Mithun Manhas: మిథున్ మన్హాస్ BCCI కొత్త అధ్యక్షుడిగా ఎంపికయ్యారు. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మొదట తన ఎక్స్ (ట్విట్టర్) హ్యాండిల్లో ఈ నియామక వార్తను పంచుకున్నారు. మిథున్ మన్హాస్ అధికారికంగా BCCI అధ్యక్షుడిగా నియమితులైనట్లు ట్వీట్లో పేర్కొన్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా మిథున్ మన్హాస్ పేరు ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28న ముంబైలో జరిగిన వార్షిక సర్వసభ్య సమావేశం (AGM) ముగిసిన తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా మన్హాస్ అధికారికంగా నియమితులయ్యారు.
ఢిల్లీ మాజీ క్రికెటర్ మిథున్ మన్హాస్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. సెప్టెంబర్ 28న జరిగే వార్షిక సర్వసభ్య సమావేశం (AGM)కు ముందు ఖాళీగా ఉన్న బోర్డు పదవులకు అభ్యర్థులను ఖరారు చేయడానికి బీసీసీఐ అనుభవజ్ఞులైన నిర్వాహకులు, కీలక నిర్ణయాధికారులు శనివారం అనధికారిక సమావేశాన్ని నిర్వహించారు. వర్గాల సమాచారం ప్రకారం, పేర్లు పరిశీలించబడిన వారిని సమావేశానికి పిలిచారు. జమ్మూ క్రికెట్ అసోసియేషన్ నుండి వచ్చిన మాజీ…