Minister Ram Prasad Reddy: మంగంపేట భూనిర్వాసితులకు ఇళ్లపట్టాలను పంపిణీ చేసిన మంత్రి
Minister Ram Prasad Reddy: అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలం మంగంపేట భూ నిర్వాసితులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండి పల్లి రాంప్రసాద్ రెడ్డి ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. అన్నమయ్య, పించా డ్యాములు తెగిపోయి ప్రాణాలు కోల్పోయిన వారిని కానీ నష్ట పోయిన వారిని కానీ జగన్ ఒక్కరినైనా ఆదుకున్నారా అని మంత్రి ప్రశ్నించారు. ఇప్పుడు విజయవాడలో వరద బాధితులకు జరుగుతున్న సహాయకచర్యలపై అవాకులు చవాకులు మాట్లాడడం సబబు కాదన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎన్నో అన్యాయాలు జరిగాయని ఆయన విమర్శించారు.
మంగంపేట గ్రామస్తుల నుండి వారి తాత ముత్తాతలు ఇచ్చిన భూములు తీసుకొని స్థానికులను పక్కన పెట్టేశారని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే ఎంపీ చెప్పారని నార్త్ఇండియాలోని వారిని ఇక్కడ తెచ్చి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. రాబోయే ఐదు ఏళ్లలో మంగంపేటకు మహర్దశ పడుతుందన్నారు. ప్రతిఒక్క నిర్వాసితుడిని తప్పకుండా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు.
Also Read
తాజావార్తలు
-
Robbery: బిగ్ షాక్.. శ్రీ చైతన్య కాలేజీలో దొంగతనం..
-
Angkrish Raghuvanshi: కోపం ఖరీదు.. 20% మ్యాచ్ ఫీజు జరిమానా.!
-
Padma Awards 2027: దేశ అత్యున్నత పౌర పురస్కారాలు.. నేడే నామినేట్ చేసుకోండి.. పూర్తి వివరాలివే!
-
Ola Electric Share: ఒక్కప్పుడు రారాజు.. ఇప్పుడు బికారి! ఓలా ఎలక్ట్రిక్ రూ.157 నుంచి రూ.20 కి?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!