Minister Viswaroop: లారీ యజమానుల సమస్యలు పరిష్కరిస్తా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయవాడలో రవాణా శాఖ మంత్రి పినిపె విశ్వరూప్, రవాణా శాఖ మాజీ మంత్రి పేర్ని నానికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లారీ ఓనర్స్ అసోషియేషన్ నేతృత్వంలో సన్మానం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి విశ్వరూప్ కు వినతి పత్రం ఇచ్చింది లారీ యజమానుల సంఘం. రాష్ట్రంలో లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు మంత్రి విశ్వరూప్. లారీ యజమానులిచ్చిన వినతి పత్రంలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా అని హామీ ఇచ్చారు. విభజనతో మిగులు బడ్జెట్ తెలంగాణకు వెళ్తే, లోటు బడ్జెట్ ఏపీకి వచ్చింది. కోవిడ్ మహమ్మారితో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల సీఎం జగన్ అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు.
ఏడాదికి ఒక సారైనా సీఎం వద్ద లారీ యజమానుల సంఘం నేతలతో సమావేశం ఏర్పాటుకు ప్రయత్నిస్తా. సీఎంతో చర్చించి లారీ యజమానుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటా. లారీలకు కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ప్రయత్నం చేస్తానన్నారు మంత్రి పినిపె విశ్వరూప్.
Also Read
- APSP Constable: గోదావరిలో దూకిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ మృతదేహం లభ్యం.. వేధింపులే కారణమా?
- Paraquat Herbicide Ban: హైకోర్టుకు చేరిన గడ్డి మందు వివాదం.. ప్రభుత్వ జీవోపై సవాల్
- President Murmu AP Visit: విశాఖ పర్యటనకు రాష్ట్రపతి.. గిరిజన వర్సిటీ స్నాతకోత్సవానికి ముర్ము..
- Sai Krishna Missing Case: సాయికృష్ణ కేసులో కొత్త ట్విస్ట్.. కృష్ణలంక పీఎస్ సీసీటీవీలపై ఏసీపీ టీమ్ ఫోకస్..
లారీ యజమానుల సంఘం మంత్రికి ఇచ్చిన వినతిపత్రంలో అనేక అంశాలు ప్రస్తావించారు. ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్రంలో డీజిల్ రేట్లు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కువ రేటుకు డీజిల్ కొనుగోలు చేయడం వల్ల లారీ యజమానులు తీవ్రంగా నష్టపోతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల వాహన యజమానులు రాష్ట్రంలో డీజిల్ కొనడం లేదు. రాష్ట్రంలో డీజిల్ రేట్లు ఎక్కువ ఉండటం వల్ల కొనుగోళ్లు తక్కువై రాష్ట్రానికి నష్టం వస్తోంది. డీజిల్ పై టాక్సులను తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు లేక లారీ యజమానులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ-ఏపీ మధ్య కౌంటర్ సిగ్నేచర్ పర్మిట్లు జారీ చేయాలి. ఆర్టీఎ అధికారులు ఇష్టమొచ్చినట్లుగా లారీలపై కేసులు రాస్తూ ఇబ్బందులు పెడుతున్నారు.
లారీలపై గ్రీన్ టాక్స్ ను 200 నుంచి 20 వేలకు పెంచడం సహా అధిక జరిమానాలు విధించడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ఆర్థిక సంక్షోభం దృష్ట్యా పెనాల్టీలు తగ్గించాలి. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా 17సార్లు లారీ ఒనర్స్ అసోషియేషన్ కు అపాయింట్ మెంట్ ఇచ్చి సమస్యలు పరిష్కరించారు. వైఎస్ జగన్ సీఎం అయ్యాక మూడేళ్లుగా అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నా ఇవ్వడంలేదని లారీ యజమానుల సంఘం అభిప్రాయపడింది.
Hyderabad Rain : హైదరాబాద్లో భారీ వర్షం.. పలు రోడ్లు జలమయం..
తాజావార్తలు
-
Samsung Galaxy M47 5G: సామ్ సంగ్ గెలాక్సీ M47 5G టీజర్ విడుదల.. Snapdragon 6 Gen 3 చిప్సెట్తో త్వరలో లాంచ్
-
Bandi Bhagirath: పోక్సో కేసులో బండి భగీరథ్కు బెయిల్..
-
Rukmini Vasanth : AIతో మార్ఫింగ్ వీడియోలు.. నటి రుక్మిణి వసంత్ పేరుతో అసభ్యకర ప్రచారం.. ముగ్గురి అరెస్ట్
-
Tata Sierra EV: టాటా సియెర్రా EV టీజర్ విడుదల.. ఫస్ట్ లుక్ అదిరింది.. భారీ బ్యాటరీ, ప్రీమియం ఫీచర్లతో ఎంట్రీ
-
Siddipet District: కసాయి తల్లి.. ప్రియుడితో ఏకాంతానికి అడ్డొచ్చాడని రెండేళ్ల కొడుకును హతమార్చిన వైనం..
ట్రెండింగ్
-
Titanoboa: డైనోసార్ల తర్వాత భూమిని ఏలిన ‘టైటానోబోవా’.. ఈ అతిపెద్ద సర్పం గురించి షాకింగ్ విషయలు..
-
Kitchen Tips : గ్యాస్ స్టవ్ కడ్డీలపై జిడ్డా.? ఈ 2 చిట్కాలతో కొత్తలా మెరుస్తాయి.!
-
Freezer Cleaning Hacks: ఫ్రీజర్లో ఐస్ పేరుకుపోతోందా.? ఈ ట్రిక్స్తో నిమిషాల్లో క్లీన్.!
-
Food Grade Knives : తుప్పు కత్తులు వాడుతున్నారా.? ఇక భారీ మూల్యం చెల్లించాల్సిందే.!
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!