Uttam Kumar Reddy: సిడబ్ల్యూసి ఛైర్మన్తో మంత్రి భేటీ.. నీటి ప్రాజెక్టులపై కీలక సమావేశం.!
- కేంద్ర జల సంఘం” (సిడబ్ల్యుసి) ఛైర్మన్ అతుల్ జై తో సమావేశమైన తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి.
- సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు.
- మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడం పై జాతీయ డామ్ సంరక్షణ సంస్థ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చ.
- సమ్మక్క, సారక్క, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు.
- కృష్ణానది పై పలు చోట్ల టెలిమెట్రి పరికరాలు ఏర్పాటు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttam Kumar Reddy: తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర జల సంఘం (CWC) ఛైర్మన్ అతుల్ జైతో కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మేడిగడ్డ, సమ్మక్క సారక్క, పాలమూరు-రంగారెడ్డి వంటి ప్రధాన ప్రాజెక్టులపై చర్చ జరిగింది. రాష్ట్ర నీటిపారుదల శాఖకు చెందిన ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.
Read Also: Operation Sindoor: సర్జికల్ స్ట్రైక్స్ + బాలాకోట్ స్ట్రైక్స్ = ఆపరేషన్ సిందూర్..
Also Read
ఇక మేడిగడ్డ డ్యామ్ కూలిపోవడంపై “జాతీయ డ్యామ్ సంరక్షణ సంస్థ” (NDSA) ఇప్పటికే నివేదికను సమర్పించింది. ఈ నివేదికలో మేడిగడ్డ డిజైన్, ఆపరేషన్లో లోపాలున్నాయని స్పష్టం చేశారు. దీనిపై స్పందించిన మంత్రి ఉత్తమ్ కుమార్.. ప్రజాధనాన్ని దుర్వినియోగం కాకుండా, ప్రాజెక్ట్ పునరుద్ధరణకు సరైన మార్గాలను అన్వేషిస్తున్నాం అని పేర్కొన్నారు. డీపీఆర్లో చూపిన స్థలం ఒకటి కాగా, అసలు నిర్మాణం వేరే ప్రాంతంలో జరిగిందని ఆయన విమర్శించారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీల విషయంలో కేంద్ర జల సంఘంతో సంప్రదింపులు కొనసాగించాల్సిన అవసరం ఉందని ఎన్డీఎస్సీ సూచించిందని చెప్పారు.
Read Also: Reels Malking: రీల్స్ తీసి పెట్టండి… డబ్బులు సంపాదించండి!
అలాగే నూతన నిర్మాణాలు, కేటాయింపులపై ఆయన చర్చించారు. ఇందులో భాగంగా మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించాలా లేదా అనే అంశంపై తుది నిర్ణయం తీసుకోలేదని మంత్రి తెలిపారు. అలాగే తుమ్మిడి హట్టి వద్ద కొత్త ప్రాజెక్టును నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఇంకా సమ్మక్క సారక్క ప్రాజెక్టుకు 44 టీఎంసిల నీటిని త్వరితగతిన కేటాయించాలని కోరారు. వీటితోపాటు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు మొత్తం 90 టీఎంసిలు అవసరమని, తక్షణమే 45 టీఎంసులను ముందుగా కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఇక ముఖ్యంగా కృష్ణా నది నుంచి అక్రమంగా నీటిని తరలించకుండా నియంత్రణ అవసరమని మంత్రి స్పష్టం చేశారు. ఈ మేరకు నదిపై వివిధ ప్రదేశాల్లో టెలిమెట్రీ పరికరాలను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. అలాగే, పోలవరం బ్యాక్ వాటర్ వల్ల ముంపు ప్రమాదం ఉందని పేర్కొంటూ రిటెన్షన్ వాల్ నిర్మాణం చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Japan Earthquake: జపాన్లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
-
Anirudh : అనిరుథ్ – కావ్య మారన్ పెళ్లి.. కన్ఫర్మ్ చేసిన ఫ్యామిలీ మెంబర్
-
IND vs IRE: పరువు నిలబెట్టుకునే పోరు.. సంజూకు రెస్ట్.. వైభవ్కు ఛాన్స్.. టీమిండియా ప్లేయింగ్-11 ఇదే!
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్తో మరింత సౌలభ్యం.!