Tamilnadu: కిడ్నాపర్గా భావించి వలస కూలీని చితకబాదిన జనం.. చివరకు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tamilnadu: తమిళనాడులో కిడ్నాపర్గా భావించి వలస కూలీని జనం తీవ్రంగా కొట్టారు. కిడ్నాపర్ అనే అనుమానంతో వలస కార్మికుడిపై గుంపు దాడి చేయడం ఇది ఐదో కేసు. ఆ వ్యక్తి వీడియో కాల్ మాట్లాడుతూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా మంగళవారం ఈ ఘటన జరిగింది. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు గుమిగూడి అతని ఆచూకీ గురించి ఆరా తీశారు. కానీ మత్తులో ఉన్న ఆ వ్యక్తి సమాధానం చెప్పలేకపోయాడు. వారు ఆ వ్యక్తి ఫోన్ను కూడా అడిగారు. అతను ఇవ్వడానికి నిరాకరించడంతో పాటు ఫోన్ను స్విచ్ ఆఫ్ చేశాడు.
Read Also: Loksabha Elections 2024: పంజాబ్లో 8 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించిన ఆప్
Also Read
ఈ క్రమంలో కిడ్నాపర్గా భావించిన జనాలు అతడిని తీవ్రంగా కొట్టారు. అనంతరం పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని బీహార్కు చెందిన వలస కూలీగా గుర్తించారు. విచారణలో ఆ వ్యక్తి తన బంధువుతో వీడియో కాల్లో ఉన్నాడని, ముఠా దొంగిలించడానికి ప్రయత్నిస్తుందనే భయంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశానని తెలిపాడు. పోలీసులు కూడా అతను కిడ్నాపర్ అనే వాదనను కొట్టివేసి విడుదల చేశారు. ఉత్తర భారతదేశానికి చెందిన వ్యక్తులు రాష్ట్రంలో పిల్లలను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారనే తప్పుడు కథనాలను నమ్మవద్దని, ఒకసారి వారిని ఆరా తీసిన అనంతరం పోలీసులను ఆశ్రయించాలని ప్రజలను అభ్యర్థించారు.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..