PM Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ప్రధాని మోడీ.. రోడ్ షో, బహిరంగ సభపై ప్రభుత్వం ఫోకస్!
- విశాఖ పర్యటనకు ప్రధాని మోడీ
- ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న లోకేష్
- రోడ్ షో, బహిరంగ సభపై ప్రభుత్వం ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండుకు చేరుకుంటారు. దత్త ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించే విధంగా షెడ్యుల్ ఫిక్స్ అయింది. 60 వేల మందికి పైగా ప్రధాని రోడ్ షో పాల్గొనే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు కిలోమీటరున్నర దూరం ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని రోడ్ షో చేస్తారు. పీఎం వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు.
కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి విశాఖకు వస్తున్నారు. ఉత్తరాంధ్ర చిరకాల కోరిక దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణం, పుడిమడకలో NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టుల్లో వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ రోడ్ షో, బహిరంగ సభ వేదిక, జనసమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
Also Read
- Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
- PM Modi: UPI తదుపరి స్థాయికి సిద్ధం.. ప్రపంచమంతా విస్తరించాలన్న మోడీ
- Sheikh Hasina Extradition: హసీనాను భారత్ నుంచి పట్టుకొచ్చి ఉరితీస్తాం.. బంగ్లాదేశ్ కఠిన వైఖరి!
- Whether Update: ఏపీకి భారీ వర్ష సూచన.. ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ప్రధాన వేదిక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సభకు విశాఖ, అనకాపల్లి, ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల నుంచి దాదాపు 2 లక్షల మంది వస్తారని అంచనా. ఆ మేరకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. అటు, పుడిమడక, నక్కపల్లి దగ్గర పరిశ్రమలు ఏర్పాటయ్యే చోట ప్రధాని సభను వర్చువల్గా చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను స్వయంగా మంత్రి లోకేష్ పర్యవేక్షించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
Story Board : పసిడి అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్న కంపెనీలు.. సామాన్యుల బలహీనతలే టార్గెటా?
-
Israel: ఇజ్రాయెల్పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
-
Vijay Deverakonda : “వాళ్ల జోలికొస్తే నేను ఊరుకోను”.. స్టేజ్ మీదే వార్నింగ్ ఇచ్చిన విజయ్ దేవరకొండ!
-
OTR : కుప్పంలో పాత నేత మళ్ళి కీలక బాధ్యత లోకి రాబోతున్నారా?
-
Sandeep Reddy Vanga: ‘అప్పుడే అర్థమైంది..’ ఆనంద్ గురించి ఆసక్తికర విషయం చెప్పిన సందీప్ రెడ్డి వంగా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: వైస్ కెప్టెన్ ఎందుకు చేశారన్నారు.. కెప్టెన్కే సలహాలు ఇస్తున్న వైభవ్.. వీడియో వైరల్!
-
Harry Potter అభిమానులకు గుడ్ న్యూస్.. Realme కొత్త స్పెషల్ ఎడిషన్ లాంచ్.!
-
Homemade Pani Puri: పానీపూరి అంటే ఇష్టమా? బయట బండి దగ్గర ఉండే టేస్ట్.. ఇంట్లోనే సులువుగా ఇలా చేసుకోండి ఇలా.!
-
Pigeons Problem: పావురాల బెడదతో విసిగిపోయారా..? ఈ చిట్కాలతో సింపుల్ గా సమస్యకు చెక్ పెట్టండి ఇలా.!
-
200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Huawei Pura X View లాంచ్..!