Seethakka: వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలి.. అధికారులకు మంత్రి ఆదేశం
- మిషన్ భగీరథపై అధికారులతో మంత్రి సీతక్క సమీక్ష
- హాజరైన మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు
- మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలను మంత్రికి నివేదించిన అధికారులు
- ఇప్పటి వరకు ఎక్కడా తాగునీటి సమస్య లేదని తెలిపిన అధికారులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సచివాలయంలో మిషన్ భగీరథపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ తాగునీటి సరఫరా శాఖ మంత్రి సీతక్క సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ఇతర అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ నీటి సరఫరా వివరాలను మంత్రికి అధికారులు నివేదించారు. ఇప్పటి వరకు ఎక్కడా తాగునీటి సమస్య లేదని అధికారులు తెలిపారు. ఏదేని గ్రామంలో సమస్యలు తలెత్తిన వెంటనే సమస్యను పరిష్కరిస్తున్నామని అధికారులు పేర్కొన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు జిల్లా అధికారులతో సమీక్షలు నిర్వహించి తాగునీటి సమస్యలు లేకుండా చూస్తున్నామని అధికారులు చెప్పారు.
Read Also: Crime News: ఈసీఐఎల్లో దారుణం.. నడి రోడ్డుపై తండ్రిపై కొడుకు కత్తితో దాడి
Also Read
- PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
- Supreme Court: 20 మంది రెబల్ తృణమూల్ ఎంపీలకు సుప్రీం నోటీసులు..
- Rajnath Singh: భారత్కు ఇక క్షిపణుల కొరత ఉండదు.. కేంద్రం సంచలన నిర్ణయం..
- Tarun Tejpal: అత్యాచారం కేసులో సుప్రీంకోర్టు షాక్.. 2 వారాల్లో లొంగిపోవాలని తేజ్పాల్కు ఆదేశం
ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. వేసవిలో ఎలాంటి తాగునీటి సమస్యలు ఉత్పన్నం కాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రిజర్వాయర్లలో నీటి నిల్వలను ఎప్పటికప్పుడు చెక్ చేయాలి.. విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకుని విద్యుత్ సరఫరాలో సమస్యలు తలెత్తకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పంప్ హౌస్ మోటర్లలో సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. ఈఎన్సీ నుంచి గ్రామ స్థాయి వరకు మిషన్ భగీరథ సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి రోజు తాగు నీటి సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్ష చేపట్టి నివేదిక సమర్పించాలని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
ఎక్కడైన సాంకేతిక సమస్యలు తలెత్తినా తక్షణం పరిష్కరించాలని మంత్రి అధికారులకు తెలిపారు. సమస్యలు తలెత్తితే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరారు. రిజర్వాయర్లలో తగినంత నీటి నిల్వలున్నందున, ఈ వేసవిలో తాగునీటి సమస్యలు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. తాగునీటి అవసరాలు తీర్చేందుకు అవసరమైతే జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక ఫండ్ కేటాయించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి సీతక్క పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Nara Lokesh: రెన్యూవబుల్ ఎనర్జీలో ఏపీకి నంబర్-1 టార్గెట్.. నారా లోకేష్ కీలక ప్రకటన!
-
PM Modi: ప్రధాని మోడీ పేరుతో సూరత్లో చేపల మార్కెట్.. గుజరాత్లో కొత్త వివాదం
-
Bandi Sanjay : ఫీజు బకాయిలపై బండి సంజయ్ ఫైర్.. కాంగ్రెస్కు డెడ్లైన్.!
-
Endurance Ship: 100ఏళ్ల రహస్యం..ఓడ మిస్టరీ వీడింది!
-
Kotha Cinema: హైదరాబాద్లోనే సినిమాలెందుకు తీయాలంటూ 100 మందితో సింగరేణి కుర్రాడు “కొత్త సినిమా”!**
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!