Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Mla Putta Sudhakar Yadav Visits Alaganur Reservoir Promises Project Completion To Benefit Farmers

MLA Putta Sudhakar: తాగునీటి సమస్యకు పరిష్కారంగా అలగనూరు రిజర్వాయర్..!

Published Date :June 15, 2025 , 12:30 pm
By Kothuru Ram Kumar
MLA Putta Sudhakar: తాగునీటి సమస్యకు పరిష్కారంగా అలగనూరు రిజర్వాయర్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

MLA Putta Sudhakar: కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, నందికొట్కూరు ఎమ్మెల్యే జై సూర్యలతో కలిసి అలగనూరు బ్యాలెన్స్డ్ రిజర్వాయర్‌ను సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కడప జిల్లాలో తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చగలిగే శక్తి ఉన్న ప్రాజెక్టు అలగనూరేనని పేర్కొన్నారు. 1985లో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ రిజర్వాయర్‌కు మూడుకోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. 3500 ఎకరాల విస్తీర్ణంలో డ్యాం నిర్మాణాన్ని ఆ రోజు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో 59.76 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు 2004లో పూర్తి చేయబడింది. 2005లో 2.6 టీఎంసీల నీటిని నింపి ఉపయోగంలోకి తీసుకురాగలిగారు.

Read Also: Thiruvananthapuram: F-35 యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్..!

Also Read

  • Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!
  • EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో
  • WHCD Shooter: నిందితుడి హిట్‌ లిస్ట్‌ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ
  • Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!

కానీ, 2017లో ఈ ప్రాజెక్టుకు గండి పడింది. మరమ్మత్తుల కోసం నిధులు మంజూరయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదు లేదా ఆరు కోట్లు ఖర్చు చేసి ఉంటే అప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ అది పూర్తిచేయకుండా కొత్తగా పనులు ప్రారంభించినట్లు చూపించి వదిలేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అలగనూరు ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం అసెంబ్లీలో లేవనెత్తిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, మంత్రి ఛాంబర్ లో అధికారులతో కలిసి ప్రాజెక్టుపై వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 36 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తే నీటిని నిల్వ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి క్లియరెన్స్ కూడా వస్తుందని తెలిపారు.

Read Also: Temba Bavuma: ఛీ.. ఛీ.. ఇక మారరా మీరు.. ‘చోక్’ అంటూ స్లెడ్జింగ్‌.. దక్షిణాఫ్రికా కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..!

ఈ ప్రాజెక్టు ద్వారా కేసీ కెనాల్‌కు 92,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇరుకారు పంటల సాగు కోసం రైతులకు భరోసా కలిగించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తైతే దాదాపు లక్ష ఎకరాలకు ఎకరానికి రూ. 25,000 ఆదాయం వస్తే మొత్తం రూ. 250 కోట్ల ఆదాయం రైతులకు లభిస్తుందని అంచనా వేశారు. ఇది కాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా మత్స్యకారులకు సుమారు ఐదు నుండి ఆరు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇసుక కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్ ప్రభుత్వం రైతుల కోసం మాత్రం ఈ ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు కావలసిన ప్రతిదాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ ప్రాజెక్టును పూర్తిచేసి రైతాంగానికి నీరు అందించేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని, ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది నీటిని నింపేందుకు ప్రయత్నిస్తామని పుట్టా సుధాకర్ యాదవ్ హామీ ఇచ్చారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Alaganur Reservoir
  • Drinking Water Project
  • irrigation project
  • Jai Surya MLA
  • kadapa district

తాజావార్తలు

  • Drishyam 3: ప్రమోషన్స్ లేకుండానే ‘దృశ్యం 3’ రిలీజ్..!

  • EkDin : కొడుకు పర్ఫెమెన్స్ చూసి కంటతడి పెట్టుకున్న స్టార్ హీరో

  • WHCD Shooter: నిందితుడి హిట్‌ లిస్ట్‌ నుంచి అతనొక్కడే మినహాయింపు.. కారణమేంటో..! సర్వత్రా చర్చ

  • Snake Hiding Places: మీ ఇంట్లోకి పాము వచ్చిందా..? వాటికి ఇష్టమైన.. అవి దాక్కునే ప్రదేశాలు ఇవే..!

  • Designer Pen Smuggling: ఒక్కో పెన్ను రూ.50 వేలు.. కస్టమ్స్ సైతం నివ్వెరపోయే స్మగ్లింగ్!

ట్రెండింగ్‌

  • Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్‌వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!

  • 7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!

  • 165Hz రిఫ్రెష్ రేట్‌, 12.3 అంగుళాల డిస్‌ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!

  • వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!

  • రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions