PM Modi Vizag Tour: విశాఖ పర్యటనకు ప్రధాని మోడీ.. రోడ్ షో, బహిరంగ సభపై ప్రభుత్వం ఫోకస్!
- విశాఖ పర్యటనకు ప్రధాని మోడీ
- ప్రధాని పర్యటన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న లోకేష్
- రోడ్ షో, బహిరంగ సభపై ప్రభుత్వం ఫోకస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈనెల 8న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటన కోసం పటిష్ఠమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆరోజు మధ్యాహ్నం 2 గంటలకు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో నేవల్ వైమానిక స్థావరం ఐఎన్ఎస్ డేగాకు మోడీ చేరుకుంటారు. ఎయిర్ పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో బహిరంగ సభ జరిగే ఆంధ్రా యూనివర్శిటీ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండుకు చేరుకుంటారు. దత్త ఐలాండ్ నుంచి ఏయూ గ్రౌండ్ వరకు భారీ రోడ్ షో నిర్వహించే విధంగా షెడ్యుల్ ఫిక్స్ అయింది. 60 వేల మందికి పైగా ప్రధాని రోడ్ షో పాల్గొనే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దాదాపు కిలోమీటరున్నర దూరం ఓపెన్ టాప్ వాహనంపై ప్రధాని రోడ్ షో చేస్తారు. పీఎం వెంట సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఉంటారు.
కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీఏ డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పడిన తర్వాత ప్రధాని మోడీ తొలిసారి విశాఖకు వస్తున్నారు. ఉత్తరాంధ్ర చిరకాల కోరిక దక్షిణ కోస్తా రైల్వే జోన్ కేంద్ర కార్యాలయం నిర్మాణం, పుడిమడకలో NTPC గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్, నక్కపల్లి దగ్గర బల్క్ డ్రగ్ పార్క్ నిర్మాణాలకు మోడీ శంకుస్థాపన చేస్తారు. ఉమ్మడి విశాఖ జిల్లా సమగ్ర అభివృద్ధిలో కీలకమైన ప్రాజెక్టుల్లో వేల కోట్లు పెట్టుబడులు రానున్నాయి. ఈ నేపథ్యంలో మోడీ రోడ్ షో, బహిరంగ సభ వేదిక, జనసమీకరణపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది.
Also Read
- LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
- Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
- Vaibhav Sooryavanshi: వైభవ్ ఎంట్రీపై పార్థివ్ పటేల్ సంచలన వ్యాఖ్యలు.. భావోద్వేగం గెలిచింది.. కానీ..!
- మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
ఆంధ్రా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల మైదానంలో బహిరంగ సభకు ప్రధాన వేదిక పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సభకు విశాఖ, అనకాపల్లి, ఉత్తరాంధ్రలోని ఇతర జిల్లాల నుంచి దాదాపు 2 లక్షల మంది వస్తారని అంచనా. ఆ మేరకు జిల్లా యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. అటు, పుడిమడక, నక్కపల్లి దగ్గర పరిశ్రమలు ఏర్పాటయ్యే చోట ప్రధాని సభను వర్చువల్గా చూసే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి ప్రధాని వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లను స్వయంగా మంత్రి లోకేష్ పర్యవేక్షించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఉత్తరాంధ్ర జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
తాజావార్తలు
-
LPG Connection Transfer Rules: ఎల్పీజీ వినియోగదారులకు అలర్ట్.. ఈ 5 రూల్స్ పాటించకపోతే కనెక్షన్ కట్..!
-
Deepika Padukone: 40 ఏళ్ల వయసులో రెండోసారి తల్లి కాబోతున్న దీపిక… త్వరలోనే గుడ్ న్యూస్
-
PM Modi: 2030 నాటికి వాణిజ్యం రెట్టింపు లక్ష్యం.. మోడీ పర్యటనలో భారత్-న్యూజిలాండ్ కీలక నిర్ణయాలు
-
Jagga Reddy: ట్విస్ట్ మాములుగా లేదుగా.. సంగారెడ్డిలో పోటీ చేయనన్నా.. కానీ, వేరే చోట పోటీ చేయనలేదు కదా.!
-
CP Tarun Joshi: 20 నిమిషాల్లోనే ఆరుగురిని చంపేసిన రాజ్ కుమార్.. సంచలన విషయాలు వెలుగులోకి
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ, HD+ డిస్ప్లే, IR బ్లాస్టర్తో రాబోతున్న Itel Zeno 100 Pro.!
-
డాల్బీ ఆటమ్స్ సపోర్ట్, AI కెమెరా ఫీచర్లతో గ్రాండ్ ఎంట్రీకి సిద్దమైన TECNO CAMON 50 Ultra 5G..!
-
IND vs ENG: భారత్తో సిరీస్లో మజా లేదు.. మేమే ప్రపంచ నంబర్-1.. బ్రూక్ సంచలన వ్యాఖ్యలు!
-
Australia-IPL Match: ఆస్ట్రేలియాలో ఐపీఎల్ మ్యాచ్.. బీసీసీఐతో క్రికెట్ ఆస్ట్రేలియా రహస్య చర్చలు!
-
Virat Smartphone సిరీస్.. లావా, ఫ్లిప్కార్ట్ భాగస్వామ్యం.!