Minister Uttam: మేడిగడ్డ పరిశీలనపై సీఎంకి నివేదిక ఇస్తాం.. ఏం చేస్తాం అనేది ప్రకటన చేస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మేడిగడ్డ బ్యారేజ్ ను తెలంగాణ మంత్రుల బృందం పరిశీలించింది. బ్యారేజీకి బుంగలు పడ్డ చోటును మంత్రులు పరిశీలించారు. అనంతరం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ప్రాజెక్టులో లోపాలన్ని మానవ తప్పిదాలేనని తెలిపారు. లోపాలపై నివేదిక రాగానే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. మరోవైపు.. మేడిగడ్డ కుంగడంతో రెండో పంటకు సాగునీటిపై సందిగ్ధత ఏర్పడిందని మంత్రి ఉత్తమ్ చెప్పారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ఆలోచిస్తున్నాం.. మేడిగడ్డ పరిశీలనపై సీఎంకి రెండు.. మూడు రోజుల్లో నివేదిక ఇస్తామని అన్నారు. కాళేశ్వరంపై ఏం చేస్తాం అనేది.. ప్రకటన చేస్తామని పేర్కొన్నారు. ఇంత నాసిరకం నిర్మాణం ఎక్కడా చూడలేదని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
Read Also: TS Inter Exam Fee: ఇంటర్ పరీక్ష ఫీజు గడువు పొడిగింపు.. ఎప్పటి వరకంటే..?
Also Read
- Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
- Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
- David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
- CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
కాళేశ్వరం ప్రారంభం నుంచే తమకు అనుమానాలు ఉన్నాయన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్ తో పాటు.. ప్రాజెక్ట్ లొకేషన్ కూడా మార్చేసిందని మండిపడ్డారు. మేడిగడ్డలో ఫిల్లర్లు 5 ఫీట్లు కుంగిపోయిందని అన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్ట్ కాళేశ్వరం అని చెప్పిన కేసీఆర్.. అది కుంగితే ఒక్క స్టేట్ మెంట్ కూడా ఇవ్వలేదని తెలిపారు. లక్ష కోట్లు అంతా మూడు బ్యారేజ్ లపైన ఉందని.. మూడు బ్యారేజ్ లలో డ్యామేజ్ లు వచ్చాయన్నారు మంత్రి ఉత్తమ్.
Read Also: AL Vijay: అమలా పాల్ మాజీ భర్తపై యువకుడు దాడి.. కారును ఆపి
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. కేటీఆర్ ఇచ్చింది స్వేద పత్రం కాదు.. సోది పత్రమని విమర్శించారు. బీఆర్ఎస్ వాళ్ళది దోపిడీ అని మండిపడ్డారు. మేడిగడ్డ కుంగడం చిన్న విషయమే అయితే.. జనాలను ఎందుకు చూడనివ్వలేదని ప్రశ్నించారు. కాళేశ్వరంలో కీలకమైన అన్నారం, సుందిళ్ళ, మేడిగడ్డ అన్నీ వృధా అని ఆరోపించారు. నాగార్జున సాగర్ ఇంతకంటే స్టాండర్డ్ గా ఉందని తెలిపారు. మూడేళ్ళ ప్రాజెక్టు లాగా కాళేశ్వరం లేదు.. నాణ్యత లోపం ఉందని మంత్రి కోమటిరెడ్డి అన్నారు.
తాజావార్తలు
-
Supreme Court: సీజేపీకి సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ.. ఉద్యమంపై ప్రధాన న్యాయమూర్తి సంచలన వాఖ్యలు..
-
Hyderabad: ACBకి చిక్కిన మరో అవినీతి అధికారి.. భారీ మొత్తంలో ఆస్తులు గుర్తింపు.!
-
David Warner: డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికిన స్టార్ క్రికెటర్.. నేరం అంగీకారం.. శిక్షపై ఉత్కంఠ..!
-
CJP Protest: ఉద్యమం ఆగదు.. 4 ప్రధాన డిమాండ్లను ప్రకటించిన సీజేపీ!
-
Karimnagar: అర్ధరాత్రి దొంగల బీభత్సం.. కత్తులు, తుపాకులతో బెదిరించి.. రూ. 50 లక్షలు అపహరణ.!
ట్రెండింగ్
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Light Flip 5G Phone: సోషల్ మీడియా లేని 5G ఫోన్.. 50MP కెమెరాతో Light Flip కొత్త కాన్సెప్ట్.!
-
10 రోజుల బ్యాటరీ, 80+ స్పోర్ట్స్ మోడ్లు.! స్క్రీన్ లేకుండానే హెల్త్ ట్రాకింగ్.. Garmin CIRQA స్మార్ట్ బ్యాండ్ లాంచ్.!
-
OLED డిస్ప్లే, RTX 5090 GPUతో పవర్ఫుల్ పనితీరుతో Dell కొత్త Alienware గేమింగ్ ల్యాప్టాప్లు లాంచ్..! ఫీచర్స్, ధరలు ఇలా..!
-
Best Camera Phones: DSLRకు పోటీగా ఫొటోగ్రఫీ అనుభవం..! బెస్ట్ కెమెరా ఫోన్ల లిస్ట్ ఇదిగో..!