Minister Seethakka: ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్..
- ఆదివాసీలకు అస్తిత్వాన్ని కల్పించిన పోరాట యోధుడు కొమురం భీం
- కొమురం భీం పోరాటంతోనే హక్కులు సాధించామన్న మంత్రి
- ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్
- ఆదివాసీల జోలికి వెళ్లొద్దు
ఆదివాసీలకు ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని కల్పించిన పోరాట యోధుడు కొమురం భీం అని మంత్రి సీతక్క అన్నారు. కొమురం భీం లేక పోతే తన ఉనికి ఉండేది కాదన్నారు. కొమురం భీం పోరాటంతోనే హక్కులు సాధించబడ్డాయన్నారు. ఆయన పోరాట స్ఫూర్తితోనే సాగిన ఉద్యమం వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని చెప్పారు. అనంతరం తన ప్రభుత్వం గురించి మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. లక్ష 60 వేల ఎకరాలకు పట్టాలు ఇచ్చామన్నారు.
READ MORE: Tech Tips: కీబోర్డుపై F – J అక్షరాల క్రింద ఒక గీత ఎందుకు ఉంటుందో తెలుసా?
Also Read
- Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
- Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
- GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
- Riyan parag: బీసీసీఐ జరిమానా విధించిన మరుసటి రోజే.. విశ్వరూపం చూపించిన రియాన్ పరాగ్..
ఫారెస్ట్ అధికారులకు మంత్రి సీతక్క వార్నింగ్ ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు పోడు భూముల విషయం లో అత్యుత్సాహం ప్రదర్శించవద్దని సూచించారు. గిరిజనులకు సరైన అవగాహన కల్పించాలని.. ప్రజలపై దౌర్జన్యం చేస్తే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఐటీడీఏ కేంద్రంగా పాలన పటిష్టం చేస్తామని తెలిపారు. త్వరలో సీఎం రేవంత్ రెడ్డి జోడే ఘాట్ వస్తారని…ఈ ప్రాంతంలో టూరిజం అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. రూ. 6 కోట్లు టూరిజం అభివృద్ధికి ఇస్తామన్నారు. కొమురం భీం ప్రాజెక్టును టూరిజం పరంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. రోడ్లు, ఇండ్లు హాస్టల్ల అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని మరోసారి గుర్తు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల ఇస్తామని.. కలెక్టర్ నివేదిక తయారు చేయాలని మంత్రి సీతక్క ఆదేశించారు. అటవీ ప్రాంతంలో ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. కుల గణన జరుగుతుందని.. అధికారులకు మీ సమాచారం ఇవ్వాలని చెప్పారు. నాయక్ పోడు తెగలు మైదాన ప్రాంతంలో ఉన్నారని.. అధికారులు వాస్తవ నివేదిక తయారు చేయాలని సూచించారు.
READ MORE:Israel-Iran Conflict: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందే ఇరాన్పై ఇజ్రాయిల్ ప్రతీకార దాడి..?
సబ్ క్యాస్ట్ చెప్పు కోవాలని మంత్రి సీతక్క సూచించారు. ఆదివాసీ చట్టాలు తీసుకొచ్చిన చరిత్ర కాంగ్రెస్ పెద్దలదన్నారు. సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా ముందుకు వెళ్దామని కోరారు. జీ నంబర్ 3, ఆదివాసీ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం సీఎం రేవంత్ సమక్షంలో సమావేశం అయి చర్చిద్దామన్నారు.. ఆడవాళ్ళ జోలికి వస్తే ఎవ్వర్నీ వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు. ఇది ప్రజల ప్రభుత్వమని.. మీ సమస్యల పరిష్కారం చేసేందుకు మీ వెంటే ఉంటామన్నారు.
తాజావార్తలు
-
Jobs: పదో తరగతి అర్హత.. ఆ స్కూల్, కాలేజీల్లో నైట్ వాచ్ ఉమెన్, అసిస్టెంట్ కుక్ పోస్టులకు దరఖాస్తులు..
-
Off The Record : కరీంనగర్ లో కాంగ్రెస్ బలపడటం పెద్ద నేతలకే ఇష్టం లేదా? శత్రువుకు శత్రువు మిత్రుడన్నట్టు రాజకీయం?
-
Story Board : ఒంటరి పోరాటమా.. అంతర్గత వైఫల్యమా? విపక్షాల బలహీనతకు అసలు కారణం రాహులేనా?
-
GST: దేశ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డ్.. ఏప్రిల్లో భారీగా జీఎస్టీ వసూళ్లు..
-
Ragi Sweet Roti: బామ్మల కాలం నాటి ఆరోగ్య రహస్యం.. నిమిషాల్లో తయారయ్యే రాగి తీపి రొట్టెలు ఇలా సింపుల్గా చేసేయండి!
ట్రెండింగ్
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!
-
Happy Birthday Rohit Sharma: రికార్డుల రారాజు.. ‘హిట్ మ్యాన్’ రోహిత్ శర్మకు పుట్టినరోజు శుభాకంక్షలు.!