Uttam Kumar Reddy: సిడబ్ల్యూసి ఛైర్మన్తో మంత్రి భేటీ.. నీటి ప్రాజెక్టులపై కీలక సమావేశం.!
- కేంద్ర జల సంఘం” (సిడబ్ల్యుసి) ఛైర్మన్ అతుల్ జై తో సమావేశమైన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి.
- సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు.
- మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడం పై జాతీయ డామ్ సంరక్షణ సంస్థ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చ.
- సమ్మక్క, సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు.
- కృష్ణానది పై పలు చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ అతుల్ జైతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రధాన ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Read Also: Operation Sindoor: సర్జికల్ స్ట్రైక్స్ + బాలాకోట్ స్ట్రైక్స్ = ఆపరేషన్ సిందూర్..
Also Read
- Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
- Ind vs Eng 3rd ODI: నేడే హై ఓల్టేజ్ పోరు.. ఆ జట్టుకే అడ్వాంటేజ్.. పిచ్ రిపోర్ట్, ప్లేయింగ్ ఎలెవన్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు ఇవే!
- Nitin Gadkari: E20 వద్దనుకునేవారు100 శాతం పెట్రోల్ పొందొచ్చు: నితిన్ గడ్కరీ
- Hydrogen Train: కేవలం రూ.10 టికెట్తో హైడ్రోజన్ రైలు ప్రయాణం.. రూట్ మ్యాప్, స్టాపేజీలు ఇవే..
ఇక మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడంపై “జాతీయ డ్యామ్ సంరక్షణ సంస్థ” (NDSA) ఇప్పటికే నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మేడిగడ్డ డిజైన్, ఆపరేషన్లో లోపాలున్నాయని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్.. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా, ప్రాజెక్ట్ పునరుద్ధరణకు సరైన మార్గాలను అన్వేషిస్తున్నాం అని పేర్కొన్నారు. డీపీఆర్లో చూపిన స్థలం ఒకటి కాగా, అసలు నిర్మాణం వేరే ప్రాంతంలో జరిగిందని ఆయన విమర్శించారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల విషయంలో కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎన్డీఎస్సీ సూచించిందని చెప్పారు.
Read Also: Reels Malking: రీల్స్ తీసి పెట్టండి… డబ్బులు సంపాదించండి!
అలాగే నూతన నిర్మాణాలు, కేటాయింపులపై ఆయన చర్చించారు. ఇందులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అలాగే తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టును నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇంకా సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసిల నీటిని త్వరితగతిన కేటాయించాలని కోరారు. వీటితోపాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మొత్తం 90 టీఎంసిలు అవసరమని, తక్షణమే 45 టీఎంసులను ముందుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ముఖ్యంగా కృష్ణా నది నుంచి అక్రమంగా నీటిని తరలించకుండా నియంత్రణ అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు నదిపై వివిధ ప్రదేశాల్లో టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపు ప్రమాదం ఉందని పేర్కొంటూ రిటెన్షన్ వాల్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Sharwanand : మహాభారతం నేపథ్యంలో నాగబంధం దర్శకుడితో శర్వానంద్..
-
Covid 19-AP: ఏపీలో అప్రమత్తం.. ప్రత్యేక కొవిడ్ వార్డు ఏర్పాటు!
-
Suriya : ఎక్స్పరిమెంట్స్ వద్దు.. రొటీన్ కమర్షియల్ సినిమాలే ముద్దంటున్న సూర్య
-
Fahadh Faasil: టామ్ క్రూజ్ సినిమాను వదులుకున్న ఫహద్ ఫాసిల్.. కారణం తెలిస్తే షాకవుతారు!
-
FIFA World Cup 2026 Final: మెస్సీ వర్సెస్ యమాల్.. అర్జెంటీనా-స్పెయిన్ ఫైనల్ పోరు, ఎవరిది పైచేయి?
ట్రెండింగ్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!
-
Rohit Sharma Retirement: రోహిత్ శర్మ అభిమానులకు శుభవార్త.. రిటైర్మెంట్ లేనట్టే!