Murali Naik: మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఆర్థిక సహాయాన్ని అందించిన మంత్రి సవిత!
- భారత్-పాకిస్తాన్ యుద్ధంలో మురళీ నాయక్ వీర మరణం
- మురళీ తల్లిదండ్రులకి ఆర్థిక సహాయాన్ని అందించిన మంత్రి సవిత
- ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారత్-పాకిస్తాన్ యుద్ధంలో వీర మరణం పొందిన తెలుగు జవాన్ మురళీ నాయక్ తల్లిదండ్రులకి ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ఆర్థిక సహాయాన్ని మంత్రి సవిత అందించారు. మురళీ తల్లిదండ్రులకు రూ.50 లక్షల రూపాయల చెక్కు ప్రభుత్వం తరఫున అందజేశారు. అంతకుముందు మురళీ నాయక్ చిత్రపటానికి మంత్రి సవిత నివాళి అర్పించారు. మురళీ నాయక్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
మురళీ నాయక్ తల్లిదండ్రులకి చెక్కును అందించిన అనంతరం మంత్రి సవిత మీడియాతో మాట్లాడారు. ‘ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రూ.50 లక్షల చెక్, 5 ఎకరాల పొలం, 6 సెంట్ల స్థలం మురళీ నాయక్ తల్లిదండ్రులకు అందజేశాం. వీర జవాన్ మురళీ నాయక్ సమాధిని 14 లక్షలతో నిర్మించాం. మురళీ ఊరి పేరు కూడా మురళీ నాయక్ తండాగా మార్చే ప్రక్రియ చేపట్టాం. విగ్రహం కూడా ఏర్పాటు చేస్తాం. వీర జవాన్ తల్లిదండ్రులకు ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుంది’ అని మంత్రి సవిత హామీ ఇచ్చారు.
Also Read
- RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
- CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
- MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
- Delimitation Bill: మళ్లీ తెరపైకి డీలిమిటేషన్ బిల్లు.. 2029 ఎన్నికలే లక్ష్యంగా కేంద్రం కసరత్తు?
మే 8న రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో జమ్మూకశ్మీర్లో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారు. సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండా పంచాయతీ కల్లితండాలో జవాన్కు అధికార లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. మురళీ నాయక్ కుటుంబానికి అండగా ఉంటామని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం నేడు రూ.50 లక్షల చెక్, 5 ఎకరాల పొలం, 6 సెంట్ల స్థలంను మురళీ తల్లిదండ్రులకు అందజేశారు.
తాజావార్తలు
-
Hyderabad Metro : మెట్రో వ్యవస్థకు ఎలాంటి నష్టం లేదు.. స్పష్టం చేసిన HMRL
-
RCB Player: అభిమానులకు బిగ్షాక్.. రిటైర్మెంట్ ప్రకటించిన కీలక ప్లేయర్..
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
CM Chandrababu Vizag Tour: రేపు విశాఖకు సీఎం చంద్రబాబు..
-
MS Dhoni: ఇన్వెస్టర్లకు అదిరే న్యూస్.. ధోని మద్దతిస్తున్న కంపెనీ ఐపీఓకు రెడీ.. రూ.1500 కోట్లే లక్ష్యంగా..
ట్రెండింగ్
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!