Minister Roja: ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు.. పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా సెటైర్లు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మంత్రి రోజా సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్కు వెళ్లిందన్నారు. నారా చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేయడంతోనే పవన్ అధహ పాతాళానికి వెళ్ళిపోయాడన్నారు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్.. సీఎం వైఎస్ జగన్ గురించి మాట్లాడుతాడా? అని మండిపడ్డారు. జనసేన పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి.. చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం ఏంటి? అని మంత్రి రోజా ప్రశ్నించారు.
విశాఖలో మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ… ‘ఊగిపోయి గట్టిగా మాట్లాడితే ఓట్లు రావు.. అదే సాధ్యం అయితే అర్ నారాయణ మూర్తి ఎప్పుడో ప్రధాని అయ్యేవాడు. పవన్ తన తప్పులు కేడర్ మీద రుద్దడం సిగ్గు చేటు. చంద్రబాబు నాయుడు దగ్గర ఊడిగం చేయడంతోనే అతడు అధహ పాతాళానికి వెళ్ళిపోయాడు. ముష్టి 30 సీట్లు కూడా తెచ్చుకోలేని నువ్వా.. సీఎం జగన్ గురించి మాట్లాడేది?. బూత్ కమిటీలు, మండల కమిటీలు వేయాల్సిన బాధ్యత పార్టీ అధ్యక్షుడిది. పార్టీ నిర్మాణాన్ని గాలికొదిలి చంద్రబాబు చుట్టూ తిరుగుతూ ఇప్పుడు పార్టీ కేడర్ ను తప్పు పట్టడం ఏంటి?. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించలేదు’ అని అన్నారు.
Also Read
- Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
- Pakistan Whitewash: తేలిపోయిన పాకిస్థాన్ బ్యాటర్స్.. బంగ్లాదేశ్ చేతిలో క్లీన్ స్వీప్..!
- CM Vijay Anti Corruption Drive: అవినీతి ప్రక్షాళనకు సీఎం విజయ్ కీలక నిర్ణయం.. లంచంపై ఫిర్యాదుకు రూ.1 లక్ష బహుమతి..
- 55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
Also Read: Kurnool MLA Candidate: వైసీపీలోకి సీనియర్ ఐఏఎస్ అధికారి.. కర్నూలు నుంచి ఎమ్మెల్యేగా పోటీ!
‘పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోవడం సిగ్గు చేటు కాదా?. రుషికొండలో వరల్డ్ క్లాస్ టూరిజం భవనాలను నిర్మించాం. అందులో సీఎం క్యాంప్ కార్యాలయం ఉంటే బాగుంటుందని త్రీ మెన్ కమిటీ సూచించింది. ముఖ్యమంత్రి అంగీకరిస్తే అది క్యాంప్ కార్యాలయం అవుతుంది, లేదంటే టూరిజం భవనాలుగా ఉంటాయి. బండ్ల గణేష్ ఎవరు?. సెవెన్ ఓ క్లాక్ బ్లేడుతో గొంతు కోసుకుంటాను అన్నాడు అతనేనా. ఒక మహిళ ఎదుగుతుంటే నీచంగా మాట్లాడటం, వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం జనసేన, టీడీపీలకు అలవాటుగా మారింది. అందుకే మహిళలు వాళ్ళను అసహ్యించుకుంటున్నారు’ అని మంత్రి రోజా పేర్కొన్నారు.
తాజావార్తలు
-
NTR: ఎన్టీఆర్ ఇంట్లోకి కొత్త అతిథులు.. జపాన్ పేర్లు ఎందుకు పెట్టారో తెలుసా?
-
Chris Gayle: అబ్బబ్బా ఏం ఆడుతున్నాడు, వైభవ్కు అభిమానిగా మారిపోతున్నా.. యూనివర్స్ బాస్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Karnataka: కాంగ్రెస్ అధిష్టానానికి కొత్త తలనొప్పి.. కేరళ కథ సుఖాంతం.. కర్ణాటకలో మొదలైన అసలు సినిమా!
-
He-Man: హాలీవుడ్ సూపర్ హీరోకి టాలీవుడ్ టచ్.. ‘హీ-మ్యాన్’లో నిఖిల్ పవర్ఫుల్ ఎంట్రీ!
-
Jasprit Bumrah: ఆఫ్ఘనిస్థాన్ సిరీస్కు దూరం.. బుమ్రా రీఎంట్రీపై బీసీసీఐ కీలక అప్డేట్?
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!