MLA Putta Sudhakar: తాగునీటి సమస్యకు పరిష్కారంగా అలగనూరు రిజర్వాయర్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MLA Putta Sudhakar: కడప జిల్లా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, నందికొట్కూరు ఎమ్మెల్యే జై సూర్యలతో కలిసి అలగనూరు బ్యాలెన్స్డ్ రిజర్వాయర్ను సందర్శించారు. ఈ సందర్శన సందర్భంగా పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. కడప జిల్లాలో తాగునీటి, సాగునీటి అవసరాలను తీర్చగలిగే శక్తి ఉన్న ప్రాజెక్టు అలగనూరేనని పేర్కొన్నారు. 1985లో స్వర్గీయ ఎన్టీఆర్ ఈ రిజర్వాయర్కు మూడుకోట్ల రూపాయలతో శంకుస్థాపన చేశారు. 3500 ఎకరాల విస్తీర్ణంలో డ్యాం నిర్మాణాన్ని ఆ రోజు లక్ష్యంగా పెట్టుకున్నారని తెలిపారు. అయితే పూర్తి స్థాయిలో 59.76 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టు 2004లో పూర్తి చేయబడింది. 2005లో 2.6 టీఎంసీల నీటిని నింపి ఉపయోగంలోకి తీసుకురాగలిగారు.
Read Also: Thiruvananthapuram: F-35 యుద్ధవిమానం అత్యవసర ల్యాండింగ్..!
Also Read
- FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు 'ఛాంపియన్షిప్ రింగ్స్'..
- Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
- Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
- Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
కానీ, 2017లో ఈ ప్రాజెక్టుకు గండి పడింది. మరమ్మత్తుల కోసం నిధులు మంజూరయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఐదు లేదా ఆరు కోట్లు ఖర్చు చేసి ఉంటే అప్పటికే ప్రాజెక్టు పూర్తయ్యేది. కానీ అది పూర్తిచేయకుండా కొత్తగా పనులు ప్రారంభించినట్లు చూపించి వదిలేశారని ఎమ్మెల్యే ఆరోపించారు. అలగనూరు ప్రాజెక్టు పునరుద్ధరణ కోసం అసెంబ్లీలో లేవనెత్తిన విషయాన్ని గుర్తుచేసిన ఆయన, మంత్రి ఛాంబర్ లో అధికారులతో కలిసి ప్రాజెక్టుపై వివరాలు ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం 36 కోట్ల రూపాయలతో పూర్తి చేస్తే నీటిని నిల్వ చేసేందుకు అవకాశం ఉందని తెలిపారు. ఈ మేరకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుండి క్లియరెన్స్ కూడా వస్తుందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు ద్వారా కేసీ కెనాల్కు 92,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడం సాధ్యమవుతుందని చెప్పారు. ఇరుకారు పంటల సాగు కోసం రైతులకు భరోసా కలిగించాలని కోరారు. ప్రాజెక్టు పూర్తైతే దాదాపు లక్ష ఎకరాలకు ఎకరానికి రూ. 25,000 ఆదాయం వస్తే మొత్తం రూ. 250 కోట్ల ఆదాయం రైతులకు లభిస్తుందని అంచనా వేశారు. ఇది కాకుండా ఈ ప్రాజెక్టు ద్వారా మత్స్యకారులకు సుమారు ఐదు నుండి ఆరు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఇసుక కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్ ప్రభుత్వం రైతుల కోసం మాత్రం ఈ ప్రాజెక్టును పూర్తిచేయలేకపోయిందని విమర్శించారు. సీఎం చంద్రబాబు నాయుడు రైతులకు కావలసిన ప్రతిదాన్ని చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఈ ప్రాజెక్టును పూర్తిచేసి రైతాంగానికి నీరు అందించేందుకు తాము శాయశక్తులా కృషి చేస్తామని, ఈ ఏడాది లేదా వచ్చే ఏడాది నీటిని నింపేందుకు ప్రయత్నిస్తామని పుట్టా సుధాకర్ యాదవ్ హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
FIFA Final: 96 ఏళ్ల సాకర్ చరిత్రలో తొలిసారి.. వరల్డ్ కప్ ఫైనల్ విజేతలకు ‘ఛాంపియన్షిప్ రింగ్స్’..
-
Earthquake: మెక్సికోలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
-
Rohit-Kohli Retirement: లార్డ్స్ వేదికగా రోహిత్, కోహ్లీ ఇద్దరూ గుడ్ బై చెప్పేస్తారా..? క్రీడా వర్గాల్లో కలకలం..
-
Pakistan: కువైట్తో రక్షణ ఒప్పందానికి పాక్ ప్రయత్నాలు.. సౌదీ తర్వాత కొత్త వ్యూహం?
-
Sir Garfield Sobers: ఇక సెలవు.. 6 బంతుల్లో 6 సిక్సర్లు కొట్టిన తొలి మొనగాడు.. రికార్డులు చూస్తే షాక్ అవ్వాల్సిందే!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?