MLA Putta Sudhakar: అవినీతి చేయను.. అవినీతికి పాల్పడితే ఒప్పుకోను!
- అవినీతి చేయను.. అవినీతికి పాల్పడితే ఒప్పుకోను
- అవినీతి చేస్తే నేనే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా
- అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అవినీతి అధికారులపై ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మండిపడ్డారు. అవినీతి చేస్తే తానే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా అని హెచ్చరించారు. మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు తనను ఆశ్రయిస్తున్నారని తెలిపారు. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారని, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారన్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్ అని ఎమ్మెల్యే పుట్టా హెచ్చరించారు. నియోజకవర్గంలో తాను అవినీతి చేయను అని, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదన్నారు.
ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ… ‘మైదుకూరు నియోజకవర్గ వ్యాప్తంగా అధికారుల అవినీతిపై బాధితులు నన్ను ఆశ్రయిస్తున్నారు. అవినీతి చేస్తే నేనే స్వయంగా ఏసీబీకి పట్టిస్తా. అవినీతి చేసి వైసీపీ పార్టీ 11 సీట్లకు పరిమితమైంది. కొందరు అధికారులు బాగా పనిచేస్తున్నారు, కొందరు మాత్రమే అవినీతికి పాల్పడుతున్నారు. అవినీతి అధికారులకు మీడియా ద్వారా ఇదే ఫైనల్ వార్నింగ్. అధికారులకు జీతం వస్తేనే కుటుంబం సంతోషంగా ఉంటుంది. అవినీతి కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు జరుగుతుంది. నా నియోజకవర్గంలో నేను అవినీతి చేయను, అధికారులు అవినీతికి పాల్పడితే ఒప్పుకునేది లేదు’ అని వార్నింగ్ ఇచ్చారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
‘రెవిన్యూ, పోలీస్,హెల్త్, హౌసింగ్, విద్యుత్, పంచాయతీరాజ్, ఎక్సైజ్, ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, మున్సిపల్, రిజిస్ట్రేషన్ శాఖల అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని తెలిసింది. వారికీ ఇదే నా ఫైనల్ వార్నింగ్. అవినీతికి పాల్పడితే లంచం అడిగిన ప్రజల ద్వారానే ఏసీబీకి పట్టిస్తా. చౌక దుకాణ డీలర్లు బ్యాక్లాగ్ ఉన్నప్పుడు బియ్యాన్ని ఎందుకు తీసుకున్నారు. ప్రజలకు పూర్తిస్థాయిలో బియ్యాన్ని సరఫరా చేయాలి.. లేదంటే డీలర్ గా తొలగిస్తా. అధికారులు అంటే నాకు అమితమైన అభిమానం.. అవినీతికి పాల్పడవద్దని చెబుతున్నా జాగ్రత్తగా ఉండండి’ అని ఎమ్మెల్యే పుట్టా చెప్పారు.
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!