Thummala: గత పదేళ్లుగా రుణమాఫీ చేయనందుకు బీఆర్ఎస్ నేతలు సిగ్గుపడాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గతంలో అన్ని రంగాల్లో అవినీతి రాజ్యం ఏలింది అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. గతంలో చేసిన తప్పులను రిదిద్దుకుంటూ ఈ ప్రభుత్వం ముందుకు వెళుతుంది తెలిపారు. వర్షాలు సరిగ్గా లేకపోవడం వల్ల ప్రాజెక్ట్ లలో నీళ్లు లేవు.. నాగార్జున సాగర్ లో గేట్లు ఎత్తిన నీళ్ళు రాని పరిస్థితి నెలకొంది.. ఈనాడు మంచి నీళ్లను ప్రక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పాడింది. సమస్యను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు.. దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది అని ఆయన చెప్పుకొచ్చారు. మన గారెంటీలను దేశం మొత్తం చూస్తుంది.. కష్టకాలంలో కరువు కాలంలో ఉన్నాం.. పరిపాలన ప్రభుత్వం మీద మీరు ఏ రకమైన అనుమానాలకు తావు లేదు.. పరిపాలనలో ఎప్పుడు కూడా ఛీ అనిపించుకోమని మంత్రి తుమ్మల అన్నారు.
Read Also: Sridevi Biopic: నేను బతికుండగా.. శ్రీదేవి బయోపిక్కు అనుమతివ్వను: బోనీ
Also Read
- 243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
- Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
- DSP Bhim Reddy: సస్పెండైన డీఎస్పీ భీమ్రెడ్డిపై ఈడీ కేసు.. రూ.150 కోట్లకుపైగా ఆస్తులపై మనీలాండరింగ్ దర్యాప్తు.!
- 6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
బీఆర్ఎస్ నేతలు రుణ మాఫీ మీద మాట్లాడేందుకు సిగ్గు వుండాలి అంటూ మంత్రి తుమ్మల ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లుగా రుణ మాఫీ చేయలేకపోయారని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో సాగు నీరు ఎక్కడ ఎండిపోలేదు.. రోజుకి 50 కోట్లు ఖర్చు పెట్టి ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా చూస్తున్న ప్రభుత్వం మాది.. పార్లమెంట్ లో ఓట్ల కోసం కొంత మంది విమర్శలు చేస్తున్నారు.. సాగర్ నుంచి పాలేరుకు నీళ్లు తెప్పించాను అని ఆయన చెప్పుకొచ్చారు. చేతకాని పనికిరాని మాటలు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి.. ఇప్పటికీ మీ బుద్ది మారలేదు.. పార్లమెంట్ ఎన్నికల్లో కూడా బుద్ది చెప్పాల్సిన అవసరం వుంది.. ఒక్కటి రెండు సీట్లు కూడా బీఆర్ఎస్ పార్టీకి రావు.. ధాన్యం అమ్ముకున్న వెంటనే మీకు డబ్బులు వచ్చేలా చేస్తున్నాము.. పంట నష్టం భీమా ప్రభుత్వం చెల్లిస్తుంది.. రెండు లక్షల అప్పు ఈ ప్రభుత్వం తీర్చుతుంది.. మంచినీటికి ఇబ్బంది వున్న మాట నిజమే జాగ్రత్తగా వుండాల్సి వుంది.. నీటిని వృదా చేయకుండా పొదుపుగా వాడాలి.. తుక్కుగుడ సభను విజయవంతం చేయాలి అని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.
తాజావార్తలు
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
Abhinandan Varthaman: పాక్ F-16ను కూల్చిన వీరుడు.. IAFకు గుడ్బై చెప్పిన అభినందన్! గోవాలో కొత్త ఇన్నింగ్స్..
-
Stock Market: అమెరికా నుంచి ముంచుకొస్తున్న బిగ్ డేంజర్.. ఈ ఒక్క కారణంతో మళ్లీ షేర్ మార్కెట్ కుప్పకూలుతుందా?
-
Bollaram: డిటోనేటర్ల కలకలం.. ఆర్మీ క్యాంపు సమీపంలో 160 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు గుర్తింపు.!
ట్రెండింగ్
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!