Murali Naik: మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఆర్థిక సహాయాన్ని అందించిన మంత్రి సవిత!
- భారత్-పాకిస్తాన్ యుద్ధంలో మురళీ నాయక్ వీర మరణం
- మురళీ తల్లిదండ్రులకి ఆర్థిక సహాయాన్ని అందించిన మంత్రి సవిత
- ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మంత్రి సవిత అందించారు. మురళీ తల్లిదండ్రులకు రూ.50 లక్షల రూపాయల చెక్కు ప్రభుత్వం తరఫున అందజేశారు. అంతకుముందు మురళీ నాయక్ చిత్రపటానికి మంత్రి సవిత నివాళి అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మురళీ నాయక్ తల్లిదండ్రులకి చెక్కును అందించిన అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.50 లక్షల చెక్, 5 ఎకరాల పొలం, 6 సెంట్ల స్థలం మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశాం. వీర జవాన్ మురళీ నాయక్ సమాధిని 14 లక్షలతో నిర్మించాం. మురళీ ఊరి పేరు కూడా మురళీ నాయక్ తండాగా మార్చే ప్రక్రియ చేపట్టాం. విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం. వీర జవాన్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని మంత్రి సవిత హామీ ఇచ్చారు.
Also Read
మే 8న రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో జమ్మూకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాలో జవాన్కు అధికార లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు రూ.50 లక్షల చెక్, 5 ఎకరాల పొలం, 6 సెంట్ల స్థలంను మురళీ తల్లిదండ్రులకు అందజేశారు.
తాజావార్తలు
-
Tragedy: భార్య మోసంతో భర్త ఆత్మహత్య కేసులో ట్విస్ట్..!
-
Kamal Haasan: పొదుపు మంత్రంపై కమల్హాసన్ కీలక వ్యాఖ్యలు
-
1991 India Gold Crisis: రాత్రికి రాత్రి బ్రిటన్కు 47,000 కిలోల బంగారం తరలింపు.. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే!
-
Nampally Railway Station: నాంపల్లి రైల్వే స్టేషన్లో అగ్ని ప్రమాదం.. ఏసీ కోచ్లో మంటలు..
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!