Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
- నర్సుల సేవలు అనితర సాధ్యమైనవని
- నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది
- పవిత్రమైన వృత్తి నర్సింగ్ని ఎంచుకున్న అందరికీ అభినందనలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నర్సుల సేవలు అనితర సాధ్యమైనవని, నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసిందని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవ కలగలిపితేనే నర్సు అని.. పవిత్రమైన వృత్తి నర్సింగ్ని ఎంచుకున్న అందరికీ అభినందనలు అని పేర్కొన్నారు. ఏపీలో నర్సింగ్ కౌన్సిల్లో 1.20 వేల మంది రాష్ట్ర విభజన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీలు పూర్తవుతాయని, నర్సింగ్ కాలేజీలలో విదేశీ భాషలు నేర్పించేలా ఏర్పాటు చేస్తాం అని మంత్రి చెప్పారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించింది. ముఖ్య అతిథిగా మంత్రి సత్యకుమార్ పాల్గొని ఐదుగురు నర్సులకు రాష్ట్ర స్ధాయి నైటింగేల్ అవార్డులు అందజేశారు.
‘నర్సుల సేవలు అనితర సాధ్యమైనవి. నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది. ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి సందర్భంగా అంతర్జాతీయ నర్సుల దినోత్సవం జరుపుకుంటున్నాం. జీవితంలో వినోదం అవసరం కానీ.. వినోదమే జీవితం కాకూడదు. చిత్తశుద్ధి, అంకితభావం, కరుణ, సేవ కలగలిపితేనే నర్సు. పవిత్రమైన వృత్తి నర్సింగ్ని ఎంచుకున్న అందరికీ అభినందనలు. ఇప్పుడు ఇచ్చిన అవార్డులను కొనసాగిస్తాం. హక్కుల గురించి మాట్లాడుతున్నపుడు బాధ్యత మర్చిపోకూడదు. ప్రజలకు మేం జవాబుదారీ కాబట్టి బాధ్యతల నిర్వహణపై ప్రతీ ఒక్కరినీ ప్రశ్నిస్తాం. మానవతా దృక్పధంతో ఆలోచిస్తాం. నాకు బెదిరిస్తూ ఒక అధికారి కామెంట్ పెట్టాడు. అదే మరో ప్రభుత్వం అయితే ఆయన ఉద్యోగం పోయేది. మేం అలాంటి వారికి కౌన్సిలింగ్ ఇస్తాం’ అని వైద్యఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు.
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
Also Read: Chandrababu Naidu: గొప్ప విజయాలు అందుకోవాలంటూ.. ఎన్టీఆర్కి ఆల్ ది బెస్ట్ చెప్పిన సీఎం!
‘ఏపీలో నర్సింగ్ కౌన్సిల్లో 1.20 వేల మంది రాష్ట్ర విభజన తరువాత రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. గత ప్రభుత్వం చెప్పిన జీరో వేకెన్సీ పాలసీలో డొల్లతన మేం బయటపెట్టాం. రాబోయే రోజుల్లో నర్సింగ్ స్టాఫ్ వేకెన్సీలు పూర్తవుతాయి. ప్రతీ సంవత్సరం 2600 మంది బయట దేశాల్లో రిజిష్టర్ చేసుకుంటున్నారు. నర్సింగ్ కాలేజీలలో విదేశీ భాషలు నేర్పించేలా ఏర్పాటు చేస్తాం. సరైన అర్హత లేని నర్సులు ఎక్కడా ఉండకూడదు. రాబోయే 6 నెలల్లో ఆన్లైన్లో ఇంటివద్ద నుంచే నర్సింగ్ రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నాం. సరిహద్దుల్లో సైన్యం ఎలా ప్రాణాలు కాపాడుతుందో, అదేవిధంగా నర్సింగ్ స్టాఫ్ కూడా పని చేస్తున్నారు. వైద్య రంగంలో పని చేసే వారు కూడా మనుషులే అని గుర్తించాలి. ప్రభుత్వ ఆసుపత్రుల సేవలపై సంతృప్తి సూచీ 75 శాతానికి వచ్చింది. రోగులను నవ్వుతూ ఆహ్వానించి, వైద్యం అందించి, నవ్వుతూ పంపించండి’ అని మంత్రి సత్యకుమార్ యాదవ్ కోరారు.
తాజావార్తలు
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
-
Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై “సింగం” ఫార్ములా బ్లాక్బస్టర్!!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!