Peddireddy Ramachandra Reddy: చంద్రబాబు చర్చకు రావాలి.. కుప్పంలో అయినా రెడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Peddireddy Ramachandra Reddy: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు సవాల్ విసిరారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తిరుపతిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబుకు ఇప్పుడు రాయలసీమ గుర్తుకు వచ్చింది.. ఈ ప్రాంతంపై చంద్రబాబుకు మమకారం లేదని విమర్శించారు. సీమలో మూడు స్థానాలు మాత్రమే ఆయనకు దక్కింది. ఇందులో ఒకటి ఆయన (చంద్రబాబు)ది.. మరోటి ఆయన బామ్మర్ది (బాలకృష్ణ)ది అని.. ఇప్పుడు సీమకు అన్యాయం అంటున్నాడని మండిపడ్డారు. రాయలసీమలో పర్యటన కాకుండా చర్చ జరిపితే బాగుంటుంది.. చంద్రబాబు, వైఎస్సార్ హయాంలో సీమకు జరిగిన న్యాయంపై చర్చకు రావాలని చాలెంజ్ చేశారు.
Read Also: TSRTC: ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ.. పెరిగిన డే పాస్ ధరలు..
Also Read
- Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
- Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
- AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
- boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
కనీసం కుప్పంకు కూడా నీళ్లు ఇవ్వని వ్యక్తి చంద్రబాబు అని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి.. సొంత జిల్లా, సొంత నియోజకవర్గాన్ని పట్టించుకోని వ్యక్తి చంద్రబాబు.. త్వరలో కుప్పంకు హంద్రీ – నీవా జలాలు ఇవ్వనున్నామని పేర్కొన్నారు. సీమకు మేలు చేసే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11 వేల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారు. దీనిని సీఎం వైఎస్ జగన్.. 80 వేల క్యూసెక్కుల పెంచనున్నారని వెల్లడించారు. సీమలో ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి. ఇవన్నీ చంద్రబాబుకు కనపడదు అని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తన మనుషులతో కోర్టులో కేసులు వేసి కొన్ని ప్రాజెక్ట్ పనులు నిలిపే ఆలోచనలో ఉన్నాడని ఆరోపించారు. చంద్రబాబు ముందుగా చర్చకు రావాలి.. ఆ తర్వాత ప్రాజెక్టుల సందర్శనకు వెళ్లాలని సూచించారు. కుప్పంలో సైతం ఆయనతో చర్చకు సిద్ధమని ప్రకటించారు. చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటనను అడ్డుకోబోమని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలో ఆగిన మూడు ప్రాజెక్టులపై సుప్రీం కోర్టుకు వెళ్లామని తెలిపారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
తాజావార్తలు
-
Abdullah Shafique: 49 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెర.. విండీస్ గడ్డపై పాకిస్థాన్ ప్లేయర్ చారిత్రాత్మక రికార్డు..
-
SpaceX Rocket Moon Crash: గంటకు 8,690 కి.మీ వేగంతో.. చంద్రుడిని ఢీకొట్టనున్న SpaceX రాకెట్..!
-
Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
-
Aqua Farmers: ఆక్వా రైతులకు ఊరట.. రూ.1.50కే విద్యుత్ సరఫరా!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
ట్రెండింగ్
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!
-
VVS Laxman Chief Selector: అజిత్ అగార్కర్కు బిగ్ షాక్.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్గా వీవీఎస్ లక్ష్మణ్?
-
Yamaha R15, MT-15 MotoGP ఎడిషన్ బైక్స్ మళ్లీ వచ్చేశాయి.. కొత్త కలర్ ఆప్షన్లతో FZ-S సిరీస్ కూడా అప్డేట్..!