Minister Seethakka : హత్యాచార బాధిత బాలిక కుటుంబానికి రూ.50 వేలు అందించిన మంత్రి సీతక్క
మహబూబాబాద్ జిల్లాకు చెందిన ఓ బాలిక ఇటీవల మియాపూర్ లో హత్యాచారానికి గురికావడం తెలిసిందే. లక్ష్మ తండాకు చెందిన నరేశ్, శారద దంపతులు మూడు వారాల కిందట కూలి పనుల కోసం హైదరాబాద్ లోని మియాపూర్ వచ్చారు. వారి కుమార్తె (12) ఇంటి నుంచి కిరాణా దుకాణానికి వెళ్లి తిరిగి రాలేదు. అయితే అదే వీధిలో ఓ చెత్త కుప్పలో ఆ బాలిక విగత జీవురాలిగా కనిపించింది. బాలికను అత్యాచారం చేసి చంపి ఉంటారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో, మంత్రి సీతక్క మహబూబాబాద్ జిల్లాలో నేడు అత్యాచార బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు.
బాలిక తల్లిదండ్రులకు రూ.50 వేల సాయం అందించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రనాయక్, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్తో కలిసి కుటుంబ సభ్యులను ఓదార్చి సానుభూతి తెలిపారు. బాలిక కేసులో పోలీసులు జాప్యం చేస్తున్నారంటూ కుటుంబ సభ్యులు ఆమె దృష్టికి తీసుకెళ్లగా, ఆమె మియాపూర్ పోలీసులతో మాట్లాడారు. అనంతరం బాధిత కుటుంబానికి రూ.50వేల ఆర్థిక సహాయం అందజేశారు. బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Off The Record : హైలెవల్ బ్రిడ్జిపై కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం
-
OTR: సీఎం ప్రెస్ మీట్ లో NDSA ఛైర్మన్ ఉండటంపై బీజేపీ అభ్యంతరం
-
BJP: ఉగ్రవాదుల్ని ‘‘గారు’’ అని పిలిచిన చరిత్ర కాంగ్రెస్ది…
-
YS Jagan: “మీరు భయపడుతున్నారు”.. సీఎం చంద్రబాబుపై జగన్ సంచలన వ్యాఖ్యలు..
-
Chairman’s Desk : మహిళా బిల్లుకు డీలిమిటేషన్ ఉచ్చు.! అసలు వ్యూహం ఏంటి?
ట్రెండింగ్
-
90’s Sweet : చిన్ననాటి ఈ ‘డ్రై రసగుల్లా’ గుర్తుందా.. ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు..!
-
Minapa Barfi Recipe : శక్తికి గని ‘మినప బర్ఫీ’.. అందరికీ బలవర్ధకమైన స్వీట్.!
-
Protein Rich Ulavala Dosa : బరువు తగ్గడానికి హెల్దీ బ్రేక్ఫాస్ట్.. ప్రోటీన్ రిచ్ ‘ఉలవల దోశ’.. ఇలా ట్రై చేయండి.!
-
రూ.11 వేలలోపే పవర్ఫుల్ ఫీచర్స్ తో REDMI A7, A7 Pro లాంచ్..!
-
AMOLED డిస్ప్లే, 10 రోజుల బ్యాటరీతో హువావే HUAWEI WATCH FIT 5 సిరీస్ లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!