Dulam Nageswara Rao: ప్రజలకు మేలు చేస్తే చంద్రబాబు సహించలేడు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో ప్రజా ఆశీర్వాద యాత్రలో భాగంగా కలిదిండి మండలంలో వైసీపీ కార్యకర్తలు భారీ బైక్ ర్యాలీతో బయలుదేరి భాస్కర్ రావు పేట, సంతోష్ పురం, అమరావతి, గురువాయుపాలెం గ్రామాల్లో ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ.. ప్రతి గడపగడపకు ప్రతి అక్క చెల్లెలు పలకరిస్తుంటే.. డీఎన్ఆర్ అన్న 12 రోజులే ఎలక్షన్ ఉంది ఎందుకు తిరుగుతున్నారు.. జగనన్న ముఖ్యమంత్రి అయ్యే వరకు మేము కష్టపడతామని అంటుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. మాకు పెన్షన్ ఇస్తున్నారు, ప్రతి కుటుంబంలో మా బిడ్డలను చదివించడానికి అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్నారు.. వాలంటీర్లను తీసి వేయడం వల్ల పెన్షన్ తెచ్చుకునేందుకు ఈ రెండు నెలల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నామని వారు చెబుతున్నారని కైకలూరు ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు.
Read Also: MLC Kavitha: కవితకు మరోసారి షాక్.. మళ్లీ వాయిదా పడ్డ బెయిల్ పిటిషన్..
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
చంద్రబాబు నాయుడుకి ఇలాంటి దుర్మార్గమైన ఆలోచన ఎందుకు వచ్చిందో గాని ప్రజలకు మేలు చేస్తే సహించలేడు అంటూ కైకలూరి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూలం నాగేశ్వరరావు మండిపడ్డారు. ప్రజల్లోకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి కన్న బాగా చేస్తానని చెప్పుకొని ఓట్లు అడగాలి తప్ప అవ్వ తాతలకు వచ్చే పెన్షన్ రాజకీయం చేయటం సరికాదన్నారు. ప్రజల సొమ్ము పప్పు బెల్లాలు లాగా పంచి పెడుతున్నాడు అని వ్యాఖ్యనించిన ఈ ప్రతిపక్ష నాయకుడు.. ఇప్పుడేమో అంతకన్నా ఎక్కువ ఇస్తానని ప్రచారం చేస్తున్నారు.. జగన్ మోహన్ రెడ్డి చేస్తే తప్పు చంద్రబాబు చేస్తే ఒప్పు అయిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. ఇక్కడ స్థానిక ప్రతిపక్ష అభ్యర్థి నా పైన, నా కొడుకులపై బురద జల్లటానికి ఒక వీడియో రిలీజ్ చేశారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అభ్యర్థించుకోవాలి తప్ప ఇలాంటి చౌకబారు రాజకీయాలు చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని దూలం నాగేశ్వరరావు అన్నారు.
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!