలిసారి.. సుక్కు మాస్టర్ ప్లాన్ మాములుగా లేదుగా!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!