Nara Lokesh: విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదు.. టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తాం!
- ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్
- విద్యావ్యవస్థలో టీచర్ల ప్రధాన పాత్ర పోషిస్తారు
- టీచర్ల సినియారిటీ జాబితా ప్రకటిస్తాం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదని, ఎలాంటి యాప్ల గొడవ ఉండదని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ‘వన్ క్లాస్-వన్ టీచర్’ ఉండేలా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టాలన్న లక్ష్యంతో ఉన్నామని చెప్పారు. మహిళల పట్ల గౌరవం పెరిగేలా విద్యావ్యవస్థలో సిలబస్ను రూపొందిస్తున్నామన్నారు. ఈ నెలలోనే 16,473 పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారి టీచర్ల సీనియారిటీ జాబితా ప్రకటిస్తామని, వారి బదిలీల కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.
ఈరోజు శాసనసభలో మంత్రి నారా లోకేశ్ మాట్లాడారు. ‘1994 నుంచి 2024 వరకు డీఎస్సీ ద్వారా 2 లక్షల 53 వేల మంది ఉపాధ్యాయులను భర్తీ చేస్తే.. అందులో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో లక్షా 80 వేల 22 పోస్టులు భర్తీ చేసింది. ఇది 71 శాతం, టీడీపీకి ఉన్న చిత్త శుద్ధి ఇది. రిజర్వేషన్ ప్రక్రియను నిర్ధారించడంలో ఈసారి డీఎస్సీ కాస్త ఆలస్యం అయింది. మార్చిలోనే 16,473 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తాం. విద్యా సంబంధిత అంశాలపై వైసీపీకి చెందిన సంఘంతో సహా అన్ని వర్గాలతో చర్చించాం. టీచర్ల సీనియారిటీ జాబితాను త్వరలోనే బహిర్గతం చేయబోతున్నాం. విద్యావ్యవస్థలో రాజకీయ జోక్యం ఉండబోదు, ఎలాంటి యాప్ల గొడవ ఉండదు. గత ప్రభుత్వం ఐబీ సిలబస్ను అమలు చేసే రిపోర్ట్ కోసం ఐదు కోట్లు ఖర్చు చేసింది. ఉపాధ్యాయులను కూడా సిద్ధం చేయకుండా.. CBSE సిలబస్లో పరీక్షలు నిర్వహించారు. ఫలితాలు ప్రతికూలంగా ఉన్నాయి. అందుకే మూడు ఏళ్లలో అందరినీ సిద్ధం చేసి CBSEను అమలు చేస్తాం’ అని మంత్రి తెలిపారు.
Also Read
- Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
- Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
- TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
- CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
వన్ క్లాస్-వన్ టీచర్ ఉండేలా ప్రతి పంచాయతీకి ఒక మోడల్ స్కూల్ పెట్టాలన్న లక్ష్యం తో ఉన్నాం. మహిళల పట్ల గౌరవం పెరిగేలా విద్యావ్యవస్థలో సిలబస్ను రూపొందిస్తున్నాం. విద్యా వ్యవస్థలో ఉపాధ్యాయులు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. విద్యార్థులకు బ్యాగ్ బరువు తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నాం. విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్ ఇస్తున్నాం. విద్యా రంగంలో సంస్కరణల కోసం అన్ని వర్గాలు కలిసి పని చేయాలి. అప్పుడే దేశానికే ఆదర్శంగా ఏపీ నిలుస్తుంది’ అని మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అదిరే శుభవార్త.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో జతకట్టనున్న వైభవ్..
-
Foreign Investors: విదేశీ పెట్టుబడిదారులకు శుభవార్త.. పన్ను నిబంధనల సడలింపునకు కేంద్రం గ్రీన్ సిగ్నల్!
-
TMC Crisis: మమతకు మరో షాక్.. బీజేపీలోకి 20 మంది టీఎంసీ ఎంపీలు..
-
Kala Chana Pulao Recipe: 4 స్టెప్స్లో కాలా చనా పులావ్.. టేస్ట్తో పాటు ప్రోటీన్ డబుల్.!
-
CM Chandrababu: మంత్రులను అలర్ట్ చేసిన సీఎం చంద్రబాబు.. అధికారులకు సీరియస్ క్లాస్..!
ట్రెండింగ్
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!
-
రూ.11,999కే Lava Bold N2 5G స్మార్ట్ఫోన్ లాంచ్.. 6000mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో పాటు.!
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!