Ponguleti Srinivasa Reddy: సమాచార శాఖపై మంత్రి పొంగులేటి సమీక్ష
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరువ చేయడంలో సమాచార శాఖ కీలక పాత్ర వహించాలని రాష్ట్ర సమాచార, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమాచార శాఖ పని తీరును సంబంధిత అధికారులతో సమీక్షీంచారు. ప్రభుత్వ పథకాల పట్ల ప్రజలను చైతన్య వంతులను చేయడంలో సాంప్రదాయ ప్రచార మాధ్యమాలతో పాటు సోషల్ మీడియా వింగ్ ను విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని అధికారులను ఆయన ఆదేశించారు. తెలంగాణ మాస పత్రికను మరింత ప్రామాణికమైన పత్రికగా తీర్చి దిద్దడంతో పాటు ఈ పత్రికను రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, ప్రజా ప్రతినిధులకు, సామాన్య ప్రజానీకానికి అందుబాటులో తీసుకు రావాలని చెప్పారు.
Read Also: Jeevan Reddy: తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ పని ఖతం అయింది..!
Also Read
- Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
- Tilak Varma: "నమ్మకమే నా బలం.." అలా ఆడడం అంటే ఎంతో ఇష్టం..!
- Mumbai Indians Win: తిలక్ వర్మ తుఫాన్ ఇన్నింగ్స్ దెబ్బ.. పంజాబ్ అబ్బా..
- Arshdeep Singh: వివాదంలో చిక్కుకున్న అర్ష్దీప్ సింగ్.. తిలక్ వర్మ చర్మ రంగుపై అసభ్యకర వ్యాఖ్యలు..
ఈ సందర్బంగా సమాచార శాఖలో వివిధ విభాగాల పని తీరును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమీక్షించారు. ప్రింట్ మీడియా, ప్రింట్ మీడియా, అవుట్ డోర్ విభాగం చేపట్టిన కార్యక్రమాలపై ఆయన మీటింగ్ నిర్వహించారు. జర్నలిస్టుల సంక్షేమం, క్షేత్ర స్థాయిలో ప్రచార నిర్వహణపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. సమాచార శాఖ పని తీరును మెరుగు పర్చాలని అధికారులను ఆదేశించారు. సమాచార శాఖతో పాటు మీడియా అకాడమీ చేపట్టిన కార్యక్రమాలపై సమాచార కమీషనర్ అశోక్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. ఈ సమీక్షా సమావేశంలో సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ రాజమౌళి, అడిషనల్ డైరెక్టర్ నాగయ్య, జాయింట్ డైరెక్టర్లు జగన్, శ్రీనివాస్, వెంకటరమణ, డిప్యూటీ డైరెక్టర్లు మధు సూధన్, హాష్మి, రాజా రెడ్డి, సురేష్ , చీఫ్ ఇన్ఫర్మేషన్ ఇంజనీర్ రాధా కిషన్, ప్రాంతీయ సమాచార ఇంజనీర్ జయరామ్ మూర్తి, రాములు, అకౌంట్స్ ఆఫీసర్ పద్మ కుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Tabu: హీరోయిన్ల ఏజ్ షేమింగ్పై టబు ఓపెన్ కామెంట్స్ వైరల్!
-
Indian Railways logo: ఇండియన్ రైల్వేస్ లోగోలో భారీ మార్పు.. ఇకపై 18 నక్షత్రాలు..ఈ మార్పుకు కారణం ఏమిటి?
-
Uttar Pradesh: యూపీలో ప్రకృతి ప్రకోపం.. పిడుగులు, వానాకాలం బీభత్సానికి 111 మంది బలి
-
Peddi: ‘పెద్ది’ రిలీజ్కు భారీ షాక్..
-
Delhi Work From Home: ప్రభుత్వం కీలక నిర్ణయం.. రెండు రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్.. పొదుపు చర్యల జాబితా విడుదల
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!