MLA Shanampudi Saidireddy : ఏపీలో అన్ని పార్టీలు మోడీ పార్టీలుగా మారాయి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంత్రి హరీష్ రావుపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలు తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి అన్నారు ఎమ్మెల్య శానంపూడి సైదిరెడ్డి. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హరీష్ రావు దేశంలో అందరు మంత్రులకు ఆదర్శమని ఆయన కొనియాడారు. ఏపీలో ఎవరిని అడిగినా హరీష్ రావు గురించి చెబుతారని, హరీష్ రావు నడిచే యంత్రం, ఓ రోబో లాంటి వారని పేరుందన్నారు. ఏపీ మంత్రి అప్పల రాజు చీదర అప్పలరాజు గా మారారని, ఏపీలో అన్ని పార్టీలు మోడీ పార్టీ లుగా మారాయన్నారు సైదిరెడ్డి. హరీష్ రావు లాంటి వారి మీద మాట్లాడేపుడు వంద సార్లు ఆలోచించుకోవాలని, తీరు మార్చుకోకపోతే ఏపీ ప్రజలు అక్కడి మంత్రుల మీద ఉమ్మేస్తారన్నారు. అభివృద్ధి ఎక్కడ ఎక్కువవుతుందో చర్చకు సిద్ధమని, మా ఆత్మ గౌరవాన్ని కించ పరిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. అప్పల రాజు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ, ఏపీ ల అభివృద్ధి పై నాతో ఏపీ మంత్రులు చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
Also Read : Botsa Satyanarayana: హరీష్ రావు, కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
Also Read
- Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
- Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
- Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
- Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
హరీష్ రావును మొత్తం ఏపీ ప్రభుత్వం వచ్చినా చర్చలో ఎదుర్కోలేదని, హరీష్ రావు మాట్లాడిన దాంట్లో తప్పేమీ లేదని ఆయన అన్నారు. కేసీఆర్ ఒకే ఒక ఎత్తుగడ విశాఖ స్టీల్ ప్రైవేటీకరణను ఆపిందని, 800 రోజులు కార్మికులు ఆందోళన చేసినా కేంద్రం దిగిరాలేదన్నారు. మాతో అభివృద్ధిలో పోటీ పడండని, కేసీఆర్ అభివృద్ధి గురించి తప్ప దేని గురించి మాట్లాడరని ఆయన తెలిపారు. ఏపీ మంత్రులు అభివృద్ధి తప్ప అన్నీ మాట్లాడుతున్నారని, చంద్రబాబు, జగన్ ఎవరూ ఢిల్లీ వెళ్లినా తమ స్వార్ధం కోసం వెళతారని, తెలంగాణ అభివృద్ధి మోడల్ ని ఏపీ అనుసరించాలన్నారు. రెండు రాష్ట్రాలు బాగుండాలి అనేదే మా తపన అని, దేశం కూడా బాగుండాలని ఆయన వ్యాఖ్యానించారు.
Also Read : GVL Narasimha Rao: కేసీఆర్ కొత్త డ్రామాకి తెరలేపారు.. ఏపీని మోసం చేస్తున్నారు
తాజావార్తలు
-
Operation Sindoor: రఫెల్ భయంతో వణికిన పాకిస్తాన్.. తన ఎఫ్-16లను దాచి పెట్టిన దాయాది..
-
Supreme Court: భారత్ అభివృద్ధి చెందని దేశంగానే ఉండాలా? ప్యాకేజ్డ్ ఫుడ్స్పై కేంద్రానికి కీలక ఆదేశాలు
-
Indian Player: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు.. ‘సమయం వచ్చేసింది’..
-
Trump: ట్రంప్ ప్రభుత్వంలో కీలక మార్పు.. వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఔట్
-
Study Abroad: విదేశీ చదువుల జోరుకు బ్రేక్.. రెండేళ్లలో 31% తగ్గిన భారతీయ విద్యార్థులు
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!