Seethakka: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
- మిషన్ భగీరథపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
- హాజరైన మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు
- మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలను మంత్రికి నివేదించిన అధికారులు
- ఇప్పటి వరకు ఎక్కడా తాగునీటి సమస్య లేదని తెలిపిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో మిషన్ భగీరథపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలను మంత్రికి అధికారులు నివేదించారు. ఇప్పటి వరకు ఎక్కడా తాగునీటి సమస్య లేదని అధికారులు తెలిపారు. ఏదేని గ్రామంలో సమస్యలు తలెత్తిన వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించి తాగునీటి సమస్యలు లేకుండా చూస్తున్నామని అధికారులు చెప్పారు.
Read Also: Crime News: ఈసీఐఎల్లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిపై కొడుకు కత్తితో దాడి
Also Read
- Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
- 115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
- Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
- IND vs SL: సచిన్, సెహ్వాగ్, ధోనీ, రోహిత్ వల్ల కూడా కాలేదు.. భారత్-శ్రీలంక టెస్టుల్లో అత్యధిక సిక్సర్లు బాదింది ఇతడే..
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వేసవిలో ఎలాంటి తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి.. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంప్ హౌస్ మోటర్లలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. ఈఎన్సీ నుంచి గ్రామ స్థాయి వరకు మిషన్ భగీరథ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రోజు తాగు నీటి సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టి నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఎక్కడైన సాంకేతిక సమస్యలు తలెత్తినా తక్షణం పరిష్కరించాలని మంత్రి అధికారులకు తెలిపారు. సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలున్నందున, ఈ వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైతే జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఫండ్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Ishan Kishan: మైదానంలో సిక్సర్ల కింగ్.. బ్యాంకులో సర్కారీ నౌకరీ.. బిజీ క్రికెట్ లైఫ్లోనూ ఉద్యోగ బాధ్యతలు
-
Pune Baby Fevikwik: 9నెలల చిన్నారి నోట్లో ఫెవిక్విక్ పోశారు.. ఇంతకంటే దారుణం ఉంటుందా..!
-
Moto G Max: మోటో జీ మ్యాక్స్ భారత్లో త్వరలో లాంచ్.. 50MP Sony కెమెరా, Snapdragon చిప్
-
Jana Nayagan : బాక్సాఫీస్ డిజాస్టర్గా విజయ్ ‘జన నాయగన్’.. డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
ట్రెండింగ్
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!
-
కేవలం 50 మాత్రమే.. లగ్జరీతో పాటు ఫ్యాషన్ టచ్..! MG Cyberster, M9 Couture Edition కార్లు లాంచ్.!
-
Ajit Agarkar-BCCI: అజిత్ అగార్కర్ పదవికి ఎసరు?.. రోహిత్ శర్మనే కారణం!
-
Rohit Sharma-BCCI: నేను స్వచ్ఛందంగా తప్పుకోను.. ఇక బీసీసీఐ సెలెక్టర్ల ఇష్టం!