MLA KP Vivekananda : కేసీఆర్ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ, ఐటీ దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న ఉదయం నుంచి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మంత్రి మల్లారెడ్డి నివాసంతో పాటు ఆయన కూమారుడు మహేందర్ రెడ్డి, అల్లడు రాజశేఖర్ రెడ్డిల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో… నిన్నటి నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తుండగా.. మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థత గురయ్యారు. దీంతో ఆయను సూరారంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే.. ఈ క్రమంలో కొడుకు మహేందర్ రెడ్డిని చూసేందుకు మల్లారెడ్డి వెళ్లారు. అయితే.. మల్లారెడ్డి ఆసుపత్రిలోకి అనుమతించలేదు ఐటీ అధికారులు. దీంతో ఆసుపత్రి ముందే బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతూ.. బీజేపీ సమావేశాల్లో రాష్ట్ర బాగోగులపై చర్చ చేస్తారు అనుకున్నామని, విషం గక్కే పనిలోనే పడ్డారంటూ ఆయన విమర్శలు గుప్పించారు.
Also Read : Puvvada Ajay Kumar : దాడులను సహించేది లేదు.. శ్రీనివాస రావుపై దాడి, హత్య చేసిన ఎవరినీ వదిలిపెట్టం
ఆట మొదలైంది అని ఎన్ని సార్లు చెప్తారు బై మీరు.. ప్రధాని వచ్చి కూడా .. స్థాయికి దిగదారి మాట్లాడారు అంటూ ఆయన మండిపడ్డారు. మునుగోడు ఓటమి తరవాత .. రోజు దాడులు చేస్తున్నారని, బీజేపీ రాష్ట్ర అధ్యక్ధుడు.. కేంద్ర మంత్రికి రాజకీయం చేయడానికి చేత కావడం లేదని, కేసీఆర్ తో పోటీ పడలేకపోతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్ ని రాజకీయంగా ఎదుర్కోలేక ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారని, బీజేపీకి పోయే కాలం దగ్గర పడిందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Also Read : భారత యుద్ధ చరిత్ర.. ఎన్ని యుద్ధాల్లో గెలిచిందో తెలుసా..?
ప్రభుత్వాలు కూల్చుడు… ఎమ్మెల్యేల కొనడమేనా బీజేపీ ధర్మం అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ కోసం ఉప ఎన్నికలు టీఆర్ఎస్ తెచ్చిందని, బీజేపీ కుట్రల కోసం ఉప ఎన్నికలు తెస్తోందని ఆయన ఆరోపించారు. చేసేవి తప్పుడు పనులు.. విచారణ వద్దని కోర్టుకి వెళ్తారు.. బండి సంజయ్ ప్రమాణం చేశారు.. మరి విచారణ అంటే వద్దు అంటారు ఎందుకు.. బీఎల్ సంతోష్ దేవుడు అంటా.. ఎవరికి దేవుడు.. దేవుడా..దెయ్యమా..? దేవుడే అయితే విచారణ కి రాడా సంతోష్… కవిత మీద తప్పుడు ప్రకటనలు చేసే ఎంపీలు ఉన్నారు బీజేపీలో.. కోర్టు సిట్ విచారణకు హాజరు అవ్వాలని చెప్తే కూడా హాజరు కారా.. వివేక్.. ఈటల..ధర్మపురి లాంటి వల్లపై ఐటీ విచారణ ఎందుకు జరగడం లేదు.. బీజేపీ పదే పదే దాడులు చేయిస్తున్నారని ఆయన మండిపడ్డారు. అయినా మేము భయపడటం లేదని, బీజేపీ వేధించని రాష్ట్రం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read
- Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
- ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
- Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
- Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: ఆల్ రౌండర్గా వైభవ్ సూర్యవంశీ.. అందుకే వైస్ కెప్టెన్సీ బాధ్యతలు..
-
ICC World Cup: 2027 వరల్డ్ కప్ వేదిక నగరాల ప్రకటన.. మూడు దశల కొత్త ఫార్మాట్లో ఇలా..
-
Dehradun: ‘అత్తింటివారి మనస్తత్వం మారదు’.. వీడియో రికార్డ్ చేసి టీచర్ ఆత్మహత్య
-
Rishab Shetty: రామాయణ ట్రైలర్కి ఫిదా అయిన రిషబ్ శెట్టి.. ఏం అన్నారంటే!
-
Rajya Sabha: యాంటీ పేపర్ లీక్ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
ట్రెండింగ్
-
Alien Temple: ఏలియన్కు ఆలయం.. ఎక్కడ ఉంది.? ఆలయ విశేషాలేంటంటే..!
-
Google Pixel 11 సిరీస్లో కొత్త ట్విస్ట్.. లాంచ్కు కీలక ఫీచర్స్ లీక్..!
-
WhatsApp Webలో ఆడియో, వీడియో కాలింగ్ సపోర్ట్.. Call Transfer, Waiting Room సహా కొత్త ఫీచర్స్ కూడా.!
-
7,200mAh బ్యాటరీ, Dimensity 7400 Turbo చిప్తో vivo T5x 5G కొత్త Fusion Red కలర్ వేరియంట్ లాంచ్..!
-
Ajinkya Rahane: అజింక్య అంటే ఓడిపోనివాడు.. కానీ క్రికెట్ ఎన్నో ఓటములను చూపించింది!