TSRTC: ప్రయాణికులకు షాకిచ్చిన ఆర్టీసీ.. పెరిగిన డే పాస్ ధరలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TSRTC: తెలంగాణ ప్రభుత్వం టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన మరుసటి రోజే.. ప్రయాణికులకు షాకిచ్చింది ఆర్టీసీ.. సిటీలో డే పాస్ ధరలు పెంచేసింది.. ఇప్పటి వరకు డే పాస్ ధర రూ.100గా ఉండగా.. ఇవాళ్టి నుంచి డే పాస్ ధర రూ.120కు పెంచింది టీఎస్ఆర్టీసీ.. ఆర్టీసీని తెలంగాణ ప్రభుత్వంలో విలీనం చేస్తామంటూ ప్రకటించిన మరుసటి రోజే డేపాస్ ధరలను పెంచేశారు.. ఇక, గతంలో మహిళలు, సీనియర్ సిటిజన్స్ కు 80 రూపాయలున్న డే పాస్ ఇప్పడు 100 రూపాయలకు పెరిగింది.. అయితే, రూ.80 , రూ. 100గా ఉన్నప్పుడు డే పాస్ కు ప్రజల నుంచి మంచి ఆదరణ ఉందని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నారు.. 120 రూపాయలు డే పాస్ సమయంలో రోజుకీ 25 వేలు మాత్రమే అమ్ముడు అవుతున్నాయని.. అదే 80 రూపాయల డే పాస్ సమయంలో రోజుకీ 40 వేల వరకు అమ్మకాలు జరిగాయని చెబుతున్నారు సంబంధిత అధికారులు.. మళ్లీ పెరిగిన టికెట్ ధరలతో బాదుడు మొదలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రయాణికులు.
Read Also: IND vs WI: భారత్తో టీ20 సిరీస్.. వెస్టిండీస్ జట్టు ప్రకటన! సిక్సర్ల వీరుడు ఆయేగా
Also Read
- Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
- PM Modi: భారతీయులకు గుడ్న్యూస్.. నెదర్లాండ్స్ నుంచి తిరిగొస్తున్న 11వ శతాబ్దపు చోళ రాగి ఫలకాలు
- PM Modi: నెదర్లాండ్స్ రాజు, రాణితో మోడీ భేటీ.. ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు
- Maharashtra: తుపాకీ గురిపెట్టినా భయపడలేదు.. దొంగలతో వీరోచితంగా పోరాడిన సిబ్బంది.. వీడియో వైరల్
గతంలో టీ-24 టికెట్ ధర సాధారణ ప్రయాణికులకు రూ.100 ఉండేది. పర్యాటకులు కూడా ఈ ధరలతో నగరం మొత్తం తిరిగారు. సీనియర్ సిటిజన్లకు రూ.80కే అందించారు.. ఆ తర్వాత పాత ధరలనే అమలు చేసి రూ.100కి పెంచారు. తాజాగా ఆ ధరలను మళ్లీ రూ. 120కి పెంచారు.. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి వచ్చాయి.. గ్రేటర్ పరిధిలో రోజుకు 20 వేల మంది ప్రయాణికులు టీ-24 టికెట్ను వినియోగిస్తున్నారని టీఎస్ ఆర్టీసీ అధికారులు తెలిపారు. నగరంలోని రెండు, మూడు ప్రాంతాలకు వెళ్లే వారు ఈ టికెట్ ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాగా, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థను ప్రభుత్వంలో విలీనం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు క్యాబినెట్ మీటింగ్ లో చర్చించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ మండలి కీలక నిర్ణయం తీసుకున్నది. టీఎస్ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేందుకుగాను అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేశామని మంత్రి కేటీఆర్ చెప్పుకొచ్చారు. 43, 373 మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలక నిర్ణం తీసుకుందని సోమవారం జరిగిన కేబినెట్ సమావేశం అనంతరం మంత్రి కేటీఆర్ వెల్లడించిన విషయం విదితమే.
తాజావార్తలు
-
Shubman Gill: “మేం గెలవడానికి అస్సలు అర్హులం కాదు”.. సొంత జట్టుపై కెప్టెన్ గిల్ తీవ్ర ఆగ్రహం..
-
Rajinikanth-Kamal Haasan: రజినీ – కమల్ మల్టీస్టారర్ నుంచి త్రిష ఔట్..?
-
Finn Allen: 10 సిక్సర్లు, 4 ఫోర్లు.. అభిషేక్, వైభవ్ల ప్రత్యేక బ్యాట్స్మెన్ల జాబితాలో ఫిన్ అలెన్..
-
Astrology: మే 17 శనివారం దినఫలాలు.. ఈ రాశివారు కాస్త జాగ్రత్త..
-
Off The Record : రాంగ్ సిగ్నల్స్ రాకుండా జై ఆంధ్ర లైన్ తీసుకున్నారా?
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..