Nara Lokesh: స్కూల్ డేస్లో నేను లాస్ట్ బెంచ్.. మాది అల్లరి బ్యాచ్!
- స్కూలులో పరీక్ష, అసెంబ్లీలో ప్రశ్నల్లో ఏది కష్టం?
- స్కూల్ డేస్లోనేను లాస్ట్ బెంచ్, అల్లరి బ్యాచ్
- చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా
- విద్యార్థుల సరదా ప్రశ్నలకు మంత్రి లోకేష్ సమాధానాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్కూల్ డేస్లో తనది లాస్ట్ బెంచ్ అని, తమది అల్లరి బ్యాచ్ అని మంత్రి నారా లోకేష్ చెప్పారు. స్కూల్లో పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని పేర్కొన్నారు. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారని చెప్పారు. తన తండ్రి, సీఎం నారా చంద్రబాబు గారి స్పూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చానని తెలిపారు. డేర్ టు డ్రీమ్, స్ట్రైవ్ టు అచీవ్ తనకు ఇష్టమైన కొటేషన్ అని మంత్రి నారా లోకేష్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివి పదో తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులతో మంత్రి భేటీ అయ్యారు.
‘షైనింగ్ స్టార్స్’ కార్యక్రమంలో పదోతరగతి ఉత్తమ విద్యార్థులకు సత్కార కార్యక్రమం సందర్భంగా మంత్రి నారా లోకేష్, విద్యార్థులకు మధ్య ఆసక్తికరమైన సంభాషణ జరిగింది. విద్యార్థులు అడిగిన పలు సరదా ప్రశ్నలకు మంత్రి ఉత్సాహంగా సమాధానాలిచ్చారు. మీకు స్కూలులో పరీక్షలు కష్టంగా ఉండేవా? లేదా అసెంబ్లీలో సభ్యులు అడిగే ప్రశ్నలు కష్టమా? అని చీరాలకు చెందిన సంతోష్ ప్రశ్నించాడు. అందుకు పరీక్షలు రాయడం, అసెంబ్లీలో సమాధానాలు చెప్పడం రెండూ కష్టమైనవే అని మంత్రి బదులిచ్చారు. ‘అసెంబ్లీ ప్రశ్నలను ఎదుర్కోవడం పూర్తిగా భిన్నమైనది. ప్రతిపక్షం సభలో లేకపోయినప్పటికీ.. అధికారపక్షం సభ్యులు ప్రతిపక్షం కంటే కష్టమైన ప్రశ్నలు అడుగుతున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిరోజూ నాకు మూడు ప్రశ్నలు వచ్చాయి. వాటికి సమాధానం చెప్పేందుకు ఎంతో ప్రిపేర్ కావాల్సి వచ్చింది. స్కూల్ డేస్లో నేను లాస్ట్ బెంచి, మాది అల్లరి బ్యాచ్’ అని లోకేష్ సరదాగా సమాధానమిచ్చారు.
Also Read
- Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
- JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
- Rajahmundry Tragedy: రాజమండ్రి రైల్ బ్రిడ్జిపై విషాదం.. గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్!
- Allu Arjun: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కు కోర్టు బిగ్ షాక్..
Also Read: Borugadda Anil: బోరుగడ్డ అనిల్కు 14 రోజుల రిమాండ్!
‘ఏపీలో విద్యా సంస్కరణలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈనాటి షైనింగ్ స్టార్లే ఏపీ విద్యా వ్యవస్థకు బ్రాండ్ అంబాసిడర్లు. ప్రైవేటు స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. వచ్చే ఏడాది నుంచి ప్రభుత్వ స్కూళ్ల ఉత్తమ విద్యార్థులతో యాడ్స్ చేస్తాం. కష్టపడి పనిచేయడంలో సీఎం చంద్రబాబుని స్ఫూర్తిగా తీసుకోవాలి. మంచి మార్కులు సాధించి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా తల్లిదండ్రులు తలెత్తుకొని తిరిగేలా చేశారు. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా.. లక్ష్య సాధన కోసం కసి, పట్టుదలతో ముందుకు సాగాలి. సవాళ్లు ఉన్నప్పటికీ విద్యాశాఖలో సంస్కరణలు చేపడుతున్నాం’ అని విద్యార్థులతో మంత్రి నారా లోకేష్ అన్నారు.
తాజావార్తలు
-
Indore: నీట్ పరీక్షకు మందు మరొక విద్యార్థిని బలి.. బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య
-
Jio IPO: వేల కోట్లు కొల్లగొట్టడానికి రెడీ అయిన జియో.. ఐపీఓపై అఫీషియల్ అనౌన్స్మెంట్ చేసిన ముఖేష్ అంబానీ!
-
The Paradise: ఈరోజు సాయంత్రం ఏదో గట్టిగానే ప్లాన్ చేశారు! నాని ‘ప్యారడైజ్’ న్యూ పోస్టర్ చూశారా?
-
JD Vance: మరోసారి భార్య ఉషా గురించి జేడీ వాన్స్ కీలక వ్యాఖ్యలు.. వైరల్
-
Nagadurga: సుకుమార్ – బన్నీ వాస్ బ్యానర్లలో క్రేజీ ప్రాజెక్ట్.. ప్రియదర్శి జోడీగా రంగంలోకి దిగిన ఫోక్ స్టార్!
ట్రెండింగ్
-
Virat Kohli Retirement: విరాట్ కోహ్లీ రిటైర్మెంట్పై టెన్షన్ అక్కర్లేదు.. మరో నాలుగేళ్లు ఆడుతాడు!
-
Rs 20 Note Viral: స్వామీ మా అత్త త్వరగా చనిపోయేలా చూడు.. దేవుడికి 20 రూపాయల నోటుపై వినతి!
-
T20 World Cup 2026: జోష్ మీదున్న భారత్కు భారీ షాక్.. ప్రపంచ కప్కు మ్యాచ్ విన్నర్ దూరం!
-
Sreesanth: టీమిండియాకు గౌతమ్ గంభీర్ అవసరమా?.. శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
-
144Hz రిఫ్రెష్ రేట్తో Hisense E8S ULED Mini-LED టీవీలు భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?