MLA Putta Sudhakar: అవినీతి చేయను.. అవినీతికి పాల్పడితే ఒప్పుకోను!
- అవినీతి చేయను.. అవినీతికి పాల్పడితే ఒప్పుకోను
- అవినీతి చేస్తే నేనే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా
- అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతి అధికారులపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. అవినీతి చేస్తే తానే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా అని హెచ్చరించారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు తనను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారని, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఎమ్మెల్యే పుట్టా హెచ్చరించారు. నియోజకవర్గంలో తాను అవినీతి చేయను అని, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదన్నారు.
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు నన్ను ఆశ్రయిస్తున్నారు. అవినీతి చేస్తే నేనే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా. అవినీతి చేసి వైసీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారు, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్. అధికారులకు జీతం వస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అవినీతి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు జరుగుతుంది. నా నియోజకవర్గంలో నేను అవినీతి చేయను, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
- Hyderabad: పరారీలో "గోల్డ్ మ్యాన్" .. ఇంటికి తాళం వేసి రాత్రికి రాత్రే జంప్..
- Mohanlal: 'ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
- Shoaib Akhtar: ఉగ్రవాదులతో క్రికెటర్కి సంబంధం ఏంటి? అదీ 26/11 ముంబై, పహల్గామ్ దాడుల సూత్రధారుతో..
‘రెవిన్యూ, పోలీస్,హెల్త్, హౌసింగ్, విద్యుత్, పంచాయతీరాజ్, ఎక్సైజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిసింది. వారికీ ఇదే నా ఫైనల్ వార్నింగ్. అవినీతికి పాల్పడితే లంచం అడిగిన ప్రజల ద్వారానే ఏసీబీకి పట్టిస్తా. చౌక దుకాణ డీలర్లు బ్యాక్లాగ్ ఉన్నప్పుడు బియ్యాన్ని ఎందుకు తీసుకున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో బియ్యాన్ని సరఫరా చేయాలి.. లేదంటే డీలర్ గా తొలగిస్తా. అధికారులు అంటే నాకు అమితమైన అభిమానం.. అవినీతికి పాల్పడవద్దని చెబుతున్నా జాగ్రత్తగా ఉండండి’ అని ఎమ్మెల్యే పుట్టా చెప్పారు.
తాజావార్తలు
-
Prithviraj Sukumaran: మోహన్లాల్ను తాతను చేసిన పృథ్వీరాజ్.. అసలు కథ ఇదే!
-
NPS Premature Exit: NPS ఖాతా నుంచి మొత్తం డబ్బు విత్డ్రా.. కేవలం 5 నిమిషాలే..! ఎవరికి అవకాశం?
-
NP50 : నివిన్ పౌలి 50 ‘విజయం’.. ప్రేమమ్ కాంబో ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో
-
ESIC Scheme: డెలివరీ బాయ్స్, క్యాబ్ డ్రైవర్లకు గుడ్న్యూస్.. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా సహా పలు ప్రయోజనాలు!
-
Explainer: చరిత్రలోనే అత్యంత క్రూరమైన ఉగ్రవాద దాడి..41ఏళ్ల తర్వాత బయటపడ్డ కనిష్క విమాన పేలుడు నిజం!
ట్రెండింగ్
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!
-
55 రోజుల స్టాండ్బై బ్యాటరీతో రూ.1,699కే itel Power 451 AI ఫీచర్ ఫోన్..
-
Pesara Laddu Recipe: ప్రోటీన్ పుష్కలంగా ఉండే ‘పెసర లడ్డూలు’.. ఇంట్లోనే సులభంగా తయారు చేయండి ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..