Puvvada Ajay Kumar : దాడులను సహించేది లేదు.. శ్రీనివాస రావుపై దాడి, హత్య చేసిన ఎవరినీ వదిలిపెట్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిన్న గుత్తికోయల దాడిలో మరణించిన ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాస రావు అంత్యక్రియల్లో మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దాడులను సహించేది లేదన్నారు. శ్రీనివాస రావు పై దాడి చేసి, దారుణంగా హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టమని వారు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుందని వారు వెల్లడించారు. సీఎం కేసీఆర్ ఈ విషయంపై వెంటనే స్పందించారని, అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ ను ఆదేశించారన్నారు.
Also Read : Dharmana Prasada Rao: విశాఖ రాజధాని అయితే చంద్రబాబు వచ్చిన నష్టం ఏంటి..? బిజినెస్ చేస్తూ హైదరాబాద్లో ఉంటాడు..!
ఇర్లపుడి వెళ్ళి ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు అంతిమ యాత్రలో పాల్గొనాలని మమ్మల్ని ఆదేశించారని, సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వము రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసిందన్నారు. ఇక్కడి గిరిజనులతో సమస్య లేదని, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కొయలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారని వారు ఆరోపించారు. అడవులను నరికినట్లు మా అటవీ అధికారులను కూడా నర్కుతం, దాడులు చేస్తాం అంటే ఊరుకునేది లేదని, ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదని వారు మరోసారి ఉద్ఘాటించారు.
Also Read
- Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
- 10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
- CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
- Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
తాజావార్తలు
-
Samsung Galaxy A27 5G vs OnePlus Nord 6: ఏ స్మార్ట్ఫోన్ బెస్ట్?
-
TGPSC జాబ్ అలర్ట్.. 19 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
-
10100mAh బ్యాటరీతో రెడ్మీ నోట్ 17 ప్రో మాక్స్? Redmi Note 17 సిరీస్లో డిస్ప్లే, బ్యాటరీలో భారీ అప్గ్రేడ్లు.!
-
CM Chandrababu Naidu: డేటానే కొత్త సంపద.. స్వర్ణాంధ్ర 2047 సాధనే లక్ష్యం.!
-
Aishwarya Rai: ఐదో తరగతిలో ఐశ్వర్యరాయ్ పాఠ్యాంశం.. ప్రజలు తీవ్ర ఆగ్రహం
ట్రెండింగ్
-
50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 120Hz Super AMOLED డిస్ప్లేతో Samsung Galaxy Jump 5 లాంచ్.!
-
52dB ANC, 54 గంటల బ్యాటరీ బ్యాకప్తో TWS ఇయర్బడ్స్ OPPO Enco Air5 లాంచ్..!
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!