Minister RK Roja: 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు.. నాన్లోకల్ పొలిటిషన్స్ను ఎవరూ పట్టించుకోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister RK Roja: 2024 ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్ గెలుపును ఎవరూ ఆపలేరు అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా.. విజయవాడలోని బాపు మ్యూజియంలో పురావస్తు శాఖ ఆధ్వర్యంలో లేజర్, సౌండ్ లైట్ షోను ఎంపీ కేశినేని నాని, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి ప్రారంభించిన ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షర్మిల రాష్ట్ర రాజకీయాల్లోకి సంక్రాంతికి వచ్చే డూడూ బసవన్నల మాదిరి వచ్చారు అని సెటైర్లు వేశారు. స్ధానికత లేని పార్టీలను ప్రజలు నమ్మరు. పక్క రాష్ట్రంలో పార్టీ తీసేసి, ఇక్కడికొచ్చి మాట్లాడితారు.. జగనన్నకు ఇక్కడ అడ్రస్, గుర్తింపు, ఓటు అన్నీ ఉన్నాయి.. వైఎస్సార్ అభిమానులంతా సీఎం వైఎస్ జగన్ వెంటే ఉన్నారు.. ఉంటారు అని ధీమా వ్యక్తం చేశారు.
Read Also: Top Headlines @ 9 PM : టాప్ న్యూస్
Also Read
- Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
- T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
- Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
- Indian Railway: ఇండియన్ రైల్వేలో సరికొత్త విప్లవం.. టెక్నాలజీ వాడకంలో భారత్ నెక్స్ట్ లెవెల్..
ఇక, షర్మిల లాంటివారిని రాష్ట్ర ప్రజలు ఆదరించరు.. తెలంగాణ ప్రజలు ఛీ కొడితే ఏపీలోకి షర్మిల వచ్చారు అని ఎద్దేవా చేశారు రోజా.. సామాజిక న్యాయానికి సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారు.. జగన్ పాలనపై రాష్ట్ర ప్రజలంతా సంతృప్తిగా ఉన్నారు.. గతంలో ఎప్పుడూ లేని అభివృద్ధి రాష్ట్రంలో కనిపిస్తుంది.. విజయవాడ నగరంలో అంబేద్కర్ భారీ విగ్రహం, బాపూ మ్యూజియం, భవాని ఐలాండ్ వంటి పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేశామని వెల్లడించారు. 2024 ఎన్నికల్లో జగన్ గెలుపు ఎవరూ ఆపలేరు.. నాన్ లోకల్ పొలిటిషియన్స్ ఇక్కడ ఉండరు.. పట్టించుకోరు.. రాజన్న బిడ్డగా ప్రజలకు రాజన్న రాజ్యం అందించడానికి జగన్ కాంప్రమైజ్ కాలేదన్నారు. ఏపీలో ఓటు అడిగే నైతిక అర్హత కాంగ్రెస్ కి లేదన్నారు.. రాష్ట్రాన్ని విడగొట్టి, వైఎస్ఆర్ పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని మండిపడ్డారు. ప్రత్యేక హోదా ప్రకటించకుండా ఒక రూమ్లో కూర్చొని రాష్ట్రాన్ని విడగొట్టారు.. కాంగ్రెస్ తరఫున ఎవరొచ్చిన పిచ్చోళ్లవుతారు.. వాగే నోర్లకి 2024 సమాధానం చెబుతుందని ధీమా వ్యక్తం చేశారు మంత్రి ఆర్కే రోజా..
తాజావార్తలు
-
Story Board : నాలుగోసారి గెలవడానికి.. మోడీ దగ్గరున్న త్రిశూల వ్యూహాలేంటి..?
-
Reality Check: పేదరికం VS బాలికల హక్కులు.. బాల్య వివాహాల వెనుక దాగి ఉన్న చేదు నిజాలు..
-
T20 World Cup: ఆమె భర్త కోసం ప్రాక్టీస్ ఎగ్గొట్టింది.. చివరకు డ్రెస్సింగ్ రూమ్లో పరువు పోయింది..
-
Golconda Hostel Incident : గోల్కొండ హాస్టల్లో షాక్.. బాత్రూంలో ప్రసవం, శిశువు మృతి!
-
Off The Record: ఉదయగిరి టీడీపీలో అంతర్గత విభేదాలు? ఆయనపై అసంతృప్తి పెరుగుతోందా?
ట్రెండింగ్
-
Door Cleaning Tips : దుమ్ము పట్టిన తలుపులు మెరవాలా.? కిచెన్లోనే ఉంది సూపర్ సొల్యూషన్.!
-
Kitchen Tips : చెక్క, ప్లాస్టిక్, స్టీల్.. వంటగదికి ఏ చాపింగ్ బోర్డు ఆరోగ్యకరమో తెలుసా..?
-
సూపర్కార్ డిజైన్, ఫ్లాగ్షిప్ ఫీచర్లు.. Infinix NOTE 60 Pro Pininfarina Limited Edition లాంచ్.!
-
6.39mm స్లిమ్ డిజైన్, 144Hz AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీతో TECNO CAMON Slim లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ తోపు అంతే.. ఐపీఎల్ 2026లో రూ.34 కోట్ల పెర్ఫార్మెన్స్!