పంచాయితీ రాజ్, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా తన సొంత ఇలాకాలో పర్యటించనున్నారు మంత్రి సీతక్క. రేపు (ఆదివారం) ఉదయం హైదరాబాద్ క్వార్టర్స్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఉదయం 9:15 గంటలకు ములుగు మండలంలోని మహమ్మద్ గౌస్ పల్లికి చేరుకుంటారు. అనంతరం.. ఉదయం 10:15కు ములుగు గట్టమ్మ దేవాలయంలో మంత్రి సీతక్క ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
Read Also: MLC Kavitha: సీఎం రేవంత్ వ్యాఖ్యలకు ఎమ్మెల్సీ కవిత కౌంటర్
ఆ తర్వాత.. 11:30 గంటలకు ములుగు గట్టమ్మ నుండి రోడ్డు మార్గాన ర్యాలీగా బయలుదేరి మేడారం చేరుకుంటారు. మధ్యాహ్నం 1:30 మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం.. మధ్యాహ్నం 3:00 గంటలకు జిల్లా అధికార యంత్రాంగంతో మేడారం జాతర రివ్యూ మీటింగ్ నిర్వహించనున్నారు. సాయంత్రం 4:30కు ఆదివాసి భవన్ మేడారంలో ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. సాయంత్రం 7: 30 గంటలకు ములుగు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం చేరుకుని అక్కడే బస చేస్తారు.
Read Also: Laxman: కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తోంది